కార్వీ స్టాక్ బ్రోకింగ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఆ సంస్థ ఎండీ పార్థసారథితో పాటు పలువురు ఉన్నతాధికారులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. వివిధ రాష్ట్రాల్లో కేసులు నమోదు కావడంతో ఆ సంస్థ ప్రతినిధులు బెయిల్ రాక ఇప్పటికీ జైళ్లలోనే ఉన్నారు. తాజాగా రజినీ అనే వాటాదారు కార్వీ ఆస్తులు అమ్మకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్పై ఎన్సీఎల్టీ (NCLT) విచారణ జరిపింది. Read Also: వాలంటీరే కాలయముడు.. కల్తీ కల్లు మరణాల కేసులో…
అనుమానం పెనుభూతంగా మారింది. ఒక చిన్న అనుమానం ఒక వ్యక్తి ప్రాణం తీసేవరకు వచ్చింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. గుణకు సమీపంలోని లాడ్పుర్ గ్రామానికి చెందిన అరవింద్ అనే వ్యక్తి భార్యాపిల్లలతో నివసిస్తున్నాడు. ఆదివారం అర్ధరాత్రి వారింటికి కొంతమంది వ్యక్తలు వచ్చి అతడిని బయటికి లాకొచ్చారు. తమ వద్ద కాజేసిన ఫోన్ ఇవ్వాల్సిందిగా అరుస్తూ అతడిని చితకబాదారు. తనకేమి తెలియదని అరవింద్ చెప్తున్నా వినకుండా అతడి బట్టలను విప్పి, అతని చేతులు…
ప్రస్తుతం సమాజంలో చాలామందికి ప్రాణం విలువ తెలియడంలేదు. చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యలకు పాల్పడి నిండు ప్రాణాలను తీసుకుంటున్నారు. అమ్మ తిట్టిందని, నాన్న కొట్టాడని, పరీక్షా ఫెయిల్ అయ్యానని ఇలా చిన్నచిన్నవాటికే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒక యువతి తల్లిదండ్రులు తిట్టారనే అవమానభారంతో ఆత్మహత్యకు పాల్పడిన వరంగల్ లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. నెక్కొండ రజక వాడకు చెందిన అమృత, చెల్లెలు అంజలి, తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. అయితే గత కొన్ని రోజులుగా అమృత అదే గ్రామానికి…
మీ సేవింగ్స్, కరెంట్ అకౌంట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లో ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి బ్యాంకు పేరుతో కనిపించే నెంబర్ కి ఫోన్ చేసి వివరాలు ఇచ్చారంటే మీ అకౌంట్లో డబ్బులు ఖాళీ అవుతాయి. తస్మాత్ జాగ్రత్త. కామారెడ్డి జిల్లా కి చెందిన ఓ కస్టమర్ కి ఇలాంటి అనుభవమే ఎదురైంది. కామారెడ్డి వాసి జొన్నల ప్రసాద్ ఏటీఎం కార్డు కోసం ఇంటర్నెట్లో దొరికిన నెంబర్ కి ఫోన్ చేస్తే ఖాతా నుంచి అక్షరాలా…
ప్రస్తుతం సమాజంలో భార్యాభర్తలు ఇద్దరు పనిచేయకపోతే ఇల్లు గడవని పరిస్థితి. పట్నంలో ఉంటూ ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళిపోతే పిల్లలను చూసుకునేవారు ఉండరు. ఇక దీంతోనే పట్నాలలో బేబీ కేర్ సెంటర్లు ఎక్కువైపోయాయి. పిల్లలను సెంటర్ లో వదిలి తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్తుంటారు. ఇంకొంతమంది ఇంట్లోనే కేర్ టేకర్ ని నియమించుకుంటారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఎదుటివారి పిల్లలను కేర్ టేకర్స్ చూసుకుంటారు అనుకోవడం మన పిచ్చితనమే అవుతుంది. ఎందుకంటే చాలా సార్లు పిల్లలపై కేర్ టేకర్స్…
సమాజంలో రోజురోజుకు కామాంధులు ఎక్కువైపోతున్నారు. ఆడవారికి ఎక్కడా రక్షణ లేకుండా పోతుంది. ఇల్లు, స్కూల్, పోలీస్ స్టేషన్, హాస్పిటల్ కూడా వారికి రక్షణ ఇవ్వలేకపోతున్నాయి. చివరికి కోవిడ్ టెస్టుకు వచ్చిన మహిళలను కూడా కామాంధులు వదలడంలేదు. తాజాగా ఒక ల్యాబ్ టెక్నీషియన్.. కరోనా టెస్ట్ అని చెప్పి ఒక యువతి ప్రైవేట్ భాగంలో చేతులు పెట్టి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ కేసులో అతనికి నాయస్థానం పదేళ్లు జైలు శిక్ష విధించింది. ఈ ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది.…
ప్రస్తుత సమాజంలో ఎవరిని నమ్మలేకపోతున్నాం.. ఎక్కడా నమ్మకం అనేది లేకుండా పోతుంది. ముఖ్యంగా మోసం చేసేవారు ఎక్కువైపోతున్నారు. అమాయకులను వలలో వేసుకొని వారివద్ద నుంచి డబ్బులు గుంజడమో లేక వారిని అడ్డు పెట్టుకొని డబ్బులు సంపాదించడమే చేస్తున్నారు. తాజగా ఒక యువకుడు ఇలాగే మోసపోయిన ఘటన బెంగుళూరులో వెలుగు చూసింది. వివరాలలోకి వెలితే.. బెంగళూరు ఆస్టిన్టౌన్కు చెందిన యువకుడు కొన్ని రోజుల క్రితం తన స్నేహితురాలితో కలిసి హోటల్ రూమ్ కి వెళ్ళాడు. అక్కడ ఆమెతో ఏకాంతంగా గడిపాడు.…
నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్దరాత్రి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారీ కిడ్నాప్ కలకలం రేపుతోంది. నిన్న అర్దరాత్రి కింగ్ కోటి ఈడెన్ గార్డెన్ వద్ద ఘటన చోటు చేసుకుంది. అయితే నాంపల్లి లోని ఆగపురకు చెందిన షేక్ గుయోష్ పాషా (60) రియల్ ఎస్టేట్ వ్యాపారిని ఆగంతకులు కిడ్నాప్ చేశారు. నిన్న ఈడెన్ గార్డెన్స్ లో ఓ వివాహానికి షేక్ గుయోష్ పాషా హాజరయ్యాడు. ఈ నేపథ్యంలో షేక్ గుయోష్ పాషా తిరిగి ఇంటికి వెళుతుండగా,…
కరీంనగర్ జిల్లాలో సంచలనం కలిగించిన కమాన్ కారు ప్రమాదంలో సంచలన అంశాలు బయట పడుతున్నాయి. కారు నడిపింది మైనర్ బాలుడని తేలింది. ఈ ప్రమాద సమయంలో కారులో మరో ఇద్దరు మైనర్లు వున్నారని అంటున్నారు. ప్రమాదం జరిగే ఐదు నిమిషాల ముందు కమాన్ చౌరస్తా లోని పెట్రోల్ బంక్ లో ఇంధనం నింపుకుని రాంగ్ రూట్ లో ఓవర్ స్పీడ్ తో డ్రైవ్ చేశాడు మైనర్ బాలుడు. డ్రైవింగ్ రాకపోవడమే ప్రమాదానికి ప్రధాన కారణం అని చెబుతున్నారు…
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో నేరాలు ఘోరాలకు అంతే లేకుండా పోతోంది. తాజాగా శేరిలింగంపల్లి సమీపంలోని తెల్లాపూర్ లో దారుణం జరిగింది. తెల్లాపూర్ లో రియల్టర్ దారుణహత్యకు గురవడం కలకలం రేపుతోంది. నిన్నటి నుంచి కనపడకుండా పోయిన కడవత్ రాజు చివరకు హత్యకు గురయ్యాడు. రియల్ ఎస్టేట్ లావాదేవీల కారణంగానే కిడ్నాప్ చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాత ఘర్షణల కారణంగానే హత్య జరిగి ఉండవచ్చని భావిస్తున్న పోలీసులు కడవత్ రాజు బంధువుల్ని…