Lithium: ప్రపంచంలో ప్రస్తుతం అత్యంత ఖరీదైన, విలువైన ఖనిజంగా ఉన్న లిథియం నిల్వలు భారతదేశంలో బయటపడుతున్నాయి. కొన్ని నెలల క్రితం జమ్మూ కాశ్మీర్ లోని రియాసి జిల్లాలో భారీ లిథియం నిల్వలను కనుగొన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) వెల్లడించింది. ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్ తర్వాత రాజస్థాన్ లో కూడా లిథియం నిల్వలను కనుగొన్నారు. నాగౌర్ జిల్లాలోని దేగానాలో ఈ లిథియం నిల్వలు కనుగొన్నట్లు తెలిపింది.
మిస్టరీగా మారిన చైనాకు చెందిన అంతరిక్ష నౌక ఇవాళ ( సోమవారం ) తిరిగి భూమి పైకి వచ్చింది. దాదాపు 276 రోజుల ఈ వ్యోమనౌక ఇవాళ తిరిగి వచ్చిందని చైనా ప్రభుత్వ మీడియా వెల్లడించింది.
పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో జరిగిన సమావేశంలో చైనా, తాలిబన్ల మధ్య కీలక ఒప్పందం జరిగింది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ను ఆఫ్ఘనిస్తాన్కు విస్తరించడానికి తాలిబన్ చైనా, పాకిస్తాన్తో అంగీకరించింది. ఆంక్షలతో దెబ్బతిన్న ఆఫ్ఘనిస్తాన్ దేశంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి బిలియన్ల డాలర్లు సమకూరే అవకాశం ఉంది.
SCO Meeting: షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సిఓ) విదేశాంగ మంత్రుల సమావేశానికి గోవా ఆతిథ్యం ఇవ్వనుంది. మే 4-5 తేదీల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలను పరిశీలించేందుకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బుధవారం గోవాలకు చేరుకున్నారు. ఎస్సీఓ సభ్యదేశాల్లో ఒకటైన పాకిస్తాన్ దేశ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ కూడా ఈ సమావేశాలకు హాజరుకానున్నారు.
తూర్పు చైనాలోని కెమికల్ ప్లాంట్లో పేలుడు సంభవించి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు తప్పిపోయారని, మరొకరు గాయపడ్డారని స్థానిక ప్రభుత్వం సోమవారం తెలిపింది.
Mars: భూమి తర్వాత సౌర కుటుంబంలో మానవ నివాసానికి అనువైన గ్రహంగా శాస్త్రవేత్తలు అంగారకుడిని భావిస్తున్నారు. మూడు బిలియన్ ఏళ్లకు ముందు అంగారకుడి వాతావరణం కూడా భూమిని పోలిన విధంగా ఉండేది. అయితే కొన్ని అనూహ్య పరిణామాల కారణంగా ప్రస్తుతం ఆ గ్రహం ఎర్రటి మట్టితో నిర్జీవంగా తయారైంది.
China: చైనాలో ముస్లింలపై అణిచివేత కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా జిన్జియాంగ్ ప్రావిన్సులో నివసించే ముస్లింలను చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇస్లాంను ఆచరించకుండా అక్కడి ప్రజలపై నిర్బంధం కొనసాగుతూనే ఉంది. చాలా మంది ముస్లింలకు బ్రెయిన్ వాష్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఇటీవల రంజాన్ పండగ సందర్భంగా చైనా అధికార యంత్రాంగా వీగర్ ముస్లింలు ప్రార్థనలు చేసుకోవడానికి కూడా అనుమతించలేదు రేడియో ఫ్రీ ఏషియా తన కథనంలో పేర్కొంది.
China Birth Rate: ప్రస్తుతం దేశంలో తగ్గుతున్న జననాల రేటుపై చైనా ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. జననాల రేటును పెంచేందుకు అక్కడి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది.
S Jaishankar: భారత్, చైనా సరిహద్దుల్లో పరిస్థితి సాధారణంగా స్థిరంగా ఉందని చైనా రక్షణ మంత్రి ఒకరోజు ముందు కీలక కామెంట్స్ చేశారు. దీని తర్వాతి రోజే భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ చైనా తీరుపై ధ్వజమెత్తారు. సరిహద్దు ఒప్పందాలు ఉల్లంఘించిన కారణంగా చైనాతో భారత్ సంబంధాలు సరిగా లేవని ఆయన అన్నారు. పాకిస్తాన్, చైనా మినహా అన్ని పొరుగు దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలను మెరుగు పరుచుకుంటోందని అన్నారు. కరేబియన్ దేశం డొమినికన్…
Rekha Singh: 2020 లడఖ్ గాల్వాన్ లోయలో భారత్-చైనా సైన్యాల మధ్య భీకర ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణల్లో భారత సైన్యానికి చెందిన 20 మంది జవాన్లు వీరమరణం పొందారు. ప్రతిగా భారత్ బలగాలు జరిపిన దాడిలో దీనికి రెట్టింపు సంఖ్యలో చైనా సైనికులు హతమయ్యారు. అయితే తమ వారు మాత్రం నలుగురే చనిపోయారంటూ చైనా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసింది. గాల్వాన్ ఘర్షణల్లో భారత సైనికుల వీరత్వాన్ని చూసిన చైనా బలగాలు మరోసారి భారత్ పై…