Shock News to Samsung: శామ్సంగ్కి కేంద్ర ప్రభుత్వం షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shock News to Samsung: శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ సంస్థకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి సంబంధిత ప్రోత్సాహక పథకం కింద ఇవ్వాల్సిన 900 కోట్ల రూపాయలను నిలిపేసింది. ఆ కంపెనీ జనరేట్ చేసిన ఇన్వాయిస్లలో కొన్ని లోటుపాట్లు బయటపడటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇంక్రిమెంటల్ ప్రొడక్షన్ మరియు సేల్స్కి సంబంధించి శామ్సంగ్ ఇచ్చిన డేటాకి, కేంద్ర ప్రభుత్వం సేకరించిన సమాచారానికి మధ్య వ్యత్యాసాలు ఉన్నట్లు తేలింది. ఈ పథకం కింద అర్హత సాధించిన ఏకైక సంస్థ శామ్సంగ్ తమకు 900 కోట్ల రూపాయలు వస్తాయని క్లెయిమ్ చేస్తుండగా అంత ఇవ్వాల్సిన పనిలేదని కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి.
నేడు, రేపు ఇ-వేలం
Also Read
- Gautam Adani: అదానీకి అమెరికా బిగ్ షాక్.. రూ.2200 కోట్ల లంచాల కేసులో అదానీపై యూఎస్ సెక్యూరిటీస్ సంస్థ నయా యాక్షన్!
- JioStar vs Zee: కోర్టుకెక్కిన బాలీవుడ్ సినిమాల వివాదం.. రూ.250 కోట్ల నష్టపరిహారం?
- Dollar vs Rupee: రక్తకన్నీరు పెట్టుకుంటున్న రూపాయి.. తొలిసారిగా రూ.96 మార్క్ను దాటిన డాలర్ విలువ!
- CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..
దేశంలోని 10 బొగ్గు గనుల వాణిజ్య తవ్వకాల కోసం సంబంధిత మంత్రిత్వ శాఖ ఇవాళ, రేపు ఇ-వేలం నిర్వహించనుంది. ఈ రోజు 8 బ్లాకులకు, రేపు 2 బ్లాకులకు ఆక్షన్ చేపట్టనుంది. ఈ మేరకు ఇప్పటికే బిడ్లు దాఖలు కాగా వాటి సాంకేతిక మదింపు పూర్తయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీంతో ఇ-వేలానికి రూట్ క్లియరైందని పేర్కొన్నాయి. బొగ్గు మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు 43 కోల్ మైన్స్లో ఏటా 85 మిలియన్ టన్నులకు పైగా బొగ్గు తవ్వకాలకు ఆక్షన్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ నిర్వహించే వేలంలో 39 మిలియన్ టన్నులకు పైగా బొగ్గు తవ్వకాల కోసం వివిధ సంస్థలు పోటీపడనున్నాయి.
Flash Back-2: ఫీల్ గుడ్ సినిమాలు.. ‘సూపర్ గుడ్’ ట్యాగ్లైన్లు..
హైదరాబాద్ స్టార్టప్కి గ్రాంట్
హెల్త్ కేర్ సెక్టార్లో సేవలందిస్తున్న హైదరాబాద్కి చెందిన ఆంకోఫినామిక్స్ లైఫ్ సైన్సెస్ అనే స్టార్టప్ 65 లక్షల రూపాయల స్పెషల్ గ్రాంట్కి సెలెక్ట్ అయింది. అటల్ ఇన్నోవేషన్ మిషన్, నీతి ఆయోగ్తోపాటు ఫైజర్ సంస్థ సంయుక్తంగా ఈ గ్రాంట్ను ఏర్పాటుచేశాయి. తొలి విడతలో ఆరోగ్య రంగానికి సంబంధించిన 6 స్టార్టప్లను ఎంపిక చేశారు. ఆయా సంస్థల డెవలప్మెంట్ కోసం ఫండ్స్, గైడెన్స్తోపాటు సాంకేతిక సహాయ సహకారాలను ఫైజర్ కంపెనీ అందించనుంది.
స్టాక్ మార్కెట్ అప్డేట్
వరుసగా రెండో రోజూ (ఇవాళ కూడా) స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. 409 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ప్రస్తుతం 60524 వద్ద ట్రేడింగ్ అవుతోంది. 101 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ 18038 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. హెచ్డీఎఫ్సీ లైఫ్, టీసీఎస్, జీ ఎంటర్టైన్మెంట్, ఓఎంసీస్, కోలిండియా తదితర సంస్థల షేర్లు ఆశాజనకంగా ఉన్నాయి. బజాజ్ ఫిన్సర్వ్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. స్టాక్స్ 6 శాతం ర్యాలీ తీశాయి. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ 79.49 వద్ద ఉంది.
తాజావార్తలు
-
Fraud: రూ.1700 కోట్ల నకిలీ జీఎస్టీ కుంభకోణం బట్టబయలు.. ప్రధాన సూత్రధారి అరెస్ట్..
-
Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
-
LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
-
Foreign Travels: విదేశీ టూర్లపై భారీగా ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధం! కేంద్రం ప్లాన్ ఇదేనా?
-
NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!