చైనాలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఎక్స్బీబీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. జూన్ మాసంలో అదికాస్త గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. జూన్ చివరి వారం కల్లా దాదాపు 6.5 కోట్ల మంది ఈ వ్యాధి బారినపడే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరించారు.
AI face-swapping: ప్రస్తుతం టెక్నాలజీ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ట్రెండ్ నడుస్లోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు తన జీవితాలను మరింత సులభతరంగా మార్చుకోవడానికి ఈ సాంకేతికత మరింతగా సాయపడుతోంది.
Rishi Sunak: ప్రపంచ భద్రతకు, శ్రేయస్సుకు చైనా అతిపెద్ద సవాల్ గా ఉందని, అయితే ఆదే సమయంలో అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు దాని నుంచి పూర్తిగా విడిపోవడానికి ప్రయత్నించకూడదని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అన్నారు. జపాన్ లోని హిరోషిమా వేదికగా జీ-7 సమావేశాలకు ఆయన హజరయ్యారు.
G20 Meeting: జమ్మూ కాశ్మీర్ విషయంలో దాయాది దేశం పాకిస్తాన్ కు వంత పాడుతోంది చైనా. మరోసారి భారతదేశంపై తన అక్కసును వెళ్లగక్కింది. పర్యాటక రంగంపై జీ 20 వర్కింగ్ గ్రూప్ మూడో సదస్సు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో నిర్వహించాడాన్ని చైనా వ్యతిరేకిస్తోంది. శ్రీనగర్ లో ఈ నెల 22 నుంచి 24 వరకు మూడు రోజలు పాటు సభ్యదేశాలతో సమావేశం జరుగనుంది.
PM Modi: బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్, జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370ని ఎత్తేయడం తర్వాత నుంచి భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. పాకిస్తాన్, భారత్ లో వాణిజ్య సంబంధాలను కూడా కట్ చేసుకుంది. అయితే దీని ఫలితాలను పాకిస్తాన్ అనుభవిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా భారత్-పాకిస్తాన్ సంబంధాల గురించి ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Warming World: భూమి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ గ్యాసెస్ ఎక్కువ కావడంతో గత కొన్ని దశాబ్ధాలుగా భూగోళం ఉష్ణోగ్రతల్లో మార్పు వస్తోంది. కర్భన ఉద్గారాల విడుదల కూడా ఇందుకు ఓ కారణం అవుతోంది. వేడిగా ఉండే దేశాలు మరింత వేడిగా మారుతున్నాయి. సమశీతోష్ణ దేశాలు ఊహించని విధంగా ఉష్ణోగ్రతలను ఎదుర్కొంటున్నాయి. ధృవాల వద్ద మంచు వేగంగా కరిగిపోతుంది. ఇదే జరిగితే కొన్నేళ్లలో సముద్రతీర ప్రాంతాల్లో ఉండే నగరాలు కనుమరుగు అవుతాయి.
China: చైనాలో మానవహక్కులకు పెద్దగా విలువ ఉండదు. చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని కానీ, ఆ దేశ నేతలను కానీ విమర్శిస్తే.. విమర్శించిన వారు తెల్లారేసరికే మాయం అవుతారు. వారి ఆచూకీ దశాబ్ధాలు గడిచిన కనిపించదు. అంతగా నిర్భందం ఉంటుంది అక్కడ. ఇక చైనీస్ పీపుల్ లిబరేషన్ ఆర్మీ గురించి చెప్పే పని లేదు. సరిహద్దు దేశాలతో ఎప్పుడూ గిల్లికజ్జాలు పెట్టుకుంటూనే ఉంటుంది. అయితే చైనా ఆర్మీని మాత్రం విమర్శిస్తే అక్కడి పాలకులు ఊరుకోరు.
Tea plantations: ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ డ్రింక్ గా పేరు తెచ్చుకున్న టీ చరిత్రను పరిశీలిస్తే.. ఎన్నో మలుపులు.. మరెన్నో విజయాలు. కమ్మని రుచితో తమను కట్టిపడేసిన టీని కాపాడుకోవడానికి చైనీయులు చేస్తున్న కృషి అభినందనీయం!
Tesla: ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా భారత్ వైపు చూస్తోంది. అమెరికా, చైనాల మధ్య ఏర్పడిని ఘర్షణ, భారత్ వంటి అతిపెద్ద మార్కెట్ ను వదులుకునేందుకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఏ సంస్థ ఇష్టపడటం లేదు. ఇప్పుడున్న భారత ప్రభుత్వం, రానున్న రోజుల్లో చైనాకు ధీటుగా తయారీ రంగంలో భారత్ ను అగ్రగామిగా నిలిపేందుకు పనిచేస్తోంది. మరోవైపు చైనా, భారత సంబంధాలు కూడా చెప్పుకోదగిన రీతిలో లేవు. దీంతోనే భారత్ వైపు టెస్లా దృష్టిసారిస్తున్నట్లు తెలుస్తోంది.