SAIL Entered Trillion Club: లక్ష కోట్లకు పైగా టర్నోవర్ కలిగిన కంపెనీల క్లబ్లోకి తొలిసారిగా ‘సెయిల్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SAIL Entered Trillion Club: లక్ష కోట్ల రూపాయలకు పైగా టర్నోవర్ కలిగిన ఎలైట్ క్లబ్ ఆఫ్ ఇండియన్ కంపెనీస్ జాబితాలోకి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా తొలిసారిగా చేరింది. 2021-22 మధ్య కాలంలో 18.73 మిలియన్ టన్నుల హాట్ మెటల్ని మరియు 17.36 మిలియన్ టన్నుల క్రూడ్ స్టీల్ని ఉత్పత్తి చేసింది. ఈ సంస్థకు సంబంధించి ఇదే ఇప్పటివరకు బెస్ట్ పెర్ఫార్మెన్స్ కావటం గమనించాల్సిన అంశం. ఆపరేషన్ పెర్ఫార్మెన్స్తోపాటు అత్యధిక లాభాలను ఆర్జించటంతో టర్నోవర్లో భారీ గ్రోత్ నెలకొందని చైర్పర్సన్ వెల్లడించారు.
హైదరాబాద్లో సిలికాన్ ల్యాబ్స్ ఆఫీస్
Also Read
- Stock Market: TCS దూకుడు మామూలుగా లేదుగా.. ఒక్క వారంలోనే రూ.72,000 కోట్ల లాభం!
- Upcoming IPO 2026: వచ్చే వారం 7 ఐపీఓలు ప్రారంభం.. ఏ కంపెనీ IPOలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువ?
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
ఇంజనీరింగ్ ఉత్పత్తులతోపాటు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారంగా పనిచేసే ప్రొడక్టులను డెవలప్ చేసే సిలికాన్ ల్యాబ్స్ హైదరాబాద్లో ఆఫీసును ప్రారంభించింది. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కార్యాలయాన్ని ఏర్పాటుచేసింది. ఇందులో ప్రస్తుతం 500 మంది ఎంప్లాయ్స్ ఉండగా ఈ సంఖ్యను వచ్చే మూడేళ్లలో 15 వందలకి పెంచనున్నట్లు తెలిపారు. అంటే భవిష్యత్తులో మరో వెయ్యి మందిని రిక్రూట్ చేసుకుంటామని వెల్లడించారు. వైర్లెస్ ఉత్పత్తులు, ఇండస్ట్రియల్, కమర్షియల్, హౌజ్హోల్డ్ అప్లికేషన్స్, సొల్యూషన్లను ఈ సెంటర్లో అభివృద్ధి చేయనున్నారు.
read also: Rupee Effect on Foreign Education: రూపాయి విలువ పతనం.. భారతీయ విద్యార్థులకు భారం..
ఫ్రీ రేషన్తో రూ.44,762 కోట్ల భారం
దేశవ్యాప్తంగా పేదలకు ఉచితంగా రేషన్ అందించే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. కొవిడ్ నేపథ్యంలో 2020 ఏప్రిల్లో ప్రారంభమైన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన తాజా నిర్ణయంతో ఈ ఏడాది డిసెంబర్ వరకు అమల్లో ఉంటుంది. దసరా, దీపావళి తదితర ప్రధాన పండుగలతోపాటు గుజరాత్ మరియు హిమాచల్ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై 44,762 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది.
స్టాక్ మార్కెట్ అప్డేట్
ఎట్టకేలకు స్టాక్ మార్కెట్ల వరుస భారీ నష్టాలకు బ్రేక్ పడింది. ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఎర్లీ అవర్స్లో 261 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ 56859 వద్ద ట్రేడింగ్ కాగా ఇంట్రాడేలో వంద పాయింట్లకు పైగా నష్టాల్లోకి జారుకుంది. నిఫ్టీ సైతం 84 పాయింట్ల ప్లస్ స్థితి నుంచి నష్టాల అంచుల్లో 16859కి పైన ట్రేడింగ్ అవుతోంది. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ 81.56 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Rahul Gandhi: సీజేపీ నిరసనలపై స్పందించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. ఏమన్నారంటే?
-
NBK 111 : షూటింగ్ లో బాలయ్య కు ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు
-
Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్షీట్తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
-
CJP Protest: “4 గంటల సమయం దండగ”.. జేపీ నడ్డాతో భేటీపై సీజేపీ నేతల తీవ్ర ఆగ్రహం!
ట్రెండింగ్
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!