PM Modi: భారత్-పాకిస్తాన్ సంబంధాలపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్, జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370ని ఎత్తేయడం తర్వాత నుంచి భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. పాకిస్తాన్, భారత్ లో వాణిజ్య సంబంధాలను కూడా కట్ చేసుకుంది. అయితే దీని ఫలితాలను పాకిస్తాన్ అనుభవిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా భారత్-పాకిస్తాన్ సంబంధాల గురించి ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశమైన పాకిస్తాన్ తో భారత్ సాధారణ సంబంధాలనే కోరుకుంటోందని అయితే ఇది ఉగ్రవాదం లేని వాతావరణం సృష్టించినప్పుడే సాధ్యం అని ఆయన అన్నారు. నిక్కీ ఆసియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఉగ్రవాదం లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఇస్లామాబాద్ పై ఉందని ప్రధాని మోడీ అన్నారు.
సీమాంతర ఉగ్రవాదంపై భారత్ పదేపదే పాకిస్తాన్ ను హెచ్చరిస్తోంది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో అలజడులు రేపేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉన్నారు. పలు వేదికలపై పాక్ తీరును భారత్ ఎండగట్టింది. అయితే పాకిస్తాన్ ఎప్పటిలాగే జమ్మూ కాశ్మీర్ లో మానవహక్కుల ఉల్లంఘన, భారత్ లో మైనారిటీలను అణిచివేస్తున్నారంటూ పాత పాటే పాడుతోంది. ఇటీవల గోవాలో జరిగిన ఎస్ సీ ఓ విదేశాంగ మంత్రుల సమావేశానికి పాక్ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ హాజరయ్యారు. భారత్ విదేశంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇతర సభ్య దేశాల మంత్రులతో ద్వైపాక్షిక సమావేశాాలు నిర్వహించినప్పటికీ.. పాక్ మంత్రి భేటీ కాలేదు.
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
Read Also: Anand Mahindra: కారు కొన్న ఆనందంలో కుటుంబం డ్యాన్స్.. ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే..?
ఆసియాలో అతిపెద్ద స్వతంత్ర మీడియా గ్రూపుల్లో నిక్కీ ఆసియా ఒకటి. జీ 7 సమావేశానికి ప్రధాని మోడీ జపాన్ వెళ్లారు. చైనాతో సంబంధాల విషయంలో మాట్లాడుతూ.. భారతదేశం తన సార్వభౌమాధికారం, గౌరవాన్ని కాపాడుకోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉందని, దానికి కట్టుబడి ఉన్నామని మోడీ అన్నారు. చైనాతో సాధారణ ద్వైపాక్షిక సంబంధాలకు సరిహద్దు ప్రాంతాలలో శాంతి మరియు ప్రశాంతత చాలా అవసరం. భారతదేశం-చైనా సంబంధాల యొక్క భవిష్యత్తు అభివృద్ధి పరస్పర గౌరవం, పరస్పర సున్నితత్వం మరియు పరస్పర ప్రయోజనాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది” అని ప్రధాని మోదీ అన్నారు. భారత్, చైనా సంబంధాలు ప్రపంచ దేశాలకు అవసరం అని మోడీ వెల్లడించారు.
రష్యా-ఉక్రెయిన్ వివాదంలో భారతదేశం మధ్యవర్తి పాత్ర పోషించగలదా అని అడిగిన ప్రశ్నకు, ఉక్రెయిన్ వివాదంపై తమ దేశం యొక్క వైఖరి ‘‘స్పష్టంమైదని, తిరుగులేనిది’’ అని పిఎం మోడీ అన్నారు. భారత్ శాంతి వైపు నిలుస్తుందని అన్నారు. ఆహారం, ఇంధనం, ఎరువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో మేము రష్యా, ఉక్రెయిన్ తో సంబంధాలు కొనసాగిస్తామని వెల్లడించారు. సహకారం పెంచుకోవాలని కానీ ఘర్షణ కాదని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!