Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?
- 2008 నుంచి 2021 వరకు సీఎస్కే ఆడిన సురేష్ రైనా
- 205 మ్యాచ్లలో 5,528 పరుగులు
- సీఎస్కేపై తనకున్న అనుబంధాన్ని మరోసారి వెల్లడించిన రైనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suresh Raina Reveals Why He Rejected Captaincy in IPL: టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు ఎన్నో ఏళ్లు ఆడాడు. 2008 నుంచి 2021 వరకు సీఎస్కే తరఫున ఆడిన రైనా.. 205 మ్యాచ్లలో 5,528 పరుగులు చేశాడు. 2013లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్పై సెంచరీ (100 నాటౌట్) బాదాడు పరుగులు. 2012 ఫైనల్లో కేకేఆర్పై 38 బంతుల్లో 73 పరుగులు, 2014 క్వాలిఫయర్లో పంజాబ్పై 87 పరుగులు అతడి ఐపీఎల్ కెరీర్లో బెస్ట్ ఇన్నింగ్స్. చెన్నై తరఫున 8 సీజన్లలో 400+ పరుగులు చేసిన రైనా.. చివరి మ్యాచ్ 2021లో అక్టోబర్ 2న రాజస్థాన్ రాయల్స్పై ఆడాడు. ఐపీఎల్ 2026 నేపథ్యంలో సీఎస్కేపై తనకున్న అనుబంధాన్ని రైనా మరోసారి వెల్లడించాడు.
ఐపీఎల్లో ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్లు వచ్చినప్పటికీ, సీఎస్కే జట్టును వీడాలని తాను ఎప్పుడూ అనుకోలేదని సురేష్ రైనా స్పష్టం చేశాడు. ‘నేను ఉత్తరప్రదేశ్ జట్టుకు కెప్టెన్గా పనిచేశా. సీఎస్కేకు కూడా కొన్ని మ్యాచ్లలో నాయకత్వం వహించా. ఐపీఎల్లో ఇతర ఫ్రాంచైజీలు నన్ను సంప్రదించి కెప్టెన్సీ ఆఫర్ ఇచ్చినా.. నేను స్వీకరించలేదు. అందుకు కారణం ఎంఎస్ ధోనీ. మనమిద్దరం సీఎస్కేకు కెప్టెన్లమే, నువ్వు నా కెప్టెన్, నేను నీ కెప్టెన్ అని ధోనీ ఎప్పుడూ చెప్పేవాడు. ఆ మాటలే నాకు ఎంతో ప్రేరణనిచ్చాయి. అందుకే జట్టు మారాల్సిన అవసరం అనిపించలేదు’ అని రైనా చెప్పాడు.
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
- T20 World Cup: మహిళా ప్రపంచకప్లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..
Also Read: Ganja Smuggling: గంజాయి కేటుగాళ్లుగా కానిస్టేబుల్స్.. విశాఖలో ఐదుగురు అరెస్ట్!
‘నాకు వ్యక్తిగత విజయాల కంటే జట్టు విజయాలే ముఖ్యం. ప్లేయర్గా జట్టుకు విజయం అందించడం, సహచర ఆటగాళ్లకు సహాయం చేయడం నా కర్తవ్యం. నేను ఐపీఎల్లో కెప్టెన్సీ గురించి ఎప్పుడూ పెద్దగా ఆలోచించలేదు. కెప్టెన్సీ కోరుకుంటే ఎప్పుడో అయ్యేవాడిని. చెన్నై జట్టు నాకు ఓ ఫ్యామిలి లాంటిది. జట్టు కోసం ఆడటమే నాకు ముఖ్యం అని భావించా’ అని సురేష్ రైనా స్పష్టం చేశాడు. మొత్తానికి రైనా చేసిన ఈ వ్యాఖ్యలు సీఎస్కే జట్టుపై అతనికున్న నిబద్ధత, ధోనీతో ఉన్న అనుబంధాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Billa Ranga Baasha : 2209 ప్రపంచంలో కిచ్చా సుదీప్ యాక్షన్.. ‘బిల్లా రంగ బాష’ నుంచి బిగ్ అప్డేట్!
-
Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
-
Astrology: స్నేహానికి ఎక్కువ విలువ ఇచ్చే 4 రాశులు వీరేనా? ఫ్రెండ్ కోసం ఎంత దూరమైనా వెళ్తారట!
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!