నేడు సీఎం జగన్ ఒడిశా పర్యటన…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పొరుగు రాష్ట్రం ఒడిశాలో పర్యటించనున్నారు. రెండు రాష్ట్రాలకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్తో చర్చించనున్నారు. కొఠియా గ్రామాలతోపాటు, నేరడి బ్యారేజీపై చర్చించనున్నారు. శ్రీకాకుళం, ఒడిశాలో రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం పాతపట్నం చేరుకుని ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహ రిసెప్షన్కు హాజరవుతారు.
శ్రీకాకుళం పర్యటన అనంతరం విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకుని మధ్యాహ్నం 3.30 గంటలకు భువనేశ్వర్ బయలుదేరతారు. సాయంత్రం 5 గంటలకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నివాసంలో.. రెండు రాష్ట్రాలకు చెందిన వివిధ పెండింగ్ అంశాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. ఒడిశా సీఎంతో చర్చల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై సీఎం సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి సమీక్షించారు. నేరడి బ్యారేజీ కారణంగా ఉభయ రాష్ట్రాలకూ కలగనున్న ప్రయోజనాలను సీఎం జగన్.. నవీన్ పట్నాయక్కు వివరించనున్నారు.
Also Read
బ్యారేజీ నిర్మాణం వల్ల ఒడిశావైపు కూడా సుమారు 56 వేల ఎకరాలకు తక్షణమే సాగునీరు అందుతుందని చెప్పనున్నారు. జంఝావతి ప్రాజెక్టు వల్ల 24,640 ఎకరాల్లో సాగునీరు ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పుడు కేవలం 5 వేల ఎకరాలకు మాత్రమే నీరు ఇవ్వగలుగుతున్నామని, ప్రాజెక్టు పూర్తిచేస్తే రైతులకు పూర్తిస్థాయిలో మేలు జరుగుతుందని వివరించనున్నారు. అలాగే 21 కొఠియా గ్రామాల్లో 16..ఏపీతోనే ఉంటామంటూ తీర్మానాలు చేసి ఇచ్చారని నవీన్ పట్నాయక్కు వివరించనున్నారు జగన్మోహన్ రెడ్డి.
- Tags
- Andhra Pradesh
- cm jagan
- Odisha
తాజావార్తలు
-
HAM Projects : తెలంగాణలో రహదారుల విప్లవం.. ‘హ్యామ్’ ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక సమీక్ష
-
ICC ODI Rankings: టీమిండియా ‘వన్డే’ జైత్రయాత్ర.. ప్రపంచ ఛాంపియన్లనే వెనక్కి నెట్టి అగ్రస్థానంలో భారత్!
-
Ittehad-ul-Mujahideen: పాక్ను వణికిస్తున్న కొత్త ఉగ్ర ముఠా.. వణికిపోతున్న ఇస్లామాబాద్!
-
Keralam: తమిళనాడు పోయి.. కేరళం వచ్చే.. కేసీ వర్సెస్ సతీశన్ పంచాయితీ తెగేనా?
-
Vijay: పాపం విజయ్… రచ్చ గెలిచి ఇంట గెల్వలేకపోయాడా??
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?