Tiananmen Square: సొంత ప్రజల పైన చైనా మారణహోమానికి 34 ఏళ్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tiananmen Square: స్వేచ్ఛ కోసం నినదించిన ప్రజలను అత్యంత దారుణంగా అణిచివేసి, వేల మందిని నిర్ధాక్షిణ్యంగా చంపేసిన తియాన్మెన్ స్వేర్ ఊచకోతకు 34 ఏళ్లు నిండాయి. తమకు ఎదురుతిరిగితే ఏ రకంగా ప్రవర్తిస్తుందనే ఉదంతాన్ని తియాన్మెన్ స్వేర్ రూపంలో చైనా చూపించింది. ఎలాంటి కనికరం లేకుండా సైన్యంతో కాల్పులు జరిపింది, యుద్ధ ట్యాంకులతో ప్రజలను అణిచివేసింది.
జూన్ 4 సంఘటనగా పిలుచుకునే ఈ తియాన్మెన్ స్వేర్ ఘటన 1989 జూన్ 4న జరిగింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజలను పిట్టల్లా కాల్చి పడేసింది కమ్యూనిస్ట్ చైనా ప్రభుత్వం. రాజధాని బీజింగ్ నగరంలో ప్రజాస్వామ్యం కోసం ప్రజలు పెద్ద ఎత్తున నిరసన చేపడుతున్న ప్రజల్ని అక్కడి ప్రభుత్వం చంపేసింది.
Also Read
ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పేరొందిన చైనా, ఈ స్థాయికి రావడానికి అనేక దుర్మార్గాలకు తెగబడింది. చైనాలో అవినీతిపై పోరాడి, సంస్కరణకు పిలుపునిచ్చిన నేతగా గుర్తింపు పొందిన కమ్యూనిస్ట్ పార్టీ నేత హు యెబాంగ్ 1989 ఏప్రిల్ 15 చనిపోయారు. ఆయనకు నివాళి అర్పించేందుకు దేశవ్యాప్తంగా తియాన్మెర్ స్వేర్ వద్దకు వేల సంఖ్యలో విద్యార్థులు చేరుకున్నారు. ఇది నెమ్మదిగా నిరసనగా మారింది. ఇది దేశవ్యాప్తంగా విస్తరించింది. విద్యార్థి లోకానికి తోడుగా ప్రజలు కూడా చేతులు కలిపారు.
Read Also: Rahul Gandhi: ఇది గాంధీ-గాడ్సేల మధ్య పోరాటం.. మోడీ వెనక చూసి కార్ నడుపుతున్నాడు..
ఈ నిరసనలను అణిచివేయడానికి అక్కడి ప్రభుత్వం రాజకీయ కుట్ర అనే ఆరోపణలు గుప్పించింది. ఈ నిరసనలు ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇదిలా ఉంటే అధ్యక్షుడు డెన్ జియావోపింగ్ శాంతియుతంగా ఈ సమస్యను పరిష్కరించాలని చూశాడు. రష్యాకు చెందిన నేత నికెల్ గోర్భచెవ్ మే 15 బీజింగ్ పర్యటన ఉండటంతో ఈ నిరసనకారులను తియాన్మెన్ స్వేర్ నుంచి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించాలని చూశారు. అయితే ఇది సాధ్యపడలేదు ఫలితంగా గోర్భచెవ్ పర్యటన విఫలం అయింది.
మరోవైపు తియాన్మెర్ స్వేర్ వద్దకు నిరసన తెలిపేందుకు రోజురోజుకు లక్షల మంది చేరుకుంటున్నారు. అయితే వీరిని అణిచివేసేందుకు పీపుల్ లిబరేషన్ ఆర్మీ జూన్ 2న ఈ నిరసనల్ని అణిచివేయాలనే ప్రభుత్వ ఆదేశాలతో జూన్ 3 అర్థరాత్రి తియాన్మెన్ స్వేర్ వద్దకు చేరుకుంది. జూన్ 4న తెల్లవారజామున సైనికులు అడ్డుగా ఉన్న బారికేడ్లను ట్యాంకులతో తొక్కించి, నిర్థాక్షిణ్యంగా కాల్పులు జరిపింది. బీజింగ్ తోపాటు ఇతర ప్రాంతాల్లో జరుగుతన్న నిరసనల్ని అణిచివేసింది. ఏకంగా 10,000 మంది చనిపోయినట్లు అంచనా. అయితే చైనా అధికారికంగా 200 మంది వరకు మాత్రమే చనిపోయారని తెలిపింది.
తాజావార్తలు
-
Ebola outbreak: ఎబోలా అలర్ట్.. 3 ఆఫ్రికా దేశాలకు వెళ్లొద్దన్న భారత్
-
IMD Rain Alert: మండే ఎండల్లో వాతావరణ శాఖ కూల్ అప్ డేట్.. వేగం పుంజుకున్న రుతుపవనాలు.. ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
-
Suryakumar Yadav: సూర్యకుమార్కు సెలెక్టర్లు షాక్.. కోచ్ గౌతమ్ గంభీర్ చేతుల్లోనే ‘స్కై’ భవితవ్యం!
-
White House shooting: ‘‘నేనే ఏసు క్రీస్తు అవతారం’’.. వైట్ హౌస్ కాల్పుల నిందితుడు..
-
Ram Charan: “విరాట్ అంటే ఫైర్.. ధోని అంటే కూల్”.. క్రికెట్ లెజెండ్స్పై చరణ్ క్రేజీ కామెంట్స్
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?