Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!
- మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 ఆరంభం
- బెంగళూరుకు చేరుకున్న 'కింగ్' కోహ్లీ
- ఇక ఐపీఎల్ ప్రత్యర్థులకు డబిడదిబిడే
Virat Kohli Returns to RCB Ahead of IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్కు ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బెంగళూరుకు చేరుకున్నాడు. రావడమే ఆలస్యం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఆటగాళ్లతో కలసి ప్రాక్టీస్ ప్రారంభించాడు. కింగ్ రాకతో ఆర్సీబీలో కొత్త ఉత్సాహం వచ్చింది. విరాట్ ఇప్పుడు ఆర్సీబీ టైటిల్ డిఫెన్స్కు సిద్ధమవుతున్నాడు. గత సీజన్లో ఆర్సీబీ చారిత్రాత్మక విజయం సాధించడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
గత సీజన్లో విరాట్ కోహ్లీ అద్భుత ఫామ్ కనబర్చాడు. మొత్తం 657 పరుగులు సాధించి.. 144.71 స్ట్రైక్ రేట్, 54.75 సగటుతో ఎనిమిది అర్ధశతకాలు నమోదు చేశాడు. కింగ్ నిలకడైన ప్రదర్శన ఆర్సీబీకి 18 ఏళ్ల టైటిల్ దాహాన్ని తీర్చడంలో ముఖ్య పాత్ర పోషించింది. ఈ విజయంతో ఆర్సీబీ కొత్త చరిత్ర సృష్టించింది. మరోవైపు నాయకత్వంలో రాజత్ పటిదార్ కీలక పాత్ర పోషించాడు. టైటిల్ గెలిచిన ఆర్సీబీ.. అదే ఫామ్ను కొనసాగిస్తూ మరోసారి విజయం సాధించడం పెద్ద సవాల్గా మారింది. ఈసారి కూడా కోహ్లీ ప్రదర్శనపై జట్టు భారీగా ఆశలు పెట్టుకుంది.
Also Read
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- PBKS vs RR: పంజాబ్ కింగ్స్కి అగ్నిపరీక్ష.. టాస్ గెలిచిన రాజస్థాన్! జట్టును రక్షించే బాధ్యత శ్రేయస్ అయ్యర్దే!
- Womens T20 World Cup 2026: ప్రపంచ కప్ కు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్.. టీంలో ఎవరెవరు ఉన్నారంటే.?
- Shreyas Iyer: "నీ వల్ల కాదు అంటే తట్టుకోలేను".. విమర్శకులకు శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్ కౌంటర్..
ఇటీవల విరాట్ కోహ్లీ టీ20, టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతను వన్డేలు, ఐపీఎల్పైనే దృష్టి సారిస్తున్నాడు. దీంతో ప్రతి మ్యాచ్కు మరింత ప్రాధాన్యత పెరిగింది. 37 ఏళ్ల వయస్సులోనూ కోహ్లీ తన క్లాస్ను కొనసాగిస్తూ అగ్రశ్రేణి బ్యాటర్గా నిలుస్తున్నాడు. ఇటీవల వన్డేల్లో కూడా అద్భుత ప్రదర్శన కనబర్చాడు. దక్షిణాఫ్రికాపై 135, 102, 65 నాటౌట్ పరుగులు చేయగా.. న్యూజిలాండ్పై 93, 124 పరుగులు చేసి తన స్థిరత్వాన్ని చాటాడు.
Also Read: Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి పండగపూట అన్ని విజయాలే!
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఇప్పటికే 267 మ్యాచ్ల్లో 8,661 పరుగులు చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. ఎనిమిది సెంచరీలతో రికార్డు కూడా అతడి పేరిటే ఉంది. ఐపీఎల్ 2026లో ఆర్సీబీ తమ తొలి మ్యాచ్ను మార్చి 28న బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్తో ఆడనుంది. ఈ సీజన్లో కోహ్లీ ఎలా రాణిస్తాడో, ఆర్సీబీ టైటిల్ను కాపాడుకుంటుందో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
తాజావార్తలు
-
West Bengal Assembly Election 2026: చివరి దశ ఓటింగ్కు సిద్ధమైన బెంగాల్.. భవానీపుర్లో మమతా-సువేందు ఫేస్ ఆఫ్
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో