Tiananmen Square: సొంత ప్రజల పైన చైనా మారణహోమానికి 34 ఏళ్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tiananmen Square: స్వేచ్ఛ కోసం నినదించిన ప్రజలను అత్యంత దారుణంగా అణిచివేసి, వేల మందిని నిర్ధాక్షిణ్యంగా చంపేసిన తియాన్మెన్ స్వేర్ ఊచకోతకు 34 ఏళ్లు నిండాయి. తమకు ఎదురుతిరిగితే ఏ రకంగా ప్రవర్తిస్తుందనే ఉదంతాన్ని తియాన్మెన్ స్వేర్ రూపంలో చైనా చూపించింది. ఎలాంటి కనికరం లేకుండా సైన్యంతో కాల్పులు జరిపింది, యుద్ధ ట్యాంకులతో ప్రజలను అణిచివేసింది.
జూన్ 4 సంఘటనగా పిలుచుకునే ఈ తియాన్మెన్ స్వేర్ ఘటన 1989 జూన్ 4న జరిగింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజలను పిట్టల్లా కాల్చి పడేసింది కమ్యూనిస్ట్ చైనా ప్రభుత్వం. రాజధాని బీజింగ్ నగరంలో ప్రజాస్వామ్యం కోసం ప్రజలు పెద్ద ఎత్తున నిరసన చేపడుతున్న ప్రజల్ని అక్కడి ప్రభుత్వం చంపేసింది.
Also Read
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
- Pakistan: మధ్యవర్తిత్వం చేశాం కదా $10 బిలియన్లు ఇవ్వండి.. అమెరికాను కోరిన పాకిస్తాన్..
- Hormuz-US: హార్ముజ్పై అమెరికా వ్యూహం ఇదేనా? టార్గెట్ ఏంటంటే..!
- Sanae Takaichi: రోజుకి 3 గంటలే నిద్రపోతా.. దుమారం రేపుతోన్న జపాన్ ప్రధాని వ్యాఖ్యలు
ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పేరొందిన చైనా, ఈ స్థాయికి రావడానికి అనేక దుర్మార్గాలకు తెగబడింది. చైనాలో అవినీతిపై పోరాడి, సంస్కరణకు పిలుపునిచ్చిన నేతగా గుర్తింపు పొందిన కమ్యూనిస్ట్ పార్టీ నేత హు యెబాంగ్ 1989 ఏప్రిల్ 15 చనిపోయారు. ఆయనకు నివాళి అర్పించేందుకు దేశవ్యాప్తంగా తియాన్మెర్ స్వేర్ వద్దకు వేల సంఖ్యలో విద్యార్థులు చేరుకున్నారు. ఇది నెమ్మదిగా నిరసనగా మారింది. ఇది దేశవ్యాప్తంగా విస్తరించింది. విద్యార్థి లోకానికి తోడుగా ప్రజలు కూడా చేతులు కలిపారు.
Read Also: Rahul Gandhi: ఇది గాంధీ-గాడ్సేల మధ్య పోరాటం.. మోడీ వెనక చూసి కార్ నడుపుతున్నాడు..
ఈ నిరసనలను అణిచివేయడానికి అక్కడి ప్రభుత్వం రాజకీయ కుట్ర అనే ఆరోపణలు గుప్పించింది. ఈ నిరసనలు ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇదిలా ఉంటే అధ్యక్షుడు డెన్ జియావోపింగ్ శాంతియుతంగా ఈ సమస్యను పరిష్కరించాలని చూశాడు. రష్యాకు చెందిన నేత నికెల్ గోర్భచెవ్ మే 15 బీజింగ్ పర్యటన ఉండటంతో ఈ నిరసనకారులను తియాన్మెన్ స్వేర్ నుంచి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించాలని చూశారు. అయితే ఇది సాధ్యపడలేదు ఫలితంగా గోర్భచెవ్ పర్యటన విఫలం అయింది.
మరోవైపు తియాన్మెర్ స్వేర్ వద్దకు నిరసన తెలిపేందుకు రోజురోజుకు లక్షల మంది చేరుకుంటున్నారు. అయితే వీరిని అణిచివేసేందుకు పీపుల్ లిబరేషన్ ఆర్మీ జూన్ 2న ఈ నిరసనల్ని అణిచివేయాలనే ప్రభుత్వ ఆదేశాలతో జూన్ 3 అర్థరాత్రి తియాన్మెన్ స్వేర్ వద్దకు చేరుకుంది. జూన్ 4న తెల్లవారజామున సైనికులు అడ్డుగా ఉన్న బారికేడ్లను ట్యాంకులతో తొక్కించి, నిర్థాక్షిణ్యంగా కాల్పులు జరిపింది. బీజింగ్ తోపాటు ఇతర ప్రాంతాల్లో జరుగుతన్న నిరసనల్ని అణిచివేసింది. ఏకంగా 10,000 మంది చనిపోయినట్లు అంచనా. అయితే చైనా అధికారికంగా 200 మంది వరకు మాత్రమే చనిపోయారని తెలిపింది.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!