Union Nari Shakti Scheme: మహిళా పారిశ్రామికవేత్తలకు వెయ్యి కోట్లకు పైగా రుణాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Nari Shakti Scheme: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. యూనియన్ నారీ శక్తి పథకంలో భాగంగా మహిళా పారిశ్రామికవేత్తలకు వెయ్యి కోట్లకు పైగా రుణాలను మంజూరుచేసింది. దేశం మొత్తమ్మీద 10 వేల మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 2 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు లోన్లు ఇచ్చింది. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు మరియు వాళ్ల అవసరాలను బట్టి లోన్ అమౌంట్ను నిర్ణయిస్తున్నామని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ మినోచి చెప్పారు.
తగ్గిన ఎగుమతులు.. పెరిగిన దిగుమతులు..
Also Read
- Tech Layoffs 2026: టెక్ రంగంలో కలకలం.. రెండు వారాల్లోనే 25,000 మందికి ఉద్వాసన..
- Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
- Adani Group: అదానీ వేల కోట్ల సామ్రాజ్యంలోకి మరొక కంపెనీ.. ఇకపై జీవీకే ఎనర్జీ అదానీ సొంతం!
- Akash Ambani: జియో సామ్రాజ్యానికి కొత్త బాస్.. అంబానీ వారసుడి చేతికి జియో ప్లాట్ఫామ్స్ పగ్గాలు!
గత నెలలో ఇండియా ఎగుమతులు 3.52 శాతం తగ్గాయి. దీంతో ఎగుమతుల విలువ 32.62 బిలియన్ డాలర్లకే పరిమితమైంది. ఇదే సమయంలో దిగుమతులు 5.44 శాతం పెరిగాయి. మొత్తం దిగుమతుల విలువ 59.35 బిలియన్ డాలర్లుగా నమోదైంది. దిగుమతులు గతేడాది సెప్టెంబర్ నెలతో పోల్చితే దాదాపు 3 శాతం పెరిగాయి. గత ఏడు నెలల్లో దిగుమతులు 60 బిలియన్ల లోపుకే పరిమితం కావటం ఇదే తొలిసారి. ఈ డేటాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.
read also: Dubai: ముస్లిం దేశంలో హిందూ ఆలయం.. దసరా సందర్భంగా ప్రారంభం
పీఎన్బీ వాట్సాప్ సర్వీలు ప్రారంభం
పంజాబ్ నేషనల్ బ్యాంక్.. కస్టమర్లు మరియు నాన్-కస్టమర్ల కోసం వాట్సాప్ బ్యాంకింగ్ సర్వీస్ను ప్రారంభించింది. సెలవు రోజులు సహా రోజుకి 24 గంటలు ఈ సేవలు ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ బేస్డ్ మొబైల్ ఫోన్లలో అందుబాటులో ఉంటాయని పీఎన్బీ పేర్కొంది. బ్యాంక్ సేవలను మరింత మందికి చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ సర్వీస్ను లాంఛ్ చేసినట్లు తెలిపింది. వాట్సాప్ సర్వీస్ను వాడుకోవాలనుకునేవారు ముందుగా పీఎన్బీ వాట్సాప్ నంబర్ 92640 92640ను ఫోన్ బుక్లో సేవ్ చేసుకొని ఆ తర్వాత హాయ్ అని గానీ హలో అని గానీ టైప్ చేయటం ద్వారా కన్వర్జేషన్ స్టార్ట్ చేయాలని సూచించింది.
స్టాక్ మార్కెట్ అప్డేట్
దేశీయ స్టాక్ మార్కెట్లలో దసరా జోష్ కనిపిస్తోంది. ఇవాళ భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ‘బ్రిటన్ ట్యాక్స్’తో గ్లోబల్ మార్కెట్లలో సానుకూల సంకేతాలు నెలకొన్నాయి. సెన్సెక్స్ 1092 పాయింట్లు పెరిగి 57881 వద్ద ట్రేడింగ్ అవుతోంది. నిఫ్టీ 294 పాయింట్లు ప్లస్ అయి 17181కి పైనే కొనసాగుతోంది. ఇండస్ఇండ్ బ్యాంక్ షేరు విలువ 4 శాతం పెరిగింది.
తాజావార్తలు
-
Tech Layoffs 2026: టెక్ రంగంలో కలకలం.. రెండు వారాల్లోనే 25,000 మందికి ఉద్వాసన..
-
Modi-CM Vijay: ప్రధాని మోడీకి సీఎం విజయ్ లేఖ.. దేనికోసమంటే..!
-
CM Revanth Reddy : నీట్-యూజీ 2026 రద్దు… మోడీ సర్కార్ ఫెయిల్
-
Gaurnaidu: ‘పెద్ది’ నుంచి ఊహించని ఊరమాస్ టీజర్.. ‘గౌర్నాయుడు’గా శివరాజ్కుమార్ విశ్వరూపం!
-
Siddaramaiah: “హిజాబ్”కు అనుమతి, “కాషాయ కండువాల”కు నో పర్మిషన్..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!