Union Nari Shakti Scheme: మహిళా పారిశ్రామికవేత్తలకు వెయ్యి కోట్లకు పైగా రుణాలు
Union Nari Shakti Scheme: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. యూనియన్ నారీ శక్తి పథకంలో భాగంగా మహిళా పారిశ్రామికవేత్తలకు వెయ్యి కోట్లకు పైగా రుణాలను మంజూరుచేసింది. దేశం మొత్తమ్మీద 10 వేల మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 2 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు లోన్లు ఇచ్చింది. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు మరియు వాళ్ల అవసరాలను బట్టి లోన్ అమౌంట్ను నిర్ణయిస్తున్నామని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ మినోచి చెప్పారు.
తగ్గిన ఎగుమతులు.. పెరిగిన దిగుమతులు..
Also Read
- Post Office Scheme: కేవలం వడ్డీతోనే రూ.18 లక్షలు.. సింపుల్గా కోటీశ్వరులు అయ్యే ఛాన్స్!
- Jio New Plan: జియో చవకైన గేమింగ్ ప్లాన్.. సూపర్ బెనిఫిట్స్.. ధర ఎంతంటే?
- Elon Musk: ఎలాన్ మస్క్ నిమిషానికి, గంటకు ఎంత సంపాదిస్తాడో తెలిస్తే.. షాకవ్వాల్సిందే!
- Business In Postal: నిరుద్యోగులకు మంచి బిజినెస్ అవకాశం కల్పిస్తోన్న పోస్టల్ శాఖ.. దరఖాస్తులు ఆహ్వానం..
గత నెలలో ఇండియా ఎగుమతులు 3.52 శాతం తగ్గాయి. దీంతో ఎగుమతుల విలువ 32.62 బిలియన్ డాలర్లకే పరిమితమైంది. ఇదే సమయంలో దిగుమతులు 5.44 శాతం పెరిగాయి. మొత్తం దిగుమతుల విలువ 59.35 బిలియన్ డాలర్లుగా నమోదైంది. దిగుమతులు గతేడాది సెప్టెంబర్ నెలతో పోల్చితే దాదాపు 3 శాతం పెరిగాయి. గత ఏడు నెలల్లో దిగుమతులు 60 బిలియన్ల లోపుకే పరిమితం కావటం ఇదే తొలిసారి. ఈ డేటాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.
read also: Dubai: ముస్లిం దేశంలో హిందూ ఆలయం.. దసరా సందర్భంగా ప్రారంభం
పీఎన్బీ వాట్సాప్ సర్వీలు ప్రారంభం
పంజాబ్ నేషనల్ బ్యాంక్.. కస్టమర్లు మరియు నాన్-కస్టమర్ల కోసం వాట్సాప్ బ్యాంకింగ్ సర్వీస్ను ప్రారంభించింది. సెలవు రోజులు సహా రోజుకి 24 గంటలు ఈ సేవలు ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ బేస్డ్ మొబైల్ ఫోన్లలో అందుబాటులో ఉంటాయని పీఎన్బీ పేర్కొంది. బ్యాంక్ సేవలను మరింత మందికి చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ సర్వీస్ను లాంఛ్ చేసినట్లు తెలిపింది. వాట్సాప్ సర్వీస్ను వాడుకోవాలనుకునేవారు ముందుగా పీఎన్బీ వాట్సాప్ నంబర్ 92640 92640ను ఫోన్ బుక్లో సేవ్ చేసుకొని ఆ తర్వాత హాయ్ అని గానీ హలో అని గానీ టైప్ చేయటం ద్వారా కన్వర్జేషన్ స్టార్ట్ చేయాలని సూచించింది.
స్టాక్ మార్కెట్ అప్డేట్
దేశీయ స్టాక్ మార్కెట్లలో దసరా జోష్ కనిపిస్తోంది. ఇవాళ భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ‘బ్రిటన్ ట్యాక్స్’తో గ్లోబల్ మార్కెట్లలో సానుకూల సంకేతాలు నెలకొన్నాయి. సెన్సెక్స్ 1092 పాయింట్లు పెరిగి 57881 వద్ద ట్రేడింగ్ అవుతోంది. నిఫ్టీ 294 పాయింట్లు ప్లస్ అయి 17181కి పైనే కొనసాగుతోంది. ఇండస్ఇండ్ బ్యాంక్ షేరు విలువ 4 శాతం పెరిగింది.
తాజావార్తలు
-
FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..
-
Sanju Samson: గుజరాత్ టైటాన్స్పై చేసిన పరుగులు 11.. అయినా మరో రికార్డ్ సాధించిన సంజూ శాంసన్..
-
Post Office Scheme: కేవలం వడ్డీతోనే రూ.18 లక్షలు.. సింపుల్గా కోటీశ్వరులు అయ్యే ఛాన్స్!
-
Weight Loss: బరువు తగ్గాలనుకునే వారికి శుభవార్త.. ఇంత వరకు ఎవరూ చెప్పని చిట్కా.. 99 శాతం సక్సెస్..
-
Nadendla Manohar : డీజిల్ కొరతకు కారణం ఇదే.. రేపు ఉదయం కల్లా బంకులకు స్టాక్.. మంత్రి కీలక ప్రకటన..!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!