Crime News: మరో వ్యక్తితో సహజీవనం.. రాత్రి ఇంటికొచ్చి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భర్త చనిపోవడంతో మరో వ్యక్తితో సహజీవనం చేస్తోన్న ఓ మహిళ.. శనివారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. కోట మండలం చిట్టేడుకు చెందిన గెడి నిరూప (28) 2016లో అదే గ్రామానికి చెందిన కొమ్మ రాజశేఖర్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి ప్రేమకు ముందునుంచే నిరూప తల్లిదండ్రులు వ్యతిరేకంగా ఉన్నారు. అయినా తమ మాట వినకుండా రాజశేఖర్ను పెళ్ళి చేసుకోవడంతో వాళ్ళు కోపంతో రగిలిపోయారు. ఈ క్రమంలోనే 2018లో నిరూప తండ్రి రామయ్య తన అల్లుడు రాజశేఖర్ను హత్య చేశాడు.
భర్త చనిపోవడంతో.. నిరూప తన బిడ్డ ప్రీతిని తీసుకొని అత్తమామల దగ్గరకు వెళ్లింది. కొన్నాళ్ల తర్వాత నిరూపకు శ్రీసిటీలో ఉద్యోగం వచ్చింది. ఈ క్రమంలో ఈమెకు దక్కిలి మండలానికి చెందిన పరశురామ్తో పరిచయం ఏర్పడింది. కూతురితో ఒంటరిగా ఉన్న తనకు తోడుగా ఉంటాడన్న నమ్మకంతో.. పరశురామ్కు దగ్గరైంది. పూడి గ్రామంలో అతనితో సహజీవనం చేస్తోంది. ఇంతలో ఏమైందో ఏమో తెలీదు. నిరూప జీవితం మళ్లీ చీకటిమయం అయ్యింది. దీంతో ఆమె శనివారం రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత, తన నాలుగేళ్ల కుమార్తె ప్రీతికి బిస్కెట్లు పెట్టి, అనంతరం చీరతో ఉరేసుకుంది. ఈ విషయం గమనించిన చిన్నారి ఏడుస్తూ ఉండడంతో స్థానికులు ఇంటికి చేరుకున్నారు. అయితే, అప్పటికే నిరూప మృతి చెందింది.
Also Read
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం నిరూప మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రులకు అప్పగించేందుకు ప్రయత్నించగా.. వాళ్లు అంగీకరించలేదు. దీంతో పోలీసులే పోలీసులే అంత్యక్రియలు పూర్తి చేశారు. చిన్నారి ప్రీతిని తాత ఆదినారాయణకు అప్పగించారు. అయితే.. నిరూప ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలేంటో ఇంకా తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
APEAPCET: ఏపీఈఏపీసెట్ ఫలితాలు విడుదల
-
RC18: గురువు తర్వాత శిష్యుడే.. రామ్ చరణ్ మాటతో భారీ అడ్వాన్స్ ఇచ్చిన టాప్ ప్రొడ్యూసర్!
-
Kejriwal: సనాతనం అంటే అధికారం.. డబ్బేనా? అయోధ్య స్కామ్లో బీజేపీపై కేజ్రీవాల్ విమర్శలు
-
Nagabandham : ‘నాగబంధం’ ధైర్యం వెనుక అసలు నిజమిదే!
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..