Rishi Sunak: చైనా ప్రపంచ భద్రతకు సవాల్గా మారింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishi Sunak: ప్రపంచ భద్రతకు, శ్రేయస్సుకు చైనా అతిపెద్ద సవాల్ గా ఉందని, అయితే ఆదే సమయంలో అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు దాని నుంచి పూర్తిగా విడిపోవడానికి ప్రయత్నించకూడదని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అన్నారు. జపాన్ లోని హిరోషిమా వేదికగా జీ-7 సమావేశాలకు ఆయన హజరయ్యారు. ఈ సమావేశాల అనంతరం రిషి సునాక్ ఈ వ్యాక్యలు చేశారు. ప్రస్తుత యుగంలో చైనా ప్రపంచ భద్రతకు అతిపెద్ద సవాల్ అని అన్నారు. చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు బ్రిటన్, ఇతర జీ-7 దేశాలు ఉమ్మడి విధానాన్ని అనుసరిస్తామని సునాక్ అన్నారు. చైనా తన ఆర్థిక బలంతో ఇతర దేశాల సార్వభౌమ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని నిరోధించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు సునాక్ తెలిపారు.
Read Also: Somu Veerraju : రూ. 2000 నోటు రద్దు నిర్ణయం మోడీ సాహసోపేత నిర్ణయం
Also Read
- Pakistan Terror Attack: పాలు పోసి పెంచిన పామే కాటేసింది.. పాకిస్థాన్లో ఉగ్రదాడి!
- Hantavirus Outbreak: హంటావైరస్ కలకలం.. లక్షణాలు, చికిత్సపై WHO కీలక హెచ్చరిక.. కొత్త మహమ్మారిగా మారుతుందా..?
- Russia-Ukraine War: నాలుగేళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధంపై.. రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన
- UFO Files: ఏలియన్ల గుట్టు రట్టు.. చరిత్రలో తొలిసారిగా 'UFO' రహస్య పత్రాలను బయటపెట్టిన అమెరికా!
జీ-7 దేశాలైన జపాన్, ఇటలీ, కెనడా, ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్, జర్మనీ దేశాల అధినేతలు జపాన్ వేదికగా సమావేశం అయ్యారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, చైనా దుందుడుకు వైఖరి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించారు. ఈ సమావేశాలకు ప్రత్యేక అతిథిగా ప్రధాని నరేంద్రమోడీని జపాన్ ఆహ్వానించింది. జీ-7 సమావేశాల అనంతరం క్వాడ్ దేశాలు అయిన ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా, భారత దేశాల నేతలు సమావేశం అయ్యారు. ఇండో-పసిఫిక్ రీజియన్ లో చైనాను అడ్డుకునే వ్యూహాలను చర్చించారు. దక్షిణ చైనా సముద్రంలో వియత్నాం, జపాన్ దేశాలకు చెందిన కొన్ని ద్వీపాలు తమవే అని చైనా మొండికేస్తుంది. ఈ దేశాల పరిధిలోని జలాల్లో కృత్రిమ ద్వీపాలను నిర్మిస్తోంది. ఈ పరిణామాలను అడ్డుకునేందుకు క్వాడ్ దేశాల కూటమి ఏర్పడింది.
తాజావార్తలు
-
Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్గా ఇలా ట్రై చేయండి!
-
Tamil Politics: విజయ్పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
-
RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!
-
PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
-
PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?