Global Capability Centres: హైదరాబాద్ అవుతోంది ‘గ్లోబల్’. అదీ.. ఈ సిటీ ‘క్యాపబిలిటీ’ అంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Global Capability Centres: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్.. విశ్వ నగరంగా ఎదుగుతోందనటానికి మరో చక్కని ఉదాహరణ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు. ఈ సెంటర్లకు భాగ్య నగరం కేంద్రంగా మారుతోంది. ఈ మేరకు పలు బహుళజాతి సంస్థలు ఇక్కడికి క్యూ కడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కస్టమర్ల కోసం కంపెనీలు ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల నిర్వహణను ఎంతో కీలకంగా భావిస్తున్నాయి. హైదరాబాద్లో ప్రస్తుతం మైక్రోసాఫ్ట్, జేపీ మోర్గాన్, యాపిల్, హెచ్ఎస్బీసీ, ఏడీపీ, గూగుల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, అమేజాన్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, నోవార్టిస్, డెలాయిట్ తదితర సంస్థల గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు ఉన్న సంగతి తెలిసిందే.
ఊపందుకున్న డెబిట్ కార్డుల జారీ
Also Read
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
గత ఆర్థిక సంవత్సరంలోని చివరి ఏడు నెలల్లో మందగించిన డెబిట్ కార్డుల జారీ ప్రక్రియ ఈ ఫైనాన్షియల్ ఇయర్లోని మొదటి ఐదు నెలల్లో ఊపందుకుంది. కమర్షియల్ బ్యాంకులు దాదాపు 17 మిలియన్ల కార్డులను వినియోగదారులకు అందజేశాయి. ఇది గతేడాదితో పోల్చితే 30 శాతం ఎక్కువ కావటం విశేషం. గత ఆర్థిక సంవత్సరంలోని ఇదే సమయంలో బ్యాంకులు 13 మిలియన్ల కార్డులను మాత్రమే జారీ చేశాయి. యాక్టివ్గా లేని ప్లాస్టిక్ కార్డులను ఏరివేయటం ద్వారా బ్యాంకులు తమ కార్డ్ పోర్ట్ఫోలియోలను క్లీనప్ చేయటం వల్లే గతేడాది చివరి ఏడు నెలల్లో కొత్త కార్డుల జారీ వేగం తగ్గింది.
read also: Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో పాల్గొన్న సోనియాగాంధీ.
డీ-మార్ట్ ఆదాయ వృద్ధి 35 శాతం పైనే
డి-మార్ట్ రిటైల్ చెయిన్ను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్మార్ట్స్ లిమిటెడ్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని రెండో త్రైమాసికంలో 35 శాతానికి పైగా ఆదాయ వృద్ధిని సాధించింది. దీంతో 10,384 కోట్ల రూపాయల రెవెన్యూని నమోదు చేసింది. గతేడాది ఈ ఆదాయం 7649 కోట్ల రూపాయలు మాత్రమే కావటం గమనించాల్సిన విషయం. సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొందిన రెవెన్యూ వివరాలను రెగ్యులేటరీకి సోమవారం సమర్పించిన నివేదికలో డీ-మార్ట్ వెల్లడించింది.
స్టాక్ మార్కెట్ అప్డేట్
నిన్న పండుగ సెలవు అనంతరం ఇవాళ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 445 పాయింట్లు పెరిగి 58510 వద్ద ట్రేడింగ్ అవుతోంది. నిఫ్టీ 123 పాయింట్లు లాభపడి 51910 వద్ద కొనసాగుతోంది. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ 81.64 పలుకుతోంది. 10 గ్రాముల బంగారం ధర రూ.51,940, కిలో వెండి రూ.61,579 వద్ద ట్రేడింగ్ అవుతున్నాయి. ఇవాళ రిల్, ఓఎన్జీసీ, ఓఎంసీస్, డీఎల్ఎఫ్, స్పైస్జెట్, జీ, బీఓబీ షేర్లు ఆశాజనకంగా ఉన్నాయి.
తాజావార్తలు
-
SBI GPAI: SBI అకౌంట్ ఉన్నవారు తప్పక తీసుకోవాల్సిన పాలసీ!.. రూ.20 లక్షలు పొందే ఛాన్స్!
-
Tollywood : టాలీవుడ్లో సెగలు పుట్టిస్తున్న ‘సింగిల్ స్క్రీన్’ వివాదం.. రెండుగా చీలిన నిర్మాతలు
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
Virat Kohli: సెంచరీ కొట్టినా సెలబ్రేషన్స్ ఎందుకు జరుపుకోలేదు?.. కోహ్లీ ఇచ్చిన ఆన్సర్ వింటే ఫిదా అవ్వాల్సిందే!
-
Manish Pandey: క్యాచ్ ఆఫ్ ది సీజన్.. మనీష్ పాండే ఒక్క చేతి డైవ్.. కోహ్లీని ఆశ్చర్యపరచిన క్యాచ్
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!