China: వీసా గడువు పొడిగించకపోవడంతో ..చైనాను వీడనున్న ఆఖరి భారత జర్నలిస్టు
China: చైనాలో ఉన్న భారతీయ జర్నలిస్టుకు ఆ దేశం వీసా గడువును పొడిగించకపోవడంతో ఈ నెలాఖరు నాటికి చైనా నుంచి భారతీయ జర్నలిస్టులందరూ ఇండియాకు తిరిగి వచ్చేసినట్టు అవుతుంది. ఈ నెలాఖరుతో సదరు జర్నలిస్టు వీసా గడువు ముగియనుంది.. అయితే చైనాలో వీసాపై నిషేధాజ్ఞలు విధించి.. వీసా గడువును పొడిగించకపోవడంతో ఇక చైనాలో భారతీయ జర్నలిస్టులు లేకుండా పోనున్నారు.
Read also: Sriya Reddy: పవన్ ఓజీలో విశాల్ రెడ్డి వదిన.. పవర్ ఫుల్ అంటూ ట్వీట్
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
- Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
- China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
2020 మధ్యలో చైనా-భారత్ సరిహద్దులో సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 24 మంది మృతి చెందడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించినప్పటి నుండి దేశాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. భారత్లో తమ రిపోర్టర్లకు అన్యాయం జరిగిందని పేర్కొంటూ చైనాలో ఉన్న భారతీయ జర్నలిస్టును దేశం విడిచి వెళ్లాలని చైనా పేర్కొంది. చైనాకు చెందిన జర్నలిస్టులు భారత్లో అన్యాయానికి, వివక్షకు గురవుతున్నారని ఆ దేశ విదేశాంగ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ సోమవారం ఆరోపించారు. 2020లో మొత్తం 14 మంది చైనా జర్నలిస్టులు భారత్లో ఉండగా, అక్కడి పరిస్థితుల కారణంగా ప్రస్తుతం ఒక్కరే మిగిలారని ఆయన పేర్కొన్నారు. అయితే చైనా ఆరోపణలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. గతనెలలో భారత్లో జరిగిన ఎస్సీవో విదేశాంగ మంత్రుల సమావేశానికి చైనా జర్నలిస్టులకు అనుమతులు ఇచ్చామని భారత్ స్పష్టం చేసింది. ఇండియాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చైనా జర్నలిస్టులు పని చేస్తున్నారని … కానీ చైనాలో అలాంటి పరిస్థితులు లేవని పేర్కొంది.
Read also: Bhatti Vikramarka: నాగార్జునసాగర్ లో గెలిచేది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి
ప్రస్తుతం చైనాలో కొనసాగుతున్న పీటీఐకి చెందిన జర్నలిస్టు వీసా గడువును పొడిగించేందుకు చైనా ప్రభుత్వం నిరాకరించింది. దీంతో ఈనెల చివరి నాటికి ఆ జర్నలిస్టు తిరిగి రానున్నారు. 2023 ప్రారంభంలో నలుగురు భారతీయ జర్నలిస్టులు చైనాలో ఉండగా.. వీసాపై నిషేధాజ్ఞలు విధించడంతో ఇద్దరు స్వదేశానికి చేరుకున్నారు. వీసా గడువు ముగియడంతో జూన్ 11న మరొకరు జర్నలిస్టు కూడా ఇండియాకి వచ్చేశారు. తాజాగా ఆఖరి జర్నలిస్టు వీసా ఈ నెలాఖరు వరకు ఉండటంతో.. వీసా గడువును చైనా పొడిగించకపోవడంతో అతను కూడా భారత్కు రానున్నారు. అయితే భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ నెలలో భారతీయ జర్నలిస్టులను చైనాలో పని చేయడానికి చైనా అనుమతిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. విదేశీ జర్నలిస్టులందరికీ అక్కడ కార్యకలాపాలు నిర్వహించడానికి భారతదేశం అనుమతించిందని తెలిపింది.
తాజావార్తలు
-
Aadarsha-kutumbam: వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’లో వీరమల్లు బ్యూటీ..
-
Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
-
Riyan Parag: వరుస వివాదాల్లో రాజస్థాన్ రాయల్స్.. డ్రెస్సింగ్ రూమ్లో రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డ కెప్టెన్..
-
Lenin : రామ్ చరణ్ ‘పెద్ది’ దెబ్బతో మళ్లీ సైలెంట్ అయిన ‘లెనిన్’ !
-
Bajaj Chetak C2501 STD: బజాజ్ చేతక్ సిరీస్లో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, ఫీచర్లు & స్పెసిఫికేషన్స్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో