War Effect: భారత్ గ్యాస్ దిగుమతులపై యుద్ధం దెబ్బ.. ఇంధన పొదుపు తప్పదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతికారంగా ఇరాన్ చేస్తున్న దాడుల వల్ల గల్ఫ్ దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ముఖ్యంగా ఇంధన వనరులు ఎక్కువగా ఉన్న దేశాలలోని చమురు, గ్యాస్ నిలయాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తోంది. తాజాగా ఖతార్లోని అతిపెద్ద గ్యాస్ ప్లాంట్ (Ras Laffan) పై ఇరాన్ క్షిపణి దాడి చేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ ఉత్పత్తి కేంద్రాల్లో ఒకటిగా ఉన్న ఖతార్ ప్లాంట్పై దాడి జరగడంతో అక్కడ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోయింది. అమెరికా, ఆస్ట్రేలియా, రష్యాతో సమానంగా గ్యాస్ ఉత్పత్తి చేసే దేశం ఖతార్. మార్చి మొదటి వారంలో కూడా ఇరాన్ ఇలాంటి దాడులే చేయడంతో గ్యాస్ ఎగుమతులు నిలిచిపోయాయి. ఇజ్రాయెల్ తనపై చేసిన దాడులకు బదులుగానే ఇరాన్ ఈ చర్యలకు దిగుతోంది.
Also Read
- JIO New Offer: నెల ఉచిత వైఫై, 100Mbps ఇంటర్నెట్, 12 OTT యాప్లు, 1,000 టీవీ ఛానెల్స్..
- El Nino Alert: ఐఎండీ అలర్ట్.. ఆగస్టులో తక్కువ వర్షాలుంటాయని హెచ్చరిక
- FIFA World Cup: ప్రైవేట్ సంస్థలకు వరల్డ్ కప్ అమ్మకం.. ఫిఫా సంచలన ప్లాన్..
- Botsa Satyanarayana: జగన్ పర్యటనను విజయవంతం చేశాం.. కూటమి ప్రభుత్వంపై బొత్స తీవ్ర ఆరోపణలు
Also Read:Lets Her Go With Lover: తన భార్యను ప్రియుడితో వెళ్లేందుకు అంగీకరించిన భర్త..
వ్యాపారంపై ప్రభావం..
ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు భాగం హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) ద్వారానే జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రాంతం యుద్ధ క్షేత్రంగా మారడంతో ఓడల రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు 700 సరుకు రవాణా నౌకలు మధ్యప్రాచ్య తీరాల్లోనే నిలిచిపోయాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ యుద్ధం మూడో వారంలోకి ప్రవేశించింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోతుండగా.. ఇంధన సరఫరా గొలుసు పూర్తిగా దెబ్బతింది.
భారత్పై పడే ప్రభావం..
ఈ పరిస్థితి భారతదేశంపై చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. ఎందుకంటే.. భారతదేశం తన గ్యాస్ అవసరాల్లో 50 శాతం విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. ఇందులో సుమారు 20 శాతం గ్యాస్ ఒక్క ఖతార్ నుంచే వస్తుంది.
ఖతార్లో ఉత్పత్తి ఆగిపోవడం వల్ల భారత్కు అందాల్సిన గ్యాస్ సరఫరాలో భారీ కోత పడింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. భారత్ తన గ్యాస్ వినియోగాన్ని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి రంగాల్లో గ్యాస్ వాడకాన్ని తగ్గించాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారత్లో రోజుకు 189 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ అవసరం కాగా.. అందులో సగం మాత్రమే మన దగ్గర ఉత్పత్తి అవుతోంది. మిగిలిన సగం విదేశాల నుంచి రావాలి. యుద్ధం వల్ల ఈ దిగుమతులకు ఆటంకం కలగడంతో.. భారత ప్రభుత్వ సంస్థలు ఇప్పుడు ఇతర దేశాల నుంచి గ్యాస్ కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి.
తాజావార్తలు
-
JIO New Offer: నెల ఉచిత వైఫై, 100Mbps ఇంటర్నెట్, 12 OTT యాప్లు, 1,000 టీవీ ఛానెల్స్..
-
El Nino Alert: ఐఎండీ అలర్ట్.. ఆగస్టులో తక్కువ వర్షాలుంటాయని హెచ్చరిక
-
Mega Multistarrer: స్టార్ డైరెక్టర్ డైరెక్షన్లో చిరంజీవి – నాగార్జున మల్టీస్టారర్..? మెగా మూవీపై భారీ బజ్!
-
Rashmika Mandanna : తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక?
-
HYDRAA : హైడ్రాపై హైకోర్టు ఫైర్.. కమిషనర్ బదిలీకి ఆదేశాలు.!
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!