ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పొరుగు రాష్ట్రం ఒడిశాలో పర్యటించనున్నారు. రెండు రాష్ట్రాలకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్తో చర్చించనున్నారు. కొఠియా గ్రామాలతోపాటు, నేరడి బ్యారేజీపై చర్చించనున్నారు. శ్రీకాకుళం, ఒడిశాలో రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం పాతపట్నం చేరుకుని ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహ రిసెప్షన్కు హాజరవుతారు. శ్రీకాకుళం పర్యటన అనంతరం విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకుని మధ్యాహ్నం 3.30 గంటలకు భువనేశ్వర్ బయలుదేరతారు. సాయంత్రం 5…
ఏపీ ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సోము వీర్రాజు. ఆయన మాట్లాడుతూ… జగనుకు మోడీ భయం పట్టుకుంది. మోడీతో జగన్ ఢీ అనాలనుకుంటే మేమూ సిద్ధంగా ఉన్నాం. మేము ఏంటో ఏపీ ప్రభుత్వానికి చూపిస్తాం. కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రకటనలు ఇస్తారా అని ప్రశ్నించారు. ఏపీలో ఆర్థిక పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు టాక్సులు తగ్గించినప్పుడు ఏపీ ప్రభుత్వం ఎందుకు తగ్గించదు. మేము సాయం చేస్తేనే ఏపీని పరిపాలిస్తామని ఎన్నికల…
పెట్రోల్, డీజిల్ పై పన్ను భారాన్ని తగ్గించేది లేదంటూ ప్రజా ధనంతో ప్రకటనలు ఇచ్చుకొని దోచుకుంటున్న ఘనుడు దేశ చరిత్రలో జగన్ ఒక్కడే అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు 23 రాష్ట్రాలు పన్ను భారాన్ని తగ్గించి సామాన్యులకు ఊరట కలిగించినా ఏపీ మాత్రం బాదుడు విషయంలో వెనక్కి తగ్గనంటోంది. అసత్య ప్రకటనలతో ప్రజల్ని నమ్మించాలని ప్రయత్నించి వైసీపీ ప్రభుత్వం అభాసు పాలయ్యింది. చంద్రబాబు హయాంలో ప్రజల పై…
ఏపీ స్థానిక ఎన్నికల్లో మరో ప్రక్రియ ముగిసింది. ఇప్పటివరకు దాఖలైన నామినేషన్లు పరిశీలించిన ఎన్నికల అధికారులు.. సరైన ఫార్మాట్లో లేని వాటిని తిరస్కరించారు. తిరుపతి, నెల్లూరు, చిత్తూరుతో పాటు కొన్నిచోట్ల నామినేషన్ల తిరస్కరణ ఉద్రిక్తతలకు దారి తీసింది. కొన్ని ప్రాంతాల్లో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు.అభ్యర్థులు తమ నామినేషన్లను ఈ నెల 9వ తేదీలోపు ఉపసంహరించుకోవచ్చు. అదేరోజు మధ్యాహ్నం 3 గంటల తరువాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. నవంబర్ 14న…
రాజధానిగా అమరావతిని అమలుచేయాలంటూ రైతులు, ప్రజాసంఘాలు చేపట్టిన పాదయాత్రకు కోర్టు అనుమతిచ్చినా పోలీసులు మాత్రం ఆంక్షలు విధిస్తున్నారు. విచ్చలవిడిగా రోడ్లపై రచ్చ చేసే వైసీపీ వాళ్లకు అడ్డురాని కోవిడ్ నిబంధనలు, లౌడ్ స్పీకర్లు రైతుల మహా పాదయాత్రకే అడ్డొచ్చాయా డీజీపీ గారు అంటూ మండిపడ్డారు టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్. వైసీపీ ర్యాలీలకు రెడ్ కార్పెట్ వేస్తున్న పోలీసులు అమరావతి రైతుల మహా పాదయాత్రకు అడ్డంకులు కల్పిస్తూ నోటీసులిస్తున్నారు. అమరావతిని చంపేసి ఉద్యమాన్ని అణిచేయాలనే…
రాష్ట్రంలో పాదయాత్ర అంటే గుర్తొచ్చేది దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి అన్నారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి 4 ఏళ్ళు పూర్తైన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు పుష్ప శ్రీవాణి. విజయనగరం జిల్లా కురుపాం మండల కేంద్రంలో వైసిపి నాయకులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేశారు ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి దంపతులు. అనంతరం ధూళికేశ్వరస్వామి ఆలయం…
తూర్పుగోదావరి : ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్ పరిపాలన నిరంతరాయంగా దశాబ్దాలపాటు సాగాలని… అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే రాష్ట్రం తలమానికంగా మారాలన్నారు ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. పాదయాత్ర లో ఇచ్చిన హామీలను రెండేళ్లలోనే సి.ఎం. జగన్ అమలు చేశారని కొనియాడారు. కోనసీమ తిరుపతి వాడపల్లి వెంకటేశ్వరస్వామిని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ… రాష్ట్రం సుభీక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నానని… వరాలు ఇచ్చే దేవుడు వాడపల్లి వెంకటేశ్వరస్వామి అని…
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏపీలోని ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలు పంపిణీకి జగన్ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. భారీగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామనే విషయాన్ని కరపత్రాల రూపంలో ప్రజలకు ప్రభుత్వం వివరించనుంది. ప్రణాళిక శాఖ దీనికోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరాల్ని ఇంటింటికి పంపిణీ చేయడానికి కసరత్తు పూర్తి చేసింది. ప్రభుత్వ పథకాలు స్టేటస్ రిపోర్టులు పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్లకు…
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఆయన నివాసం మర్యాదపూర్వకంగా తూర్పు నావికా దళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ ఛీఫ్, వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ కలిశారు. డిసెంబర్ 4న విశాఖలో జరిగే నేవీ డే వేడుకలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను తూర్పు నావికాదళ కమాండింగ్ ఇన్ ఛీఫ్ ఈ సందర్భంగా ఆహ్వనించారు. ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ సిటీ పేరుతో ముంబైలో నావికాదళ యుద్దనౌక ఐఎన్ఎస్ విశాఖపట్టణం త్వరలో ప్రారంభం కానున్నదని సీఎం జగన్ కు వివరించారు…
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫ్రస్టేషన్ లో వున్నాడని…చురకలు అంటించారు ఎమ్మెల్యే ఆర్. కె రోజా. ఇవాళ ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ.. నిన్న పండగ పూట ఎన్నిక లేంటి అని అంటున్నాడని… ముఖ్యమంత్రి జగన్ కు ఎన్నికల కమిషన్ కు సంబంధం ఏమిటి ? అని ప్రశ్నించారు. నిమ్మగడ్డ ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నపుడు అన్ని నచ్చాయని… ఇప్పుడు ఉన్న ఎలక్షన్ కమిషనర్ నిర్ణయాలు తప్పులు పడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు పరిపాలనలో ప్రజలకు…