Revanth Reddy: 12 నెలల్లో అధికారంలోకి కాంగ్రెస్… 2 లక్షల రుణమాఫీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరంగల్ రైతు డిక్లరేషన్ ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ ‘రైతు రచ్చబండ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గంలో పర్యటించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్ పై మరోసారి విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి. తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ సార్ సొంతూరు అక్కంపేట లో అభివృద్ధి శూన్యంమని…. ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయకుండా… ఉనికే లేకుండా చేశారని విమర్శించారు. తుంకి మెట్ల లో కూడా టీఆర్ఎస్ ను తరిమి కొట్టేందుకు తీర్మానం చేయాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్ , కేటీఆర్ లను తెలంగాణ పొలిమేర దాటే వరకు తరమాలని.. ఈ ప్రాంతానికి రైలు మార్గము కేసీఆర్ రాకుండా చేశారని ఆరోపించారు. కొడంగల్ కు కృష్ణా జలాల కోసం నారాయణ పేట-కొడంగల్ ఎత్తిపోతల కు 69 జీవో తెచ్చానని..కొడంగల్ అభివృద్ధి అనేది తాను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడే జరిగిందని రేవంత్ రెడ్డి అన్నారు. 2011 లోనే కొడంగల్ కు తాగునీటి శాశ్వత పరిష్కారం చూపానని వెల్లడించారు. ఈ నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్న …కేటీఆర్ అభివృద్ధి పై చర్చకు సిద్ధమా…? అంటూ సవాల్ విసిరారు.
Also Read
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
- Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
- CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
తెలంగాణ ఇచ్చినాక పేదలకు మేలు జరగలేదని.. తెలంగాణ లో బాగుపడింది కేసీఆర్ కుటుంబమే అని విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్, రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారని… అందుకే రైతు డిక్లరేషన్ చేసామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2500 రూపాయలు క్వింటాలు కొంటామని.. పండించిన చివరి గింజ వరకు కొంటామని హామీ ఇచ్చారు. రైతు డిక్లరేషన్ ను కాంగ్రెస్ క్యాడర్ గ్రామ గ్రామాన తెలియపరచాలి.. బ్యాంక్ రుణాలు బాకీ ఉన్న వారు ఒక్క రూపాయి చెల్లించకండని అన్నారు. 12 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది… 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తుందని, రైతులు అప్పులున్నవారు ఆత్మహత్యలు చేసుకోకండి భరోసా ఇచ్చారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!