American Express Credit Cards: కొత్త క్రెడిట్ కార్డులను జారీచేయకుండా అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్పై విధించిన నిషేధాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎత్తివేసింది. లోకల్ డేటా స్టోరేజ్ రూల్స్ పాటించట్లేదనే కారణంతో 2021 ఏప్రిల్లో నిషేధం విధించిన ఆర్బీఐ 15 నెలల అనంతరం నిన్న అనుమతించింది.
Investment-Profit: జెన్సోల్ ఇంజనీరింగ్ కంపెనీ షేర్ల విలువ ఆకాశమే హద్దుగా ఏడాదిలోనే 2,600 శాతం పెరిగింది. సంవత్సరం కిందట పెట్టిన 10 వేల రూపాయల పెట్టుబడి ఇప్పుడు ఏకంగా 2.77 లక్షలకు పెరిగింది. అహ్మదాబాద్కి చెందిన ఈ రెనివబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రొవైడర్.. ఐదారు లక్షలకే ఎలక్ట్రిక్ కారును అందుబాటులోకి తేనుంది.
IT Slow Growth: మన దేశం చేస్తున్న ఏకైక అతిపెద్ద ఎగుమతి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) సర్వీసులు. విదేశీ మారకానికి కూడా ఇదే కీలకమైన సోర్స్. కానీ ఐటీ ఇండస్ట్రీ ఈ మధ్య ఆశించిన ఫలితాలను సాధించలేకపోతోంది. దీంతో ఆదాయం క్రమంగా తగ్గిపోతోంది.
Mobile Prices: మొబైల్ కొనుగోలు చేయాలనుకునేవాళ్లకు చేదువార్త అందింది. దేశవ్యాప్తంగా త్వరలోనే మొబైల్ ధరలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. మొబైల్ డిస్ప్లేకు అనుసంధానించే స్పీకర్లు, సిమ్ ట్రేలు, పవర్ కీల దిగుమతులపై 15% సుంకం విధిస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్& కస్టమ్స్(CBIC) ప్రకటించింది. ఈ భారాన్ని ఆయా కంపెనీలు వినియోగదారులపైనే మోపే అవకాశం ఉంది. ఇదే జరిగితే స్మార్ట్ఫోన్ల ధరలు పెరగనున్నాయి. చాలా కంపెనీలు ఇండియాలోనే స్మార్ట్ఫోన్లను తయారు చేస్తున్నప్పటికీ విడిభాగాలను మాత్రం…
One Man Two Jobs: ఒక ఉద్యోగి రెండు సంస్థల్లో పనిచేయటం సరికాదని విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్జీ పేర్కొన్నారు. అది మోసంతో సమానమని అభిప్రాయపడ్డారు. మూన్లైటింగ్గా పేర్కొనే ఈ పథకానికి ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఇటీవల అనుమతించిన సంగతి తెలిసిందే.
Ola Cabs Fined By Court: ప్రస్తుత రోజుల్లో ఒక ఫ్యామిలీ బయటకు వెళ్లాలంటే కారు ఉండాల్సిందే. అయితే సొంత కారు లేని వాళ్లు క్యాబ్లపై ఆధారపడుతున్నారు. దీంతో ఓలా లేదా ఉబర్ క్యాబ్లను బుక్ చేసుకుంటున్నారు. కానీ ఓలా, ఉబర్లు సామాన్యులను పిండి పిప్పి చేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓలా క్యాబ్స్కు హైదరాబాద్ వినియోగదారుల కోర్టు భారీ జరిమానా విధించింది. కేవలం 4-5 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన ఓ కస్టమర్కు ఓలా క్యాబ్స్…
Boycott Amazon in social media: ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్ అమెజాన్పై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. హిందూ దేవుళ్లను కించపరిచేలా అమెజాన్ కొన్ని వస్తువులను విక్రయిస్తుందని ఆరోపిస్తూ #Boycott_Amazon హాష్ ట్యాగ్తో ట్వీట్లు చేస్తున్నారు. స్వస్తిక్ గుర్తుతో ఫ్లోర్ మ్యాట్స్తో పాటు కృష్ణాష్టమి పండగ సందర్భంగా శ్రీకృష్ణుడిని అవమానించేలా పోస్టర్లను అమెజాన్లో ఆన్లైన్లో అమ్మకానికి ఉంచిందని నెటిజన్లు మండిపడుతున్నారు. అభ్యంతర కరమైన ఫోటోలను షేర్ చేసి హిందువుల మనోభావాల్ని అమెజాన్ దెబ్బతీసిందంటూ ఆగ్రహం వ్యక్తం…
ICICI Bank: ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ తన ఖాతాదారులకు గుడ్ న్యూస్ అందించింది. తాజాగా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ వెల్లడించింది. రూ. 2 కోట్ల కంటే తక్కువగా ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లపై వివిధ కాల వ్యవధులకు వడ్డీ రేట్లను సవరించినట్లు వివరించింది. 7 రోజుల నుండి 29 రోజుల వరకు మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంక్ 2.75 శాతం వడ్డీ రేటును ఇస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది.…
IRCTC Fund raising: ఇండియన్ రైల్వేస్కి టికెట్ బుకింగ్ సర్వీస్ అందిస్తున్న ఐఆర్సీటీసీ.. ప్రయాణికుల సమాచారంతో వెయ్యి కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు కన్సల్టెంట్ని ఎంపిక చేసేందుకు టెండర్లు ఆహ్వానించింది. ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీలతో నిర్వహించే
Wipro: ప్రముఖ ఐటీ రంగ సంస్థ విప్రో తమ ఉద్యోగులకు గుడ్న్యూస్ అందించింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కంపెనీ లాభాలు తగ్గడంతో ఈ ఏడాది వేరియబుల్ పే నిలిపివేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని విప్రో ఖండించింది. సెప్టెంబర్ 1 నుంచి ఉద్యోగుల జీతాల పెంపు విషయంలో ఎలాంటి మార్పు ఉండదని విప్రో స్పష్టం చేసింది. తాము తీసుకున్న నిర్ణయంపై ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని.. అనుకున్న ప్రకారమే తమ ఉద్యోగులకు వేరియబుల్ పే అందిస్తామని తెలిపింది. మీడియాలో వస్తున్నట్లు వేతనాల పెంపును…