Gaming Addiction: అకౌంట్లో రూ.52 లక్షలకు కేవలం రూ.5 మిగిల్చింది.. ఓ కూతురి ఘనకార్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gaming Addiction:మొబైల్ గేమింగ్ ఎంత ప్రమాదకరం ఇటీవల కొన్ని సంఘటనలు తెలియజేస్తున్నాయి. ఈ గేమింగ్స్ కు పిల్లలు బానిస అవుతున్నారు. తల్లిదండ్రలుకు తెలియకుండా వారి ఖాతాల నుంచి డబ్బులు గేమ్స్ కోసం తగలేస్తున్నారు. ఇటు ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యంగా తీవ్రం నష్టపోతున్నారు. ఇదిలా ఉంటే సరిగ్గా ఇలాంటి సంఘటనే చైనాలో జరిగింది. తల్లికి తెలియకుండా 13 ఏళ్ల కూతురు మొబైల్ గేమింగ్ కి అడిక్ట్ అయింది.
వాంగ్ అనే 13 ఏళ్ల బాలిక ఈ గేమ్స్ లో వాడే టూల్స్ కొనుగోలు చేసేందుకు తల్లి ఖాతా నుంచి లక్షల్లో డబ్బును వినియోగించింది. పే-టూ-ప్లే గేమ్స్ కి బానిస కావడాన్ని సదరు బాలిక టీచర్ గుర్తించి ఆమె తల్లికి తెలియజేసే వరకు తెలియలేదు. బాలిక ఆన్లైన్ గేమింగ్పై 449,500 యువాన్లు (సుమారు రూ. 52,19,809) ఖర్చు చేయడం ద్వారా నాలుగు నెలల్లో తన కుటుంబం సంపాదించిందంతా గేమ్స్ కోసం తగలేసింది. గేమ్స్ ని మరింత సమర్థవంతంగా ఆడేందుకు డబ్బులు ఖర్చు పెట్టి గేమింగ్ టూల్స్ కొనుగోలు చేసింది.
Also Read
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
- Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
- Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
- Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
Read Also: Biparjoy Cyclome: ఉత్తర దిశగా కదులుతున్న బిపర్జోయ్ తుఫాను.. మత్స్యకారులకు హెచ్చరిక
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం, పాఠశాల సమయంలో ఆమె అధిక ఫోన్ వాడకాన్ని బాలిక ఉపాధ్యాయురాలు గమనించి, ఆమె పే-టు-ప్లే గేమ్లకు బానిసై ఉండవచ్చని అనుమానించడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆందోళన చెందిన ఉపాధ్యాయురాలు బాలిక తల్లికి సమాచారం అందించింది. అనుమానం వచ్చిన తల్లి తన బ్యాంక్ ఖాతా చూడగా.. రూ. 52 లక్షలకు బదులు కేవలం రూ. 5 మాత్రమే ఉండటం చూసి షాక్ అయింది. బ్యాంక్ స్టేట్మెంట్ పరిశీలిస్తే మొబైల్ గేమ్స్ కోసం డబ్బు వినియోగించినట్లు తేలింది.
గేమ్ల కొనుగోలు కోసం 120,000 యువాన్లు (సుమారు రూ. 13,93,828) మరియు గేమ్లో టూల్స్ కొనుగోళ్లకు అదనంగా 210,000 యువాన్లు (సుమారు రూ. 24,39,340) వెచ్చించినట్లు ఆమె అంగీకరించింది. ఇంకా, ఆమె తన సహవిద్యార్థుల్లో కనీసం 10 మంది కోసం గేమ్లను కొనుగోలు చేయడానికి మరో 100,000 యువాన్లను (దాదాపు రూ. 11,61,590) ఉపయోగించింది. బాలిక తల్లి డెబిల్ కార్డు దొరకగానే..తన స్మార్ట్ ఫోన్ తో కనెక్ట్ చేసింది. తల్లి అందుబాటులో లేని సమయంలో కూతురు అవసరాల కోసం దాని పిన్ చెప్పింది. దీంతోనే సదరు బాలిక, తన తల్లి ఖాతా నుంచి డబ్బులను వాడుకున్నట్లు తేలింది. ఈ ఘటన చైనా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెక్గిల్ విశ్వవిద్యాలయం 2022 విశ్లేషణ ప్రకారం, అత్యధిక సంఖ్యలో స్మార్ట్ఫోన్ బానిసలు చైనాలో ఉన్నారు. తరువాత సౌదీ అరేబియా, మలేషియా ఉన్నాయి.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!