Demand For Heavy Vehicles: మధ్య తరహా, భారీ వాణిజ్య వాహనాల కొనుగోళ్లు ఈ ఏడాది 50 శాతం పెరిగే ఛాన్స్ ఉందని డైమ్లర్ ఇండియా కమర్షియల్ వెహికిల్స్ ఎండీ అండ్ సీఈఓ సత్యకం ఆర్య అన్నారు. ఈ వాహనాలకు గత కొద్ది నెలలుగా డిమాండ్ ఏర్పడిందని చెప్పారు. జనవరి, ఆగస్టు మధ్య కాలంలో ట్రక్కులు, బస్సుల అమ్మకాల్లో వృద్ధి నెలకొందని పేర్కొన్నారు. అయితే 2018లో మాదిరిగా పీక్ లెవల్లో మాత్రం సేల్స్ జరగట్లేదని తెలిపారు.
Indian Youth Opting Gig jobs: మన దేశంలో యువత గతంలో ఎన్నడూ లేనంతగా గిగ్ జాబ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలోని తొలి త్రైమాసికంలో గతేడాది కన్నా 50 శాతం ఎక్కువ మంది ఈ కొలువుల్లో చేరారు. ముఖ్యంగా జాబ్ ఫ్లెక్సిబిలిటీ ఉండటం వల్ల 3 నుంచి 5 ఏళ్ల అనుభవం కలిగినవారు వీటిపై ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లు ఫ్లెక్సింగిట్ అనే ఫ్రీల్యాన్స్ జాబ్స్ ప్లాట్ఫాం వెల్లడించింది. టెక్నాలజీ స్కిల్స్కి డిమాండ్ నెలకొనటం…
Retirement Age Hike: రిటైర్మెంట్ వయసు పెంచాలనే ప్రతిపాదనకు ఈపీఎఫ్ఓ కూడా అనుకూలంగా ఓటేస్తోంది. తద్వారా పెన్షన్ ఫండ్లపై ఒత్తిడి తగ్గుతుందని అంచనా. విజన్-2047 డాక్యుమెంట్లో ఈ విషయాన్ని వెల్లడించింది. మరో పాతికేళ్లలో మన దేశంలో 60 ఏళ్ల వయసు పైబడేవారి సంఖ్య దాదాపు 140 మిలియన్ల మందికి చేరుతుందని పేర్కొంది. రిటైర్మెంట్ వయసు పెంపు అనేది ఇతర దేశాల్లో అమలవుతున్నట్లు తెలిపింది.
FlipKart: దసరా, దీపావళి వంటి పండగలు వస్తుండటంతో చాలా మంది షాపింగ్ చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ పేరుతో బిగ్గెస్ట్ సేల్ను అందుబాటులోకి తెస్తోంది. ఈ మేరకు కమింగ్ సూన్ అంటూ ఫ్లిప్కార్ట్ ప్రకటన చేసింది. అయితే ఈ సేల్ సెప్టెంబర్ 23 నుంచి 30 మధ్య ఉంటుందని బిజినెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్లో స్మార్ట్ ఫోన్ నుంచి స్టార్ట్…
Mobikwik: మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో తమ సంస్థ మొత్తం ఆదాయం 80 శాతం పెరిగి 540 కోట్లకు చేరినట్లు ఫిన్టెక్ కంపెనీ మొబీక్విక్ వెల్లడించింది. ఇందులో 300 కోట్లకు పైగా ఆదాయం 2020-21లోనే సమకూరినట్లు స్పష్టం చేసింది. ఆ సంవత్సరం 30 కోట్లు మాత్రమే కంట్రిబ్యూషన్ మార్జిన్ రాగా అది ఇప్పుడు రూ.145 కోట్లకు పెరిగిందని పేర్కొంది.
Star Bucks: ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల్లో భారతీయుల హవా కొనసాగుతోంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల, ట్విట్టర్ సీఈవోగా పరాగ్ అగర్వాల్, గూగుల్ సీఈవోగా సుందర్ పిచాయ్, అడోబ్ ఐఎన్సీ ఛైర్మన్గా షాంతను నారాయణ్ నియమితులయ్యారు. తాజాగా ప్రపంచంలో అత్యధిక కాఫీ షాపులు కలిగి ఉన్న అమెరికా దిగ్జజం స్టార్ బక్స్ సంస్థ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా భారత్కు చెందిన లక్ష్మణ్ నరసింహన్ ఎంపికయ్యారు. ఆయన ఇప్పటిదాకా డ్యూరెక్స్ కండోమ్లు, ఎన్ఫామిల్ బేబీ…
India's Good News to World: ప్రపంచంలోనే ఎక్కువ చక్కెరను ఉత్పత్తి చేస్తున్న మన దేశం వచ్చే సీజన్ నుంచి అంటే ఈ ఏడాది అక్టోబర్ నుంచి రెండు విడతల్లో విదేశాలకు ఎగుమతులు చేయనుంది. ఇటు రైతులు.. అటు వినియోగదారులు.. ఇద్దరి ప్రయోజనాలనూ బ్యాలెన్స్ చేస్తూ ఎవరికీ చేదు అనుభవం ఎదురుకాకుండా ముందుచూపుతో వ్యవహరించనుంది. షుగర్ ఎక్స్పోర్ట్లపై ప్రస్తుత సీజన్లో కేంద్ర ప్రభుత్వం పరిమితులు విధించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా సప్లై తగ్గి ధరలు పెరిగాయి.
Gold Rates: దేశవ్యాప్తంగా పసిడి ధరలు మరోసారి భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 540 తగ్గి రూ.50,730కి చేరింది. అటు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.500 తగ్గి రూ.46,500 కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,950గా నమోదు కాగా 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.46,700గా ఉంది. వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. కిలో వెండి…
Disney Follows Amazon Prime: అమేజాన్ ప్రైమ్ మాదిరిగానే డిస్నీ కస్టమర్లకి కూడా త్వరలో డిస్నీ ప్రైమ్ అందుబాటులోకి రానున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. సబ్స్క్రిప్షన్ సర్వీసులను ప్రారంభించేందుకు ఈ సంస్థ కసరత్తు చేస్తోంది. డిస్నీ ప్లస్ అనే స్ట్రీమింగ్ సర్వీస్తోపాటు డిస్నీ ప్రైమ్ కూడా ఆరంభమైతే బ్రాండెడ్ మర్చెండైజ్లు, థీమ్ పార్క్లు, ప్రొడక్ట్లపై డిస్కౌంట్లు ప్రకటించనుంది. అమేజాన్ ప్రైమ్ని స్ఫూర్తిగా తీసుకొని డిస్నీ ఎగ్జ్క్యూటివ్లు ఈ కొత్త ప్రణాళికను రచించారు.
Increase Credit: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరుపై సమీక్షా సమావేశం నిర్వహించింది. క్రెడిట్ గ్రోత్ను మరింత పెంచాలని, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ల స్థితిగతుల పైన కూడా ఫోకస్ పెట్టాలని ఆదేశించింది. నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కార్యకలాపాలను ప్రారంభించటంపై ఆసక్తితో ఉన్నామని ప్రభుత్వం చెప్పినట్లు తెలుస్తోంది.