Global Capability Centres: హైదరాబాద్ అవుతోంది ‘గ్లోబల్’. అదీ.. ఈ సిటీ ‘క్యాపబిలిటీ’ అంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Global Capability Centres: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్.. విశ్వ నగరంగా ఎదుగుతోందనటానికి మరో చక్కని ఉదాహరణ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు. ఈ సెంటర్లకు భాగ్య నగరం కేంద్రంగా మారుతోంది. ఈ మేరకు పలు బహుళజాతి సంస్థలు ఇక్కడికి క్యూ కడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కస్టమర్ల కోసం కంపెనీలు ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల నిర్వహణను ఎంతో కీలకంగా భావిస్తున్నాయి. హైదరాబాద్లో ప్రస్తుతం మైక్రోసాఫ్ట్, జేపీ మోర్గాన్, యాపిల్, హెచ్ఎస్బీసీ, ఏడీపీ, గూగుల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, అమేజాన్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, నోవార్టిస్, డెలాయిట్ తదితర సంస్థల గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు ఉన్న సంగతి తెలిసిందే.
ఊపందుకున్న డెబిట్ కార్డుల జారీ
Also Read
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
గత ఆర్థిక సంవత్సరంలోని చివరి ఏడు నెలల్లో మందగించిన డెబిట్ కార్డుల జారీ ప్రక్రియ ఈ ఫైనాన్షియల్ ఇయర్లోని మొదటి ఐదు నెలల్లో ఊపందుకుంది. కమర్షియల్ బ్యాంకులు దాదాపు 17 మిలియన్ల కార్డులను వినియోగదారులకు అందజేశాయి. ఇది గతేడాదితో పోల్చితే 30 శాతం ఎక్కువ కావటం విశేషం. గత ఆర్థిక సంవత్సరంలోని ఇదే సమయంలో బ్యాంకులు 13 మిలియన్ల కార్డులను మాత్రమే జారీ చేశాయి. యాక్టివ్గా లేని ప్లాస్టిక్ కార్డులను ఏరివేయటం ద్వారా బ్యాంకులు తమ కార్డ్ పోర్ట్ఫోలియోలను క్లీనప్ చేయటం వల్లే గతేడాది చివరి ఏడు నెలల్లో కొత్త కార్డుల జారీ వేగం తగ్గింది.
read also: Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో పాల్గొన్న సోనియాగాంధీ.
డీ-మార్ట్ ఆదాయ వృద్ధి 35 శాతం పైనే
డి-మార్ట్ రిటైల్ చెయిన్ను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్మార్ట్స్ లిమిటెడ్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని రెండో త్రైమాసికంలో 35 శాతానికి పైగా ఆదాయ వృద్ధిని సాధించింది. దీంతో 10,384 కోట్ల రూపాయల రెవెన్యూని నమోదు చేసింది. గతేడాది ఈ ఆదాయం 7649 కోట్ల రూపాయలు మాత్రమే కావటం గమనించాల్సిన విషయం. సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొందిన రెవెన్యూ వివరాలను రెగ్యులేటరీకి సోమవారం సమర్పించిన నివేదికలో డీ-మార్ట్ వెల్లడించింది.
స్టాక్ మార్కెట్ అప్డేట్
నిన్న పండుగ సెలవు అనంతరం ఇవాళ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 445 పాయింట్లు పెరిగి 58510 వద్ద ట్రేడింగ్ అవుతోంది. నిఫ్టీ 123 పాయింట్లు లాభపడి 51910 వద్ద కొనసాగుతోంది. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ 81.64 పలుకుతోంది. 10 గ్రాముల బంగారం ధర రూ.51,940, కిలో వెండి రూ.61,579 వద్ద ట్రేడింగ్ అవుతున్నాయి. ఇవాళ రిల్, ఓఎన్జీసీ, ఓఎంసీస్, డీఎల్ఎఫ్, స్పైస్జెట్, జీ, బీఓబీ షేర్లు ఆశాజనకంగా ఉన్నాయి.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!