Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Want Normal Relations But Pm Modi On India Pakistan Ties

PM Modi: భారత్-పాకిస్తాన్ సంబంధాలపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..

Published Date :May 19, 2023 , 6:50 pm
By Venu Goapl Reddy
PM Modi: భారత్-పాకిస్తాన్ సంబంధాలపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

PM Modi: బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్, జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370ని ఎత్తేయడం తర్వాత నుంచి భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. పాకిస్తాన్, భారత్ లో వాణిజ్య సంబంధాలను కూడా కట్ చేసుకుంది. అయితే దీని ఫలితాలను పాకిస్తాన్ అనుభవిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా భారత్-పాకిస్తాన్ సంబంధాల గురించి ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశమైన పాకిస్తాన్ తో భారత్ సాధారణ సంబంధాలనే కోరుకుంటోందని అయితే ఇది ఉగ్రవాదం లేని వాతావరణం సృష్టించినప్పుడే సాధ్యం అని ఆయన అన్నారు. నిక్కీ ఆసియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఉగ్రవాదం లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఇస్లామాబాద్ పై ఉందని ప్రధాని మోడీ అన్నారు.

సీమాంతర ఉగ్రవాదంపై భారత్ పదేపదే పాకిస్తాన్ ను హెచ్చరిస్తోంది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో అలజడులు రేపేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉన్నారు. పలు వేదికలపై పాక్ తీరును భారత్ ఎండగట్టింది. అయితే పాకిస్తాన్ ఎప్పటిలాగే జమ్మూ కాశ్మీర్ లో మానవహక్కుల ఉల్లంఘన, భారత్ లో మైనారిటీలను అణిచివేస్తున్నారంటూ పాత పాటే పాడుతోంది. ఇటీవల గోవాలో జరిగిన ఎస్ సీ ఓ విదేశాంగ మంత్రుల సమావేశానికి పాక్ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ హాజరయ్యారు. భారత్ విదేశంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇతర సభ్య దేశాల మంత్రులతో ద్వైపాక్షిక సమావేశాాలు నిర్వహించినప్పటికీ.. పాక్ మంత్రి భేటీ కాలేదు.

Also Read

  • TVK MLAs: తొలిసారి ఎమ్మేల్యేలుగా 93 మంది టీవీకే నాయకులు.. 40 మందిపై క్రిమినల్ ఆరోపణలు!
  • Thalapathy Vijay Cabinet Ministers and Portfolios: విజయ్‌ కేబినెట్‌ ఖరారు.. కాసేపట్లో సీఎం‌గా ప్రమాణస్వీకారం.. ఇలా శాఖల కేటాయింపు
  • Hypersonic Missiles: హైపర్‌సోనిక్ క్షిపణి టెక్నాలజీలో భారత్ కీలక విజయం.. DRDO స్క్రామ్‌జెట్ ఇంజిన్ టెస్ట్ సక్సెస్
  • Train Tickets Rule: ఒక చిన్న తప్పు మీ కన్ఫర్మ్డ్ టికెట్‌ను కోల్పోయేలా చేస్తుంది! ఈ రైల్వే రూల్ తెలుసా?
Add as a preferred
source on google

Read Also: Anand Mahindra: కారు కొన్న ఆనందంలో కుటుంబం డ్యాన్స్.. ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే..?

ఆసియాలో అతిపెద్ద స్వతంత్ర మీడియా గ్రూపుల్లో నిక్కీ ఆసియా ఒకటి. జీ 7 సమావేశానికి ప్రధాని మోడీ జపాన్ వెళ్లారు. చైనాతో సంబంధాల విషయంలో మాట్లాడుతూ.. భారతదేశం తన సార్వభౌమాధికారం, గౌరవాన్ని కాపాడుకోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉందని, దానికి కట్టుబడి ఉన్నామని మోడీ అన్నారు. చైనాతో సాధారణ ద్వైపాక్షిక సంబంధాలకు సరిహద్దు ప్రాంతాలలో శాంతి మరియు ప్రశాంతత చాలా అవసరం. భారతదేశం-చైనా సంబంధాల యొక్క భవిష్యత్తు అభివృద్ధి పరస్పర గౌరవం, పరస్పర సున్నితత్వం మరియు పరస్పర ప్రయోజనాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది” అని ప్రధాని మోదీ అన్నారు. భారత్, చైనా సంబంధాలు ప్రపంచ దేశాలకు అవసరం అని మోడీ వెల్లడించారు.

రష్యా-ఉక్రెయిన్ వివాదంలో భారతదేశం మధ్యవర్తి పాత్ర పోషించగలదా అని అడిగిన ప్రశ్నకు, ఉక్రెయిన్ వివాదంపై తమ దేశం యొక్క వైఖరి ‘‘స్పష్టంమైదని, తిరుగులేనిది’’ అని పిఎం మోడీ అన్నారు. భారత్ శాంతి వైపు నిలుస్తుందని అన్నారు. ఆహారం, ఇంధనం, ఎరువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో మేము రష్యా, ఉక్రెయిన్ తో సంబంధాలు కొనసాగిస్తామని వెల్లడించారు. సహకారం పెంచుకోవాలని కానీ ఘర్షణ కాదని ఆయన అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • china
  • india
  • india pakistan ties
  • Pakistan
  • ukraine war

తాజావార్తలు

  • Nithin: నితిన్‌తో ‘జాతిరత్నాలు’ దర్శకుడి నెక్స్ట్ మూవీ..

  • Vijay OathCeremony : విజయ్ ప్రమాణస్వీకారంలో సెంటరాఫ్ అట్రాక్షన్ గా హీరోయిన్ త్రిష.

  • TVK MLAs: తొలిసారి ఎమ్మేల్యేలుగా 93 మంది టీవీకే నాయకులు.. 40 మందిపై క్రిమినల్ ఆరోపణలు!

  • Sobhita: “నా జీవితాన్ని మార్చింది అదే..” శోభితా ధూళిపాళ్ల క్రేజీ కామెంట్స్ వైరల్!

  • Barley Upma Recipe: రెగ్యులర్‌ బ్రేక్‌ఫాస్ట్‌ బోర్ కొట్టిందా..? రుచికరమైన, ఆరోగ్యకరమైన బార్లీ ఉప్మా ట్రై చేయండి..

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions