Union Nari Shakti Scheme: మహిళా పారిశ్రామికవేత్తలకు వెయ్యి కోట్లకు పైగా రుణాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Nari Shakti Scheme: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. యూనియన్ నారీ శక్తి పథకంలో భాగంగా మహిళా పారిశ్రామికవేత్తలకు వెయ్యి కోట్లకు పైగా రుణాలను మంజూరుచేసింది. దేశం మొత్తమ్మీద 10 వేల మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 2 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు లోన్లు ఇచ్చింది. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు మరియు వాళ్ల అవసరాలను బట్టి లోన్ అమౌంట్ను నిర్ణయిస్తున్నామని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ మినోచి చెప్పారు.
తగ్గిన ఎగుమతులు.. పెరిగిన దిగుమతులు..
Also Read
- ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
- RBI Report: తీవ్ర ద్రవ్యోల్బణంలో తెలంగాణ.. ఆర్బీఐ నివేదిక
- BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
- Nita Ambani: దేశంలోని అత్యంత శక్తివంతమైన మహిళగా నీతా అంబానీ.. ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో తొలి స్థానం
గత నెలలో ఇండియా ఎగుమతులు 3.52 శాతం తగ్గాయి. దీంతో ఎగుమతుల విలువ 32.62 బిలియన్ డాలర్లకే పరిమితమైంది. ఇదే సమయంలో దిగుమతులు 5.44 శాతం పెరిగాయి. మొత్తం దిగుమతుల విలువ 59.35 బిలియన్ డాలర్లుగా నమోదైంది. దిగుమతులు గతేడాది సెప్టెంబర్ నెలతో పోల్చితే దాదాపు 3 శాతం పెరిగాయి. గత ఏడు నెలల్లో దిగుమతులు 60 బిలియన్ల లోపుకే పరిమితం కావటం ఇదే తొలిసారి. ఈ డేటాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.
read also: Dubai: ముస్లిం దేశంలో హిందూ ఆలయం.. దసరా సందర్భంగా ప్రారంభం
పీఎన్బీ వాట్సాప్ సర్వీలు ప్రారంభం
పంజాబ్ నేషనల్ బ్యాంక్.. కస్టమర్లు మరియు నాన్-కస్టమర్ల కోసం వాట్సాప్ బ్యాంకింగ్ సర్వీస్ను ప్రారంభించింది. సెలవు రోజులు సహా రోజుకి 24 గంటలు ఈ సేవలు ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ బేస్డ్ మొబైల్ ఫోన్లలో అందుబాటులో ఉంటాయని పీఎన్బీ పేర్కొంది. బ్యాంక్ సేవలను మరింత మందికి చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ సర్వీస్ను లాంఛ్ చేసినట్లు తెలిపింది. వాట్సాప్ సర్వీస్ను వాడుకోవాలనుకునేవారు ముందుగా పీఎన్బీ వాట్సాప్ నంబర్ 92640 92640ను ఫోన్ బుక్లో సేవ్ చేసుకొని ఆ తర్వాత హాయ్ అని గానీ హలో అని గానీ టైప్ చేయటం ద్వారా కన్వర్జేషన్ స్టార్ట్ చేయాలని సూచించింది.
స్టాక్ మార్కెట్ అప్డేట్
దేశీయ స్టాక్ మార్కెట్లలో దసరా జోష్ కనిపిస్తోంది. ఇవాళ భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ‘బ్రిటన్ ట్యాక్స్’తో గ్లోబల్ మార్కెట్లలో సానుకూల సంకేతాలు నెలకొన్నాయి. సెన్సెక్స్ 1092 పాయింట్లు పెరిగి 57881 వద్ద ట్రేడింగ్ అవుతోంది. నిఫ్టీ 294 పాయింట్లు ప్లస్ అయి 17181కి పైనే కొనసాగుతోంది. ఇండస్ఇండ్ బ్యాంక్ షేరు విలువ 4 శాతం పెరిగింది.
తాజావార్తలు
-
Lenin: ఫ్యాన్స్ ను ఫిదా చేయబోతున్న తమన్.. ‘లెనిన్’ సక్సెస్ ఈవెంట్ లో కొత్త సాంగ్ రిలీజ్
-
Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
-
Virat Kohli: అందరి చూపు కోహ్లీ వైపే.. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో బద్దలు కొట్టగల రికార్డులు లిస్ట్ ఇదిగో.!
-
IND vs ENG 1st ODI: నేడు భారత్, ఇంగ్లండ్ మొదటి వన్డే.. మ్యాచ్ టైమింగ్స్లో మార్పు, లైవ్ స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!
-
Kiran Abbavaram : కిరణ్ అబ్బవరంపై తమిళ హీరోలు పగపట్టారా..?
ట్రెండింగ్
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!