Wind Man of India: ‘విండ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ తుల్సి తంతి ఇకలేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wind Man of India: సుజ్లాన్ ఎనర్జీ అనే సంస్థకు ఫౌండర్గానే కాకుండా ‘విండ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా కూడా పేరొందిన తుల్సి తంతి కన్నుమూశారు. మన దేశంలోని పవన విద్యుత్ వ్యాపార దిగ్గజాల్లో ఈయన కూడా ఒకరు కావటం చెప్పుకోదగ్గ విషయం. తుల్సి తంతి క్లీన్ ఎనర్జీ సెక్టార్లో సైతం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందటం విశేషం. సుజ్లాన్ ఎనర్జీ కంపెనీ ప్రస్తుత మార్కెట్ విలువ 8 వేల 5 వందల 35 కోట్ల రూపాయలకు పైగా నమోదు అయింది. విండ్ పవర్ ఫీల్డ్లోకి రాకముందు తుల్సి తంతి టెక్స్టైల్ బిజినెస్ చేసేవారు.
టెస్లా కార్ల కంపెనీ డెలివరీలో రికార్డు
Also Read
- Bank Holidays September 2026: సెప్టెంబర్ 2026 బ్యాంక్ సెలవులు ఇవే.. బ్యాంకుకు వెళ్లే ముందు లిస్ట్ చెక్ చేయండి
- September 1, 2026 New Rules: సెప్టెంబర్ 2026 నుంచి కీలక మార్పులు.. ITR, LPG e-KYC, FD రూల్స్ వరకు పూర్తి లిస్ట్ ఇదే
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
టెస్లా కార్ల కంపెనీ డెలివరీ చరిత్రలో కొత్త రికార్డు నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరంలోని మూడో త్రైమాసికంలో 3 లక్షల 65 వేలకు పైగా వాహనాలను ఉత్పత్తి చేసిన టెస్లా.. అందులో 3 లక్షల 43 వేలకు పైగా వాహనాలను డెలివరీ చేసింది. తొలి త్రైమాసికంలో 3 లక్షల 10 వేల వాహనాలను మాత్రమే డెలివరీ చేసిన టెస్లా రెండో త్రైమాసికంలో మరీ తక్కువగా రెండున్నర లక్షల వాహనాలకే పరిమితమైంది. అయితే మూడో త్రైమాసికంలో 3 లక్షల 60 వేల వాహనాలను డెలివరీ చేస్తుందనే అంచనాలకు మాత్రం కొద్ది దూరంలో ఉండిపోయింది.
read also: New Traffic Rules: నేటి నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్.. ఇవి పాటించకపోతే బాదుడే బాదుడు..
ఐటీని లీడ్ చేయనున్న ఇన్ఫోసిస్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని రెండో త్రైమాసికంలో ఐటీ రంగం పనితీరు విషయంలో దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ ఇతర సంస్థల కన్నా ముందు వరుసలో నిలవనుందనే అంచనాలు నెలకొన్నాయి. త్రైమాసిక ఫలితాల్లో నాలుగు శాతం రెవ్యెన్యూ గ్రోత్ను నమోదుచేస్తుందని జఫరీస్ అనే రీసెర్చ్ సంస్థ తన నివేదికలో పేర్కొంది. ఇండియన్ ఐటీ సెక్టార్ మొత్తం రెవెన్యూ గ్రోత్ని 3.6 శాతంగానే అంచనా వేసిన జెఫరీస్.. ఇన్ఫోసిస్ ఫలితాలను మాత్రం అంతకన్నా ఎక్కువగా అంటే 4 శాతంగా ఎస్టిమేట్ వేసింది.
స్టాక్ మార్కెట్ అప్డేట్
స్టాక్ మార్కెట్లు ఈ నెల, ఈ వారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 350 పాయింట్లు కోల్పోయి 57076 వద్ద ట్రేడింగ్ అవుతోంది. నిఫ్టీ 107 పాయింట్ల తగ్గి 16986 పైన కొనసాగుతోంది. ఆయిల్ ఇండియా, ఓఎన్జీసీ షేర్లు 6 శాతం దాక లాభపడ్డాయి. అపోలో ట్యూబ్స్, ఐషర్, కోలిండియా, ఇండియాబుల్స్ స్టాక్స్ ఆశాజనకంగా ఉన్నాయి. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ 81.64 వద్ద కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Venus Enters Libra: సెప్టెంబర్ 2 నుంచి ఈ 4 రాశుల వారికి అదృష్టమే అదృష్టం.. ఉద్యోగం, డబ్బు, వాహనం కొనుగోలు యోగం!
-
Skincare Tips: బ్యూటీ పార్లర్కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
-
Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Nepal Floods: “నువ్వు దేవుడు సామీ”.. వరదల్లో 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన ప్రిన్సిపాల్
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!