మన దేశంలో క్రెడిట్ కార్డులను బీభత్సంగా వాడేస్తున్నారు. దీంతో ఒక్కనెలలోనే రూ.లక్ష కోట్లకు పైగా క్రెడిట్ కార్డు లావాదేవీలు జరిగాయి. కరోనా సంక్షోభం తర్వాత ఆర్థిక కార్యకలాపాలు గాడిలో పడ్డాయని చెప్పేందుకు ఈ గణాంకాలు ఉదాహరణ అని రిజర్వ్ బ్యాంక్ ఇండియా (ఆర్బీఐ) అభిప్రాయపడింది. మే నెలలో దేశంలో రూ.1.25 లక్షల కోట్ల క్రెడిట్ కార్డు లావాదేవీలను యూజర్లు నిర్వహించారని ఆర్బీఐ వెల్లడించింది. మే నెలలో 7.68 కోట్ల క్రెడిట్ కార్డు వినియోగదారులు ఆన్లైన్లో కొనుగోళ్ల కోసం…
ప్రస్తుతం దేశంలోని పలు టెలికాం కంపెనీల మధ్య పోటీ తీవ్రంగా ఉందనే చెప్పాలి. ముఖ్యంగా ఎయిర్టెల్, జియో మధ్య నువ్వా నేనా అన్నట్లుగా వార్ నడుస్తోంది. జియో దెబ్బతో ఎయిర్టెల్ కూడా రీ ఛార్జ్ ప్లాన్లను తక్కువ ధరకే అందిస్తుందని యూజర్లు అభిప్రాయపడుతున్నారు. అయితే నెట్వర్క్ పరంగా ఏది బెస్ట్ అయితే కస్టమర్లు దానినే ఎంచుకుంటున్నారు. ఎయిర్టెల్ నుంచి పోటీ ఉండటంతో జియో కూడా ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఒకప్పుడు మొబైల్ యూజర్లు 20…
బుధవారం భారీ నష్టాలను చవిచూసిన స్టాక్ మార్కెట్లు గురువారం నాడు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 443 పాయింట్ల లాభంతో 52,265 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 143 పాయింట్ల లాభంతో 15,556 వద్ద స్థిరపడింది. ఒక దశలో 600 పాయింట్ల వరకు సెన్సెక్స్ లాభపడుతుందని విశ్లేషకులు భావించారు. అటు నిఫ్టీ కూడా 15,600 పాయింట్లను దాటుకుని వెళ్లింది. అయితే చివరకు లాభాల జోరు తగ్గింది. ఈరోజు ట్రేడింగ్లో దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. ముఖ్యంగా ఆటో,…
దేశీయ స్టాక్మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందకపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లు విలవిలలాడాయి. ఈ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపైనా పడింది. ఫలితంగా సెన్సెక్స్ 709 పాయింట్ల భారీ నష్టంతో 51,822 వద్ద ముగియగా నిఫ్టీ 225 పాయింట్ల నష్టంతో 15,413 వద్ద స్థిరపడింది. గత రెండు రోజులు లాభాలను చవిచూసిన స్టాక్ మార్కెట్లు ముచ్చటగా మూడోరోజు అలాంటి లాభాలను చవిచూడలేక చతికిలపడ్డాయి. నిఫ్టీ 50లో ఐదు కంపెనీలు లాభాల్లో ముగియగా..…
దేశీయ స్టాక్మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాలతోనే ముగిశాయి. సెన్సెక్స్ 934 పాయింట్ల లాభంతో 52,532 వద్ద ముగియగా.. నిఫ్టీ 288 పాయింట్ల లాభంతో 15,638 వద్ద స్థిరపడింది. మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అదే ధోరణిని ప్రదర్శించాయి. సెన్సెక్స్ 30 సూచీలో ఒక్క నెస్లే ఇండియా మాత్రమే నష్టాలను చవిచూసింది. మిగతా కంపెనీల షేర్లు లాభాలను గడించాయి. అత్యధికంగా లాభాలను గడించిన కంపెనీలలో టెక్ దిగ్గజాల షేర్లు ఉన్నాయి. విప్రో, ఇన్ఫోసిస్, టెక్…
టెక్నాలజీ రోజూ కొత్త పుంతలు తొక్కుతూ మానవుడి జీవినశైలిలో భాగమైపోయింది. ప్రపంచం లేటెస్ట్ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తూనే ఉంది. టెక్నాలజీ రంగంలో అర్థమయ్యికానీ.. కొన్ని విషయాల్లో క్రిప్టో కరెన్సీ ఒకటి. అయితే క్రిప్టోలో పెట్టుబడులు పెట్టుబడులు పెట్టి కోట్ల ఘడించాలనుకొని బొక్కబోర్లా పడుతున్నారు. క్రిప్టోలో పెట్టుబడులు పెట్టి డబ్బులు సంపాదించాలని ప్రపంచ వ్యాప్తంగా ఎందరో మోసపోతున్నారు. అయితే అందులో భారతీయులు కూడా ఉన్నారు. అయితే నకిలీ క్రిప్టోకరెన్సీ ఎక్చేంజీలు ద్వారా భారతీయ పెట్టుబడిదారులు సుమారు 128…
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆరంభంలోనే 400 పాయింట్లకు పైగా ఎగిసిన ఆ తరువాత సెన్సెక్స్ 641 పాయింట్ల లాభంతో 52239 వద్ద, నిఫ్టీ 200 పాయింట్ల లాభంతో 15550 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ సానుకూల సంకేతాల నేపథ్యంలో సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. జాతీయం, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ లాభాలు ఎంతవరకు కొనసాగుతాయనేది చూడాల్సి ఉంది. ఒక్క ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ మినహా అన్ని రంగాల షేర్లలోనే కొనుగోళ్లు…
దేశంలో వంట నూనెల ధరలు మరింత తగ్గనున్నాయి. లీటరుకు గరిష్టంగా రూ.15 వరకు తగ్గింపు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గడంతో మరో వారంలో హోల్సేల్ మార్కెట్లలో నూనె ధరల తగ్గింపు అమలు కానుంది. పామాయిల్పై లీటరుకు రూ.7 నుంచి 8, సన్ఫ్లవర్ ఆయిల్పై రూ.10 నుంచి 15 వరకు, సోయాబీన్పై రూ.5 తగ్గే అవకాశం ఉంది. మే నెలలో వంట నూనెల కేటగిరిలో రికార్డు స్థాయిలో 13.26 శాతంగా ద్రవ్యోల్బణం నమోదైంది. దీంతో…
వరుసగా మూడవరోజూ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో పాటు, మరో ఆర్థిక సంక్షోభం రాబోతోందనే అంచనాలు మార్కెట్లను ప్రభావితం చేశాయని మార్కెటింగ్ నిపుణులు చెబుతున్నారు. ఈరోజు ఉదయం నష్టాల్లోనే ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత కాస్త కోలుకున్నాయి. అయితే వెంటనే మళ్లీ పతనంతో ముందుకు నడిచాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 153 పాయింట్లు కోల్పోయింది. 52,693కి సెన్సెక్స్ పడిపోయింది. నిఫ్టీ 42 పాయింట్లు నష్టపోయి 15,732 వద్ద స్థిరపడింది. భారతి…