Home
Congress Rachabanda
Congress Rachabanda News
-
Anvesh Reddy: ధరణి భూ సమస్యలు సృష్టిస్తోంది..
tpcc anvesh reddy react on dharani portal. TPCC Kisan Congress, Anvesh Reddy, Breaking News, Latest Telugu News, Congress Rachabanda, . -
Ponnala Lakshmaiah : కొనుగోలు కేంద్రాల్లో రైతులను మోసం చేస్తున్నారు
వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులు దీనావస్థలో ఉన్నారని మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. రైతులకు మద్దతు ధర లభించడం లేదని, నాణ్యత ప్రమాణాలు కూడా పాటించడం లేదని ఆయన ఆరోపించారు. 33 శాతం ధాన్యంలో ఇబ్బంది ఉన్నా కొనాలన్న లక్ష్మయ్య.. వడ్లు పోయకున్న మిషన్ లో తేమ శాతం 1.5 చూపిస్తుందని మండిపడ్డారు. ఎండకు కాలే ఇసుకలో కూడా 18 శాతం తేమ చూపిస్తుందని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఇలా మోసం… -
MLA Jagga Reddy : జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏమయ్యాయి..?
తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన రైతు రచ్చబండ కార్యక్రమం రాష్ట్రంలోని అన్ని జిల్లా్ల్లో కొనసాగుతోంది. అయితే తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలు హామీలుగానే మిగిలిపోయాయని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో ఎన్నో వాగ్ధానాలు చేశారు.. సమైక్య రాష్ట్రంలో ఉన్న ఆసుపత్రులే కొనసాగుతున్నాయి కానీ.. కొత్తవేమి లేవని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఇచ్చిన హామీ 8 ఏండ్లు అవుతున్నా ఎందుకు అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ దేశ రాజకీయాల్లో బిజీ అయ్యి… ఇచ్చిన హామీలు… -
Geetha Reddy : ఢిల్లీ సరే.. నీ గల్లీ దవాఖాన సంగతేంది..?
రాహుల్ గాంధీ వరంగల్లో ప్రకటించిన రైతు డిక్లరేషన్ రాష్ట్రంలోని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలంగాణ కాంగ్రెస్ రైతు రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలో ఊరురా కాంగ్రెస్ నాయకులు ప్రజలతో మమేకమవుతూ.. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్తో పాటు.. తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఇటీవల ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ ఢిల్లీ బస్తీ దవాఖానలు బాగున్నాయి అన్నారని.. అంటే తెలంగాణలో ఆసుపత్రులు బాగోలేవనే కదా అంటూ చురకలు అంటించారు పీసీస వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి గీతారెడ్డి.… -
Congress Leader Geetha Reddy : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తాం..
ఇటీవల రాహుల్ గాంధీ వరంగల్లో ప్రకటించిన రైతు డిక్లరేషన్ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలంగాణ కాంగ్రెస్ రైతు రచ్చబండ పేరిట కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కోదాడ పురపాలకలో కోమరబండలో కాంగ్రెస్ రైతు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. అయితే కార్యక్రమంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కోదాడ నియోజకవర్గంలో ఇక్కడ ఎమ్మెల్యే స్యాండ్, ల్యాండ్ మైన్ దందాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్… -
Nandikanti Sridhar: ఎలా తిరుగుతావో చూస్తామంటూ మల్లారెడ్డికి వార్నింగ్
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలకు మల్కాజగిరి డీసీసీ నందికంటి శ్రీధర్ కౌంటర్ ఇచ్చారు. ప్రజల సమస్యలకు సమాధానం చెప్పకుండా, మల్లారెడ్డి డ్రామాలాడారంటూ ఆరోపించారు. నీ చరిత్ర అందరికీ తెలిసిందేనని చెప్పిన ఆయన.. ‘జవహర్ నగర్లో కట్టిన ఆసుపత్రి నిర్మాణంలో తప్పు లేదా? కంటోన్మెంట్లో బీ1 ల్యాండ్లో కట్టిన ఫంక్షన్ హాల్ తప్పు కాదా?’ అంటూ నిలదీశారు. జోకర్లాగా మాట్లాడి, మీ సిగ్గు మీరే తీసుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. ‘రేవంత్ రెడ్డిని… -
Dasyam Vinay Bhasker: రేవంత్ ‘రచ్చబండ’ వ్యాఖ్యలకు కౌంటర్
అక్కంపేట రచ్చబండలో భాగంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కౌంటర్ ఇచ్చారు. పార్టీ ఉనికి కాపాడుకోవడం కోసం రేవంత్ జోకర్ మాటలు మాట్లాడుతున్నారని, జయశంకర్ సార్ గురించి మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ బండికి జయశంకర్, కేసిఆర్లు జొడెడ్లలాగా పనిచేశారన్నారు. ఉద్యమ సమయంలో చంద్రబాబు రాసిన స్క్రిప్ట్లో రేవంత్ ఓ పాత్రదారుడని అన్నారు. తెలంగాణ రైతాంగం గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్కు ఏమాత్రం లేదని మండిపడ్డారు. రైతు… -
Revanth Reddy: 12 నెలల్లో అధికారంలోకి కాంగ్రెస్… 2 లక్షల రుణమాఫీ
వరంగల్ రైతు డిక్లరేషన్ ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ ‘రైతు రచ్చబండ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గంలో పర్యటించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్ పై మరోసారి విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి. తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ సార్ సొంతూరు అక్కంపేట లో అభివృద్ధి శూన్యంమని…. ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయకుండా… ఉనికే లేకుండా చేశారని విమర్శించారు. తుంకి మెట్ల లో… -
Revanth Reddy: నేడు వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ రైతు రచ్చబండ
కాంగ్రెస్ పార్టీ జనాల్లోకి వెళుతోంది. ఎన్నికలకు మరో ఎడాదిన్నర ఉండటంతో తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ వాతావరణ వేడెక్కుతోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా గుర్తింపు ఉన్న కాంగ్రెస్… దాన్ని మాత్రం ఓట్లుగా మార్చుకోలేకపోతున్నారు. అయితే ఈ సారి మాత్రం తెలంగాణలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రయత్నిస్తోంది. దీంతో పాటు పార్టీలో నెలకొన్న అసమ్మతిని తగ్గించేందుకు ఇటీవల కాంగ్రెస్ పెద్దలతో రాహుల్ గాంధీ ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. దీంతో పాటు ఇటీవల వరంగల్ వేదికగా రాహుల్ గాంధీ… -
Revanth Reddy: జయశంకర్ సొంతూరులో రచ్చబండ.. కేసీఆర్ను దంచుడే, దించుడే..!
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సొంతూరు అక్కంపేట నిరాధారణకు గురైందన్నారు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి.. హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని ప్రొఫెసర్ జయశంకర్ సొంతూరు అక్కంపేటలో రైతు రచ్చబండ నిర్వహించిన రేవంత్రెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎక్కడ దోపిడీ ఉంటుందో అక్కడ తిరుగుబాటు ఉంటుందన్నారు.. కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే ప్రగతిభవన్ గడి గోడలు బద్దలు కొడతామని హెచ్చరించారు.. జయశంకర్ సార్ సొంతూరు అక్కంపేటలో కనీసం ఆయన విగ్రహం పెట్టలేదని మండిపడ్డ ఆయన.. చివరకు కొండా దంపతులే…
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!