Kakatiya Mega Textile Park: చేనేత కార్మికుల ఆరేళ్ల కల.. నెరవేరిన వేళ. కాకతీయ టెక్స్టైల్ పార్క్ త్వరలో ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakatiya Mega Textile Park: కాకతీయ వీవర్స్ కోపరేటివ్ సొసైటీ ఆరేళ్ల కల ఎట్టకేలకు నెరవేరింది. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో చీరల తయారీ ప్రారంభమైంది. ఈ పార్క్ను చేనేత మరియు జౌళి శాఖ మంత్రి కేటీఆర్ అధికారికంగా ప్రారంభించాల్సి ఉంది. హన్మకొండ జిల్లా మడికొండ గ్రామంలోని ఔటర్ రింగ్ రోడ్డులో ఈ పార్క్ను 60 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. అక్కడ 364కి పైగా పవర్ లూమ్ యూనిట్లు ఉన్నాయి. ఈ పార్క్ ద్వారా 5 వేల మంది ప్రత్యక్షంగా మరో 4 వేల మంది పరోక్షంగా ఉపాధి పొందనున్నారు.
ఓఎన్జీసీ భారీ పెట్టుబడి
Also Read
- CM Revanth Reddy : కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్, బీజేపీ కుట్రలను తిప్పికొడతాం
- Ashwini Vaishnaw: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. మూడు బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటన
- Vietnam Boat Accident: వియత్నాం బోటు ప్రమాదం.. తెలంగాణ అలర్ట్.!
- Shabad Six Murder Case : షాబాద్ ఆరుగురి హత్య కేసు.. సీఐ క్రాంతి రెడ్డిపై సస్పెన్షన్ వేటు
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్.. సహజ వాయు నిక్షేపాల వెలికితీత కోసం తాజాగా ఆరు ఒప్పందాలను కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల్లో భాగంగా ఆరు బ్లాకుల్లో 15 వేల 77 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. డిస్కవర్డ్ స్మాల్ ఫీల్డ్స్ ఆఫ్షోర్ మూడో దశ బిడ్ రౌండ్లో ఈ ఒప్పందాలపై సంతకాలు చేసింది. ఇందులో నాలుగు కాంట్రాక్టులను సొంతగా, రెండు కాంట్రాక్టులను ఇతర సంస్థలతో కలిసి కుదుర్చుకుంది. అరేబియా మహా సముద్రంలోని మూడు బ్లాకులతోపాటు బంగాళాఖాతంలోని మూడు బ్లాకుల్లో వెలికితీత చేపట్టనుంది.
Shepherd Donates Land: ఊరి దాహం తీర్చేందుకు గొర్రెల కాపరి భూరి విరాళం
రూ.5600 కోట్ల ఎఫ్పీఐలు
ఫారన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటికి ఇండియన్ ఈక్విటీల్లో దాదాపు 5 వేల 600 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లతో పోల్చితే మన దేశంలో బెటర్ మ్యాక్రో ఫండమెంటల్స్ ఉండటం దీనికి ఒక కారణం. పండగ సీజన్ నేపథ్యంలో వినియోగదారుల వ్యయం పెరుగుతుందనే అంచనాలు నెలకొనటం మరో కారణం. ఆగస్టు నెలలో అనూహ్యంగా 51 వేల 200 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చిన సంగతి తెలిసిందే. అంతకుముందు జులై నెలలో కూడా సుమారు 5 వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి.
స్టాక్ మార్కెట్ అప్డేట్
ఈవారం స్టాక్ మార్కెట్లు శుభారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఇవాళ లాభాలతో మొదలయ్యాయి. గతవారం చివరి వర్కింగ్ డే అయిన శుక్రవారం సెన్సెక్స్ 60 వేల మార్క్ను దాటగా శనివారం, ఆదివారం సెలవు అనంతరం వరుసగా రెండో రోజు (అంటే ఇవాళ) కూడా 60 వేల మార్క్ క్రాస్ కావటం విశేషం. సెన్సెక్స్ ప్రస్తుతం 444 పాయింట్లు పెరిగి 60237 వద్ద ఉన్న ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 125 పాయింట్లు లాభపడి 17959 వద్ద కొనసాగుతోంది. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ 79.59 వద్ద స్థిరంగా ఉంది.
తాజావార్తలు
-
Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
-
CM Chandrababu : వియత్నాం బోటు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం
-
Bankra mosque: కోల్కతా ఎయిర్పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
-
VBSA Bill: పార్లమెంట్లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
-
S Janaki: మన తెలుగు గర్వం ఎస్. జానకి.. గుంటూరు నుంచి భారత సంగీత గగనానికి ఎదిగిన గానకోకిల
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!