లౌడ్ స్పీకర్లు రైతుల పాదయాత్రకే అడ్డొచ్చాయా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజధానిగా అమరావతిని అమలుచేయాలంటూ రైతులు, ప్రజాసంఘాలు చేపట్టిన పాదయాత్రకు కోర్టు అనుమతిచ్చినా పోలీసులు మాత్రం ఆంక్షలు విధిస్తున్నారు. విచ్చలవిడిగా రోడ్లపై రచ్చ చేసే వైసీపీ వాళ్లకు అడ్డురాని కోవిడ్ నిబంధనలు, లౌడ్ స్పీకర్లు రైతుల మహా పాదయాత్రకే అడ్డొచ్చాయా డీజీపీ గారు అంటూ మండిపడ్డారు టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్.
వైసీపీ ర్యాలీలకు రెడ్ కార్పెట్ వేస్తున్న పోలీసులు అమరావతి రైతుల మహా పాదయాత్రకు అడ్డంకులు కల్పిస్తూ నోటీసులిస్తున్నారు. అమరావతిని చంపేసి ఉద్యమాన్ని అణిచేయాలనే జగన్ ఎన్ని కుయుక్తులు పన్నినా చివరికి భంగపాటు తప్పదు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని జై అమరావతి. తుగ్లక్ నిర్ణయాలతో రైతుల మహా పాదయాత్రకు అడ్డుకోవాలని చూస్తే ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని లోకేష్ హెచ్చరించారు.
Also Read
- YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
- Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
- TTD: శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. అంగప్రదక్షిణ సేవ ఈ-డిప్ రిజిస్ట్రేషన్కు తేదీ ఖరారు.!
- APL-5లో కాకినాడ కింగ్స్ శుభారంభం.. 71 పరుగుల తేడాతో వైజాగ్ లయన్స్పై భారీ విజయం.!
రైతు పాదయాత్ర నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. పాదయాత్ర నిబంధనలు ఉల్లింఘించారని నోటీసుల్లో పేర్కొన్నారు. పాదయాత్రలో 157 మందికి అనుమతిస్తే.. 2500 మంది పాల్గొన్నారని పోలీసులు అన్నారు. రాజకీయ ప్రమేయం ఉండకూడదని కోర్టు ఆదేశాలు ఇచ్చిందన్న పోలీసులు, వాటిని ఉల్లంఘించారని నోటీసుల్లో తెలిపారు.
6వ రోజు పాదయాత్ర ముగిసిన తర్వాత రైతులు బస చేసిన కల్యాణ మండపం వద్దకు చేరుకున్నారు చీరాల డీఎస్పీ. అమరావతి జేఏసీ నేతలు శివారెడ్డి, తిరుపతిరావు, సుధాకర్, పలువురు ప్రజాప్రతినిధులకు నోటీసులు అందజేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
తాజావార్తలు
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
-
అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
-
Narendra Modi : 12 ఏళ్ల పాలనపై కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
ట్రెండింగ్
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!