G20 Meeting: కాశ్మీర్లో జీ20 సమావేశానికి హాజరుకామన్న చైనా.. భారత్ స్ట్రాంగ్ రిఫ్లై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
G20 Meeting: జమ్మూ కాశ్మీర్ విషయంలో దాయాది దేశం పాకిస్తాన్ కు వంత పాడుతోంది చైనా. మరోసారి భారతదేశంపై తన అక్కసును వెళ్లగక్కింది. పర్యాటక రంగంపై జీ 20 వర్కింగ్ గ్రూప్ మూడో సదస్సు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో నిర్వహించాడాన్ని చైనా వ్యతిరేకిస్తోంది. శ్రీనగర్ లో ఈ నెల 22 నుంచి 24 వరకు మూడు రోజలు పాటు సభ్యదేశాలతో సమావేశం జరుగనుంది. దీనికి ఇప్పటికే భారత ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. అంతర్జాతీయ సమావేశం కావడంతో జమ్మూ కాశ్మీర అంతటా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది భారత్. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్ఎస్జీ, సీఆర్పీఎప్, మెరైన్ కమాండోలు, సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. శ్రీనగర్ దాల్ సరస్సులో మెరైన్ కమాండోలు గస్తీ కాస్తున్నారు.
ఇదిలటా ఉంటే శ్రీనగర్ లోని ‘‘షేర్ ఏ కాశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్’’లో జరగబోతోంది. దీనిపై డ్రాగన్ కంట్రీ చైనా అభ్యంతరం తెలిపింది. వివాదాస్పద భూభాగంలో ఇటువంటి భేటీలు జరపడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ బెన్ బిన్ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలకు భారత్ ఘాటుగానే స్పందించింది. భారత్ తన సొంత భూభాగంలో ఎక్కడైనా స్వేచ్ఛగా సమావేశాలు నిర్వహిస్తుందని, చైనాతో సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవడానికి సరిహద్దు వెంబడి శాంతి, సుస్థిరత అవసరం అని మన దేశం స్పష్టం చేసింది.
Also Read
- Anjanadri Temple: బంగారం కాదు రాగి?.. ఆంజనాద్రి అంజన్న ఆలయంలో ఆభరణాల విరాళ వివాదం!
- AIADMK MLAs Support Vijay: అన్నాడీఎంకేలో భారీ చీలిక.. విజయ్ గూటికి 30 మంది ఎమ్మెల్యేలు..
- CM Vijay: సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. మందుబాబులకు బిగ్ షాక్!
- Himanta Biswa Sarma: నేడు అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న హిమంత బిస్వా శర్మ
Read Also: Minister KTR: వాషింగ్టన్ డీసీలో WTITC స్కై సోరర్ లాంచ్ చేసిన మంత్రి కేటీఆర్
ఇదిలా ఉంటే ఈ సమావేశానికి తన మిత్రదేశాలు రాకుండా, సమావేశం భగ్నం అయ్యేందుకు పాకిస్తాన్ అన్ని మార్గాలు వెతుకుతోంది. మిత్ర దేశాలు ఈ సమావేశానికి వెళ్లకుండా పెద్ద ఎత్తున లాబీయింగ్ చేపడుతోంది. ఇప్పటికే పాక్ అత్యంత మిత్రదేశాలు అయిన టర్కీ, సౌదీ అరేబియా, చైనాలపై ఒత్తిడి తీసుకువస్తోంది. చైనా ఈ సమావేశానికి హాజరుకాబోమని చెబుతున్న నేపథ్యంలో సౌదీ, టర్కీ ఈ సమావేశాని హాజరుకావడం సందేహంగా మారింది.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సు ఇదే. జీ 20 సమావేశం కోసం 60 మందికి పైగా విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు. విదేశీ ప్రముఖులు కాశ్మీర్ అందాలను తిలకించేలా ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. విస్తృతంగా భద్రతా ఏర్పాట్లను చేశారు. శ్రీనగర్ మొత్తాన్ని ‘నో డ్రోన్’జోన్ గా అధికారులు ప్రకటించారు. అనుమానాస్పద అంతర్జాతీయ కాల్స్, వదంతుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.
తాజావార్తలు
-
GT vs SRH Playing 11: మొదట ప్లే-ఆఫ్ చేరేది ఎవరో.!
-
Anjanadri Temple: బంగారం కాదు రాగి?.. ఆంజనాద్రి అంజన్న ఆలయంలో ఆభరణాల విరాళ వివాదం!
-
Gayatri Gupta:“హగ్గులు లేకపోతే నిద్ర పట్టదు”.. గాయత్రీ గుప్తా ఓపెన్ కామెంట్స్!
-
AIADMK MLAs Support Vijay: అన్నాడీఎంకేలో భారీ చీలిక.. విజయ్ గూటికి 30 మంది ఎమ్మెల్యేలు..
-
Madhav Tiwari: నేను 4 ఓవర్లు బౌలింగ్ చేశా, ఇప్పటికీ నమ్మలేకపోతున్నా.. డీసీ ప్లేయర్ ఆనందం!
ట్రెండింగ్
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!