IT Returns Refund: ఇంకమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసి రీఫండ్ కోసం ఎదురుచూస్తున్నారా.. రెండు నెలలు దాటినా ఇంకా మీకు ఐటీఆర్ రీఫండ్ కాలేదా.. అయితే కొన్ని కారణాల వల్ల మీకు ఐటీఆర్ రీఫండ్ కాకపోవచ్చు. ఆ కారణాలేంటో ముందు తెలుసుకోవడం ముఖ్యం. అసలు ఐటీఆర్ రీఫండ్కు మీరు అర్హులేనా అన్న విషయం తెలుసుకోవాలి. అందుకోసం ఐటీఆర్ను ఆదాయపు పన్నుశాఖ ప్రాసెస్ చేసిందా లేదా చూడాలి. ఒకవేళ రీఫండ్కు మీరు అర్హులు అని ఐటీశాఖ ధ్రువీకరిస్తేనే…
Local Languages in Public Sector Banks: బ్యాంక్ ఉద్యోగులు స్థానిక భాషలను ఎందుకు నేర్చుకోలేకపోతున్నారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. లోకల్ లాంగ్వేజ్ల్లో మాట్లాడలేని సిబ్బందిని కస్టమర్ ఫేసింగ్ జాబుల్లో కూర్చోబెట్టొద్దని సూచించారు. సౌతిండియాలోని పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల ఉద్యోగులు ప్రజలను హిందీలో మాట్లాడాలని అడుగుతున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Huge Orders to Hyderabad Company: హైదరాబాద్లోని MTAR Technologies కంపెనీకి 540 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్లు వచ్చాయి. ఈ సంస్థ సివిలియన్ న్యూక్లియర్, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, స్పేస్, బాల్ స్క్రూలు మరియు రోలర్ స్క్రూలు, మెరైన్ తదితర సెగ్మెంట్లతోపాటు పర్యావరణ అనుకూల ఇంధన విభాగంలో సేవలందిస్తోంది. క్లీన్ ఎనర్జీకి సంబంధించి పెద్ద సంఖ్యలో కొత్త ఆర్డర్లు లభించటంతో రానున్న రోజుల్లో ఈ సెక్టార్లో విస్తృత అవకాశాలు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తోంది.
Reserve Bank Of India: నిత్యావసర ధరల పెంపుతో అల్లాడుతున్న సామన్యులపై మరో భారం పడే అవకాశం కనిపిస్తోంది. త్వరలో రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచుతుందని ప్రచారం జరుగుతోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కట్టడి చేసేందుకు ఆర్బీఐ ఈ చర్య తీసుకుంటుందని తెలుస్తోంది. ఈనెల 30న ఆర్బీఐ మానిటరింగ్ పాలసీ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రెపో రేట్లను ఆర్బీఐ పెంచనుంది. ఇప్పటికే గత రెండు సమీక్షల్లో వరుసగా వడ్డీరేట్లను ఆర్బీఐ పెంచింది. ఇదే జరిగితే…
Hyderabad Tops India: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మరోసారి సత్తా చాటింది. దేశంలోని టాప్-8 సిటీల్లో అగ్రస్థానంలో నిలిచింది. అది కూడా గ్రేడ్-ఎ కేటగిరీలో కావటం విశేషం. షామింగ్ మాల్స్లో లీజుకి ఇచ్చే విస్తీర్ణం(గ్రాస్ లీజబుల్ ఏరియా-జీఎల్ఏ)ను ప్రతిపదికగా తీసుకొని ఒక జాబితా రూపొందించారు. 5 లక్షలకు పైగా చదరపు అడుగుల జీఎల్ఏ కలిగిన షాపింగ్ మాల్స్, అవి ఉన్న నగరాలను గ్రేడ్-ఎలో చేర్చారు.
Rupee Strengthened: మన కరెన్సీ రూపాయి నిన్న ఒక్క రోజులోనే 38 పైసలు బలపడింది. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ సోమవారం 79. 53 వద్ద క్లోజ్ అవగా నిన్న మంగళవారం 79.15 వద్ద ముగిసింది. రూపాయి విలువ ఈ ఏడాది ఇప్పటివరకు 6.07 శాతం బలహీనపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జులై 27 తర్వాత అంటే దాదాపు 50 రోజుల అనంతరం ఒకే రోజు ఇంత ఎక్కువ విలువ పెరగటం ఇదే తొలిసారి.…
Cent Percent Work From Home: స్పెషల్ ఎకనమిక్ జోన్ యూనిట్లలో 100 శాతం ‘వర్క్ ఫ్రం హోం’ కావాలంటున్న ఇండస్ట్రీ డిమాండ్ను పరిశీలిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రతిపాదన వల్ల చిన్న సిటీల్లో ఉద్యోగావకాశాలను అందుబాటులోకి తెచ్చేందుకు వీలుపడుతుందని, సర్వీసుల ఎగుమతులు పెరుగుతాయని కూడా అంచనా వేస్తున్నట్లు తెలిపింది.
Infosys: ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఇన్ఫోసిస్ ఒకటి. అయితే ఇటీవల కరోనా కారణంగా పలు ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడంతో చాలా మంది ఉద్యోగులు పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తున్నట్లు బహిర్గతమైంది. దీంతో పలు కంపెనీలు చర్యలు చేపట్టాయి. ఇన్ఫోసిస్ కూడా రంగంలోకి దిగింది. కొద్దిరోజుల కిందట తమ ఉద్యోగులందరికీ మెయిల్స్ పంపించింది. ఎవరైనా పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కంపెనీ నియమాలను ఉల్లంఘించిన వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని…
Prepaid Card for Kamineni: కామినేని ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్ కోసం ప్రీపెయిడ్ వ్యాలెట్ బ్యాలెన్స్ కార్డును అందుబాటులోకి తెచ్చారు. ఈ మేరకు ఆఫర్డ్ ప్లాన్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ కార్డును ఉపయోగిస్తే క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది. మందుల పైన, మెడికల్ టెస్టుల పైన డిస్కౌంట్ ఇస్తారు. 10 వేల రూపాయలు మొదలుకొని 10 లక్షల రూపాయల వరకు మెడికల్ లోన్ కూడా అందిస్తారు.
Shock News to Samsung: శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ సంస్థకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి సంబంధిత ప్రోత్సాహక పథకం కింద ఇవ్వాల్సిన 900 కోట్ల రూపాయలను నిలిపేసింది. ఆ కంపెనీ జనరేట్ చేసిన ఇన్వాయిస్లలో కొన్ని లోటుపాట్లు బయటపడటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇంక్రిమెంటల్ ప్రొడక్షన్ మరియు సేల్స్కి సంబంధించి శామ్సంగ్ ఇచ్చిన డేటాకి, కేంద్ర ప్రభుత్వం సేకరించిన సమాచారానికి మధ్య వ్యత్యాసాలు ఉన్నట్లు తేలింది.