Infosys: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ హెచ్చరిక.. అలా చేస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తాం..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Infosys: ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఇన్ఫోసిస్ ఒకటి. అయితే ఇటీవల కరోనా కారణంగా పలు ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడంతో చాలా మంది ఉద్యోగులు పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తున్నట్లు బహిర్గతమైంది. దీంతో పలు కంపెనీలు చర్యలు చేపట్టాయి. ఇన్ఫోసిస్ కూడా రంగంలోకి దిగింది. కొద్దిరోజుల కిందట తమ ఉద్యోగులందరికీ మెయిల్స్ పంపించింది. ఎవరైనా పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కంపెనీ నియమాలను ఉల్లంఘించిన వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని స్పష్టం చేసింది. డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ (ద్వంద్వ ఉపాధి) అనేది కంపెనీ ఉత్పాదకతపై తీవ్ర ప్రభావం చూపుతోందని.. డేటా లీక్, రహస్య సమాచారం లీకేజీ, ఉద్యోగుల పనితీరు వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది.
Read Also:Girls New Strategy: 50 ఏళ్లు పైబడిన వ్యక్తితో ఎఫైర్.. బాగా సుఖపెడితేనే పెళ్లి..!!
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
ఆఫర్ లెటర్లో స్పష్టంగా పేర్కొన్నట్లు తమ సమ్మతి లేకుండా ఏదైనా ఇతర సంస్థ కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నా.. ఏదైనా ఇతర సంస్థలో పార్ట్టైమ్ లేదా భాగస్వామిగా ఉన్నా నేరమని ఇన్ఫోసిస్ యాజమాన్యం స్పష్టం చేసింది. మరోవైపు ఇదే అంశంపై విప్రో అధినేత ప్రేమ్ జీ కొన్ని రోజుల క్రితం స్పందించారు. ఒకే సమయంలో రెండు ఉద్యోగాలు చేయడం సరికాదని… ఈ పద్ధతి మోసం అని ఆయన పేర్కొన్నారు. కరోనా మహమ్మారి సమయంలో ఉద్యోగులు మారుమూల ప్రాంతాల నుండి పని చేయడానికి అనేక ఐటీ సంస్థలు అనుమతించాయి. ప్రత్యేకించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో తమ ఉద్యోగులు ఇతరుల కోసం ప్రాజెక్ట్లపై ఏకకాలంలో పని చేయడానికి రిమోట్ వర్కింగ్ సదుపాయాన్ని ఉపయోగించారు. ఇదే అదనుగా పలువురు ఉద్యోగులు ఇతర సంస్థల్లో పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తూ సంపాదిస్తున్నట్లు కంపెనీల దృష్టికి రావడంతో తాజాగా చర్యలు చేపడుతున్నాయి.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!