Sea Products: భారీగా పెరిగిన సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం నుంచి సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు 27శాతం పెరిగాయి. ప్రధానంగా అమెరికా, చైనా, యూరోపియన్ దేశాలకు అధిక మొత్తంలో ఎక్స్ పోర్ట్స్ అయ్యాయని సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు, అభివృద్ధి సంస్థ ఛైర్మన్ డీవీ స్వామి వెల్లడించారు. 2021-22 ఏడాదిలో భారత్ నుంచి రూ.57,486 కోట్ల విలువైన 13.69 లక్షల టన్నుల సముద్ర ఉత్పత్తుల్ని వివిధ దేశాలకు ఎగుమతి చేయగా.. 2022-23 సంవత్సరంలో రూ.63,969 కోట్ల (8.09 బిలియన్ల అమెరికా డాలర్లు) విలువైన 17.35 లక్షల టన్నులు రవాణా చేసినట్లు పేర్కొన్నారు. పరిమాణంలో 26.73శాతం, రూపాయి విలువ పరంగా 11.08శాతం మేర వృద్ధి సాధించినట్లు వెల్లడించారు.
Also Read : Trivikram: ఆ స్టార్ హీరోలతో త్రివిక్రమ్ మూడో సినిమా చిత్రం భళారే విచిత్రం
Also Read
- Ashwin: "కోహ్లీ కంటే బుమ్రానే బెటర్".. భారత క్రికెట్ గ్రేటెస్ట్పై అశ్విన్ సంచలన తీర్పు
- Rahul Gandhi: ‘టీ కప్పుల్లో కులం ఉందట.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై చర్చ’
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
- UP Floods: యూపీని ముంచెత్తిన వరదలు.. మధ్యప్రదేశ్తో తెగిన సంబంధాలు
పరిమాణం, విలువపరంగా రొయ్యల ఉత్పత్తులు తొలి స్థానంలో నిలిచాయి. మొత్తం ఎగుమతులలో 40.98శాతం, డాలర్ విలువలో 67.72శాతం వాటా రొయ్యలదే. రూపాయి విలువలో చూస్తే 1.01శాతం పెరిగింది. రూ.43,135 కోట్ల విలువైన 7.11 లక్షల టన్నులు ఎగుమతులు చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో 2.76 లక్షల టన్నుల్ని అమెరికా, 1.46 లక్షల టన్నుల్ని చైనా, 95,377 టన్నుల్ని యూరోపియన్ యూనియన్, 65,466 టన్నుల్ని సౌత్ ఈస్ట్ ఆసియా దేశాలు దిగుమతులను చేసుకున్నాయి.
Also Read : Nottingham: నాటింగ్హమ్ దాడిలో భారత సంతతి యువతి మృతి
బ్లాక్టైగర్ రొయ్యల ఎగుమతిలో 74.06శాతం వృద్ధి సాధించింది. రూ.2,564.71 కోట్ల విలువైన 31,213 టన్నుల రొయ్యల ఎగుమతులు జరిగాయి. ఈ రకం రొయ్యలకు జపాన్ ప్రధాన మార్కెట్గా నిలిచింది. విదేశీ మార్కెట్ల విలువ పరంగా 2,632 మిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను దిగుమతి చేసుకున్న అమెరికా తొలి స్థానంలో నిలవగా.. డిమాండు మందగించడంతో అమెరికాకు ఎగుమతులు డాలర్ పరంగా 21.94శాతం మేర తగ్గాయి. అగ్ర రాజ్యానికి ఎగుమతి అయిన వాటిలో ప్రధాన ఉత్పత్తి రొయ్యలు. 1,508 మిలియన్ డాలర్ల విలువైన 4.05 లక్షల టన్నుల మేర దిగుమతి చేసుకొని చైనా సెకండ్ ప్లేస్ లో ఉంది.
తాజావార్తలు
-
Ashwin: “కోహ్లీ కంటే బుమ్రానే బెటర్”.. భారత క్రికెట్ గ్రేటెస్ట్పై అశ్విన్ సంచలన తీర్పు
-
Rahul Gandhi: ‘టీ కప్పుల్లో కులం ఉందట.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై చర్చ’
-
Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
-
UP Floods: యూపీని ముంచెత్తిన వరదలు.. మధ్యప్రదేశ్తో తెగిన సంబంధాలు
-
TG EAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!