China: వీసా గడువు పొడిగించకపోవడంతో ..చైనాను వీడనున్న ఆఖరి భారత జర్నలిస్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: చైనాలో ఉన్న భారతీయ జర్నలిస్టుకు ఆ దేశం వీసా గడువును పొడిగించకపోవడంతో ఈ నెలాఖరు నాటికి చైనా నుంచి భారతీయ జర్నలిస్టులందరూ ఇండియాకు తిరిగి వచ్చేసినట్టు అవుతుంది. ఈ నెలాఖరుతో సదరు జర్నలిస్టు వీసా గడువు ముగియనుంది.. అయితే చైనాలో వీసాపై నిషేధాజ్ఞలు విధించి.. వీసా గడువును పొడిగించకపోవడంతో ఇక చైనాలో భారతీయ జర్నలిస్టులు లేకుండా పోనున్నారు.
Read also: Sriya Reddy: పవన్ ఓజీలో విశాల్ రెడ్డి వదిన.. పవర్ ఫుల్ అంటూ ట్వీట్
Also Read
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్లైన్స్పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్పై నెటిజన్ల ప్రశ్నలు..
- Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
- Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
2020 మధ్యలో చైనా-భారత్ సరిహద్దులో సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 24 మంది మృతి చెందడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించినప్పటి నుండి దేశాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. భారత్లో తమ రిపోర్టర్లకు అన్యాయం జరిగిందని పేర్కొంటూ చైనాలో ఉన్న భారతీయ జర్నలిస్టును దేశం విడిచి వెళ్లాలని చైనా పేర్కొంది. చైనాకు చెందిన జర్నలిస్టులు భారత్లో అన్యాయానికి, వివక్షకు గురవుతున్నారని ఆ దేశ విదేశాంగ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ సోమవారం ఆరోపించారు. 2020లో మొత్తం 14 మంది చైనా జర్నలిస్టులు భారత్లో ఉండగా, అక్కడి పరిస్థితుల కారణంగా ప్రస్తుతం ఒక్కరే మిగిలారని ఆయన పేర్కొన్నారు. అయితే చైనా ఆరోపణలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. గతనెలలో భారత్లో జరిగిన ఎస్సీవో విదేశాంగ మంత్రుల సమావేశానికి చైనా జర్నలిస్టులకు అనుమతులు ఇచ్చామని భారత్ స్పష్టం చేసింది. ఇండియాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చైనా జర్నలిస్టులు పని చేస్తున్నారని … కానీ చైనాలో అలాంటి పరిస్థితులు లేవని పేర్కొంది.
Read also: Bhatti Vikramarka: నాగార్జునసాగర్ లో గెలిచేది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి
ప్రస్తుతం చైనాలో కొనసాగుతున్న పీటీఐకి చెందిన జర్నలిస్టు వీసా గడువును పొడిగించేందుకు చైనా ప్రభుత్వం నిరాకరించింది. దీంతో ఈనెల చివరి నాటికి ఆ జర్నలిస్టు తిరిగి రానున్నారు. 2023 ప్రారంభంలో నలుగురు భారతీయ జర్నలిస్టులు చైనాలో ఉండగా.. వీసాపై నిషేధాజ్ఞలు విధించడంతో ఇద్దరు స్వదేశానికి చేరుకున్నారు. వీసా గడువు ముగియడంతో జూన్ 11న మరొకరు జర్నలిస్టు కూడా ఇండియాకి వచ్చేశారు. తాజాగా ఆఖరి జర్నలిస్టు వీసా ఈ నెలాఖరు వరకు ఉండటంతో.. వీసా గడువును చైనా పొడిగించకపోవడంతో అతను కూడా భారత్కు రానున్నారు. అయితే భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ నెలలో భారతీయ జర్నలిస్టులను చైనాలో పని చేయడానికి చైనా అనుమతిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. విదేశీ జర్నలిస్టులందరికీ అక్కడ కార్యకలాపాలు నిర్వహించడానికి భారతదేశం అనుమతించిందని తెలిపింది.
తాజావార్తలు
-
DJ Noise: వినాయకుడి పండుగలో ఈ భారీ శబ్దాలు ఎందుకు..? డీజే భక్తికి నేలకొరుగుతున్న ప్రాణాలు
-
Bank Holidays & Strike 2026: సెప్టెంబర్ 26 నుంచి వరుసగా బ్యాంకులకు సెలవులు.. 28 నుంచి 3 రోజుల సమ్మె
-
Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
-
Itlu Arjuna Teaser: మాటల్లేవ్… మాట్లాడుకోవడాలు లేవ్… డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
ట్రెండింగ్
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..