Holi 2025: హోలీ వేడుకల్లో గంజాయి విక్రయాలు.. గంజాయి కలిపిన కుల్ఫీ ఐస్ క్రీమ్, స్వీట్స్ విక్రయం
- హోలీ వేడుకల్లో గంజాయి విక్రయాలు
- ఎక్సైజ్ STF దాడులు, పలు అరెస్టులు
- మత్తు పదార్థాలు స్వాధీనం
Holi 2025: హైదరాబాద్ నగరంలోని దూల్పేట్లో హోలీ వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతుండగా, కొన్ని ప్రాంతాల్లో గంజాయితో తయారైన కుల్ఫీ, ఐస్ క్రీమ్, బాదాం మిల్క్, స్వీట్స్ విక్రయాలు జరుగుతున్నాయి. ఈ మత్తు పదార్థాల విక్రయంపై నిఘా పెట్టిన ఎక్సైజ్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (STF) బృందం దూకుడుగా దాడులు నిర్వహించి అనేక మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. హోలీ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈవెంట్స్లో హానికరమైన మత్తు పదార్థాలను ప్రజలకు విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దూల్పేట్ ప్రాంతంలోని మల్చిపురా ప్రాంతంలో గంజాయి కలిపిన కుల్ఫీ, ఐస్ క్రీమ్, బర్ఫీ స్వీట్స్, సిల్వర్ కోటెడ్ గంజాయి బాల్స్ విక్రయాలు జరుగుతున్నాయి. మామూలుగా కనిపించే ఈ స్వీట్స్, ఐస్ క్రీమ్లు తిన్న వారు మత్తులోకి వెళ్లిపోతుండటంతో ఈ అక్రమ కార్యకలాపంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
ఈ సమాచారం ఆధారంగా హోలీ రోజు దూల్పేట్ ప్రాంతంలో ఎక్సైజ్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో గంజాయితో తయారుచేసిన కుల్ఫీ, ఐస్ క్రీమ్, బర్ఫీ స్వీట్, సిల్వర్ కోటెడ్ గంజాయి బాల్స్ స్వాధీనం చేసుకుంది. మత్తు పదార్థాలను భక్ష్య పదార్థాలలో కలిపి విక్రయిస్తున్న వారికి వ్యాపారం నిర్వహించేందుకు అనుమతులు లేవని, వీరి ముఠాలో మరెంత మంది ఉన్నారనే కోణంలో విచారణ కొనసాగుతోంది.
Also Read
- Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
- Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
- Raja Shivaji: రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
- Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
ఈ అక్రమ కార్యకలాపంలో ప్రధాన సూత్రధారి సత్యనారాయణ సింగ్ అని గుర్తించి, అతనిపై కేసు నమోదు చేశారు. అతనితో పాటు గంజాయి కలిపిన బాదాం మిల్క్, ఐస్ క్రీమ్, స్వీట్స్ విక్రయించిన నిర్వాహకులపై ఎక్సైజ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోందని, మరింత సమాచారం త్వరలో వెల్లడిస్తామని అధికారులు ప్రకటించారు.
ఈ ఘటనలతో తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. చిన్నారులు, యువత హోలీ వేడుకల్లో పాల్గొనడం సహజం. కానీ, వారు తినే కుల్ఫీ, ఐస్ క్రీమ్ వంటి పదార్థాల్లో గంజాయి కలపడం ఆందోళనకరంగా మారింది. మత్తు పదార్థాల వినియోగం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో గంజాయి విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు పోలీసులు, ఎక్సైజ్ శాఖ చర్యలు తీసుకుంటున్నాయి. హోలీ వేడుకలను ఆసరాగా చేసుకుని మత్తు పదార్థాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. హోలీ సందర్భంగా ఎవరైనా అనుమానాస్పదంగా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు అనిపిస్తే, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
India -Pak: ఉగ్రవాదానికి కేంద్రం ఏదో ప్రపంచానికి తెలుసు.. పాకిస్థాన్పై భారత్ ఆగ్రహం..
తాజావార్తలు
-
Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
-
Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
-
Raja Shivaji: రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!