Mukesh Ambani statement on Jio 5G: హైస్పీడ్ 5జీ స్పెక్ట్రం సర్వీసులను ఈ ఏడాది దీపావళి నాటికి అందుబాటులోకి తేనున్నట్లు రిలయెన్స్ జియో సంస్థ ప్రకటించింది. తొలుత ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు రిలయెన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ ఆన్లైన్లో జరిగిన సంస్థ వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం)లో ఆయన కంపెనీ షేర్ హోల్డర్లను ఉద్దేశించి ప్రసంగించారు.
Top Five Software Companies in the World: మనకు పలు సాఫ్ట్వేర్ కంపెనీల పేర్లు, వాటి అధిపతుల గురించి తెలిసి ఉండొచ్చు. కానీ.. ప్రపంచంలోని టాప్ ఫైవ్ సాఫ్ట్వేర్ సంస్థలేవి అంటే మాత్రం సరిగ్గా ఆన్సర్ చెప్పలేం. ఈ ప్రశ్నకు ఠక్కున సమాధానం కావాలంటే ఎన్-బిజినెస్ అందిస్తున్న ఈ చిన్న వీడియో చూస్తే సరిపోతుంది. ప్రపంచంలో అగ్ర స్థానంలో ఉన్న ఐదు సాఫ్ట్వేర్ కంపెనీలు, వాటి సీఈఓల పేర్లు, ప్రధాన కార్యాలయం ఉన్న ప్ర'దేశం', రెవెన్యూ,…
Stock Market Analysis: సోమవారం నుంచి నిన్న శుక్రవారం వరకు ఇండియన్, గ్లోబల్ స్టాక్ మార్కెట్లు కనబరిచిన పనితీరును 'వెల్త్ ట్రీ గ్రూప్' ఫౌండర్ అండ్ సీఈఓ ప్రసాద్ దాసరి చక్కగా విశ్లేషించారు. వివిధ కంపెనీల షేర్ల కొనుగోళ్లు, అమ్మకాలను, స్టాక్ విలువల హెచ్చుతగ్గులపై అమెరికా వడ్డీ రేట్ల ప్రభావాన్ని వివరించారు. ఏయే సంస్థల స్టాక్స్ బాగా రాణించాయో చెప్పారు.
IT Companies Bumper Offer: కరోనా వైరస్ కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేసిన ఐటీ కంపెనీలు.. ఇప్పుడు ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించేందుకు శ్రమిస్తున్నాయి. చెప్పిన వెంటనే ఆఫీసులకు వచ్చే వారికి అదనపు సెలవులు, అధిక జీతం ఇచ్చేందుకు సిద్ధపడుతున్నాయి. ఆఫీసుకు వస్తే తాయిలాలు లేదంటే అలవెన్సులు, ఇతర సౌకర్యాల్లో కోత విధించేలా పలు కంపెనీలు చర్యలు చేపడుతున్నాయి. కార్యాలయాలకు వచ్చి పని చేసే ఉద్యోగులకు అధిక సెలవులు ఇవ్వడంతో పాటు భారీ…
Startups Achieved Unicorn Status: ఇండియన్ యూనికార్న్ క్లబ్లో ఈ ఏడాది కొత్తగా 20 స్టార్టప్లు చేరాయి. దీంతో ఇండియన్ యూనికార్న్ల మొత్తం సంఖ్య 106కి పెరిగింది. వీటన్నింటి అంచనా విలువ 343 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇందులో 94 బిలియన్ డాలర్ల ఫండింగ్ని ఈ స్టార్టప్లు బయటి సంస్థల నుంచి రైజ్ చేయటం విశేషం.
Special Story on Jio Super Success Journey: ప్రస్తుతం మన దేశంలోని అతిపెద్ద టెలికం సంస్థ రిలయెన్స్ జియో అనే సంగతి అందరికీ తెలిసిందే. జియో పూర్తి పేరు 'జాయింట్ ఇంప్లిమెంటేషన్ ఆపర్చునిటీ'. ఈ కంపెనీ 2016లో ప్రారంభమైంది. లాంఛ్ అయిన రెండేళ్లలోనే అతిపెద్ద బ్రాడ్బ్యాండ్ ప్రొవైడర్గా ఎదిగింది. రిలయెన్స్ జియోని ప్రారంభించాలనే ముఖేష్ అంబానీ ఆలోచనకు మూలకారణం ఆయన కూతురు ఇషా అంబానీ. కాలేజీ అసైన్మెంట్ సబ్మిట్ చేసే సమయంలో డేటా స్లోగా ఉండటం…
NTV Business Exclusive Interview Promo With Vani Kola. Watch Full Interview On 29th August: వాణీ కోలా. కలారి క్యాపిటల్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. ఫార్చ్యూన్ ఇండియా నిర్వహించిన సర్వేలో మన దేశ వ్యాపార రంగంలోని అత్యంత శక్తిమంతమైన మహిళల్లో ఒకరిగా నిలిచారు. ఇండియన్
EPFO News: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో మూడు నెలల నుంచి ప్రతి నెలా 10 లక్షల మందికి పైగానే ఉద్యోగులు నమోదవుతుండటం విశేషం. ఏప్రిల్లో 10 లక్షల 9 వేలు, మే నెలలో 10 లక్షల 7 వేలు, జూన్లో 10 లక్షల 54 మందికి పైగా చేరినట్లు జాతీయ గణాంక కార్యాలయం వెల్లడించింది.
Central Governement: దేశంలోని వంటనూనె తయారీ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. వంటనూనెలను ప్యాకింగ్ చేసే సమయంలో ఉష్ణోగ్రత ఎంత ఉందనే వివరాలు ఇవ్వడానికి బదులుగా ప్యాకెట్ లేదా సీసాలో ఎంత నూనె ఉందో తెలిపే ఘనపరిమాణం, బరువు వివరాలను ముద్రించాలని వంటనూనెల తయారీ కంపెనీలు, ప్యాకర్లు, దిగుమతిదార్లను కేంద్రం ఆదేశించింది. తూకం విషయంలో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కేంద్రం వివరించింది. వివరాల ముద్రణలో ఈ మార్పులు చేపట్టేందుకు…