Bhatti Vikramarka : సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. అది ప్రజల కోసం ఉండాలి
- గద్దర్ అవార్డ్స్ పునఃప్రారంభంపై భట్టి హర్షం
- “గద్దర్ ఒక వ్యక్తి కాదు.. ఒక వ్యవస్థ”
- సినిమా సమాజానికి దిశానిర్దేశం చేయాలి
- పారదర్శకంగా అవార్డుల ఎంపికపై ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ గడ్డపై కళలకు, కళాకారులకు అత్యున్నత గౌరవం కల్పించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025’ను నిర్వహించింది. హైదరాబాద్లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ వేడుకలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దాదాపు పదేళ్లుగా నిలిచిపోయిన సినీ అవార్డుల ప్రదానోత్సవాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో మళ్లీ పునఃప్రారంభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ప్రజా గాయకుడు గద్దర్ పేరు మీద ఈ అవార్డులను అందించడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని భట్టి విక్రమార్క వివరించారు. గద్దర్ కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదని, ఆయనొక వ్యవస్థ అని కొనియాడారు. తెలంగాణ ఆత్మను, ఇక్కడి పాటను, ఆటను ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప కళాకారుడికి ఇచ్చే అసలైన గౌరవం ఇదని ఆయన పేర్కొన్నారు.
Also Read
- Tridha: బాబీ డియోల్తో బోల్డ్ సీన్లే బ్రేకప్కు కారణమా? మాజీ ప్రియుడిపై షాకింగ్ కామెంట్స్ చేసిన త్రిధా!
- Queen 2:13 ఏళ్ల తర్వాత కంగనా సెన్సేషన్.. షూటింగ్ పూర్తి, రిలీజ్పై ఆసక్తి
- Toxic : 'టాక్సిక్’ లేడీస్ & లేడీస్ గ్లిమ్స్ రిలీజ్.. ఈసారి మరింత వైల్డ్గా యశ్
- Varanasi : 'వారణాసి' వార్ సీన్స్.. మైండ్ బ్లోయింగ్ అంతే
తెలుగు చిత్ర పరిశ్రమ కేవలం దక్షిణాదికో లేదా భారతదేశానికో పరిమితం కాకుండా, నేడు హాలీవుడ్ స్థాయికి ఎదిగిందని భట్టి విక్రమార్క గర్వంగా ప్రకటించారు. “సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, అది ప్రజల కోసం ఉండాలి. ‘సత్య హరిశ్చంద్ర’, ‘కన్యాశుల్కం’, ‘రోజులు మారాయి’ వంటి చిత్రాలు సమాజంలోని రుగ్మతలపై పోరాడి మార్పుకు నాంది పలికాయి” అని ఆయన గుర్తుచేశారు. నేటి తరం సినిమాలు కూడా అదే విధంగా సామాజిక సందేశాన్ని ఇస్తూ వాణిజ్యపరంగా విజయాలు సాధించడం అభినందనీయమన్నారు.
ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (FDC) ఆధ్వర్యంలో, దిల్రాజు నేతృత్వంలో జూరీ సభ్యులు అత్యంత పారదర్శకంగా ఈ అవార్డులను ఎంపిక చేశారని డిప్యూటీ సీఎం ప్రశంసించారు. షూటింగ్స్ , ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉన్నప్పటికీ, మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, నాగార్జున వంటి దిగ్గజాలు ఈ వేడుకకు రావడం తెలంగాణ ప్రజలకు గర్వకారణమని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. చివరగా, అవార్డు గ్రహీతలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ.. భవిష్యత్తులో మరిన్ని అర్థవంతమైన పాత్రలు పోషించి సమాజానికి దిశానిర్దేశం చేయాలని భట్టి విక్రమార్క ఆకాంక్షించారు.
తాజావార్తలు
-
Vaibhav: ఒక్కో రన్కు రూ.14 వేల సంపాదన.. భారీగా పెరిగిన వైభవ్ బ్రాండ్ వ్యాల్యూ.. ఇక్కడే బిగ్ ట్విస్ట్!
-
Hardik Pandya-Fan: ఒడిశా టు బెంగళూరు.. హార్దిక్ కోసం 1800 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన అభిమాని!
-
CM Chandrababu: ‘మావిగన్ అంటే నాకే అర్థం కావడం లేదు’.. జగన్పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు..
-
Tamil Nadu Politics: విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.35 కోట్లతో ఎర..!
-
Shreyas Iyer: ఐర్లాండ్ సిరీస్ ఓటమి తీవ్ర నిరాశ కలిగించింది.. కన్నీళ్లు ఆపుకోలేకపోయా!
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..