Home
Business News
Business News News
-
Diwali Gold Sales: పండుగ చేసుకుంటున్న బంగారం వ్యాపారులు
Diwali Gold Sales: ఈ ఏడాది దీపావళి పండుగ.. బంగారం వ్యాపారానికి బాగా కలిసొచ్చింది. మన దేశంలో మొన్న, నిన్న రెండు రోజులు పాతిక వేల కోట్ల రూపాయల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. గతేడాది ధన త్రయోదశితో పోల్చితే ఈసారి బంగారం, వెండి ఆభరణాల విక్రయాలు 35 శాతం అధికంగా నమోదైనట్లు అంచనా వేస్తున్నారు. పోయిన సంవత్సరం ఇదే సమయంలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 47 వేల 644 రూపాయలు ఉండగా ఈ సంవత్సరం… -
Laurus Labs Paediatric HIV Treatment: పిల్లల్లో హెచ్ఐవీ చికిత్సకు లారస్ ల్యాబ్స్ Novel Delivery
Laurus Labs Paediatric HIV treatment: హైదరాబాద్కి చెందిన లారస్ ల్యాబ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్తో ముగిసిన రెండో త్రైమాసికం ఫలితాలను వెల్లడించింది. జులై, ఆగస్టు, సెప్టెంబర్.. ఈ మూడు నెలల్లో కలిపి 234 కోట్ల రూపాయల లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో ఈ సంస్థ లాభం 204 కోట్లు మాత్రమే కావటం గమనించాల్సిన విషయం. దీన్నిబట్టి ఈసారి నికరంగా 15 శాతం ఎక్కువ ప్రాఫిట్ను ఆర్జించింది. -
Hyderabad Weapon Systems: రాఫెల్ యుద్ధ విమానాలకు ‘‘హైదరాబాద్’’ అస్త్రాలు
Hyderabad Weapon Systems: రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించి జాతీయ రాజకీయాల్లో ఎంత రచ్చ జరిగిందో దేశం మొత్తం చూసింది. ఈ అంశంపై అధికార పార్టీ బీజేపీ, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పలుమార్లు నువ్వా నేనా అన్నంత స్థాయిలో తలపడ్డాయి. పార్లమెంట్ లోపల, బయట పొలిటికల్ హీట్ పెరిగింది. మొత్తమ్మీద ఈ వివాదం ఎలాగోలా సద్దుమణిగింది. అయితే.. ఇప్పుడు ఆ రాఫెల్ యుద్ధ విమానాల్లో మేడిన్ హైదరాబాద్ అస్త్రాలను అమర్చనున్నారు. -
Jio 5G: శ్రీనాథ్జీ ఆలయం.. జియో 5జీ ఆరంభం.. ఏమిటీ అనుబంధం?
Jio 5G: రిలయెన్స్ జియో చైర్మన్ ఆకాష్ అంబానీ ఇవాళ రాజస్థాన్లో జియో 5జీ బీటా సర్వీసులను ప్రారంభించారు. రాజ్సమంద్లోని నాథద్వారాలో ఉన్న ప్రసిద్ధ శ్రీనాథ్జీ ఆలయం వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంబానీలకు ఈ దేవుడి పైన అపార నమ్మకం ఉంది. శ్రీనాథ్జీని తమ కుటుంబ దైవంగా కొలుస్తారు. గతంలో రిలయెన్స్ జియో 4జీ సర్వీసులను సైతం ఇక్కడే ప్రారంభించటం విశేషం. -
Rupee Trade: రూపాయల్లో ట్రేడింగ్కి రెస్పాన్స్ బ్రహ్మాండం
Rupee Trade: రూపాయల్లో ట్రేడింగ్ జరిపేందుకు ప్రపంచ దేశాల నుంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చినట్లు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రబి శంకర్ వెల్లడించారు. వాణిజ్య చెల్లింపుల నిమిత్తం దేశీయ కరెన్సీలను ఉపయోగించే పథకం కోసం ఆసియన్ క్లియరింగ్ యూనియన్ అన్వేషిస్తోందని తెలిపారు. ద్వైపాక్షికంగా లేదా వివిధ ట్రేడింగ్ బ్లాకుల మధ్య ఇలాంటి ఒక ప్రత్యేకమైన ఏర్పాటు ఉంటే ప్రతి దేశానికి చెందిన దిగుమతిదారులు డొమెస్టిక్ కరెన్సీలో పేమెంట్లు చేసేందుకు వీలుపడుతుందని చెప్పారు. -
Infosys: ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఉద్యోగులు గిగ్ జాబ్స్ చేసుకునేందుకు అనుమతి
Infosys: ఐటీ కంపెనీలకు సంబంధించి ఇటీవల మూన్ లైటింగ్ హాట్టాపిక్గా మారింది. మూన్ లైటింగ్ అంటే ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఆ కంపెనీకి తెలియకుండా మరో కంపెనీలో కూడా పనిచేస్తుండటం. మూన్ లైటింగ్ వ్యవహారంపై ఇటీవల టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు సీరియస్ అయ్యాయి. నిబంధనలను ఉల్లంఘించిన పలువురు ఉద్యోగులను తొలగిస్తామని హెచ్చరికలు కూడా జారీ చేశాయి. తాజాగా ఇన్ఫోసిస్ కంపెనీ తన ఉద్యోగులకు ఓ ఆఫర్ ఇచ్చింది. తమ ఉద్యోగులు కావాలనుకుంటే గిగ్… -
World’s First Licensing Deal: ప్రజల కోసం ‘నోవార్టిస్’ పెద్ద మనసు. ప్రపంచంలోనే తొలి లైసెన్సింగ్ డీల్
World's First Licensing Deal: అధిక ధర కలిగిన క్యాన్సర్ మందు తయారీ కోసం నోవార్టిస్ సంస్థ ప్రపంచంలోనే మొట్టమొదటి లైసెన్సింగ్ డీల్పై సంతకం చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా దీర్ఘకాలిక మైలోయిడ్ లుకేమియా ట్రీట్మెంట్లో వాడే ఓరల్ డ్రగ్ నిలోటినిబ్ను రూపొందించనున్నారు. ఈ ఔషధాన్ని ఈజిప్ట్, గ్వాటెమాల, ఇండోనేషియా, మొరాకో, పాకిస్థాన్, ది ఫిలిప్పీన్స్, ట్యునీషియా వంటి ఏడు మధ్య ఆదాయ దేశాల్లో జనరిక్ డ్రగ్మేకర్స్ తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకురానున్నారు. -
Shiv Nadar: శివ్ నాడార్.. మేటి దాత.. అరుదైన ఘనత..
Shiv Nadar: ప్రముఖ ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ ఫౌండర్ శివ్ నాడార్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. సగటున రోజుకి 3 కోట్ల రూపాయలకు పైగా దానమిచ్చి మన దేశంలో అత్యధిక సంపదను పంచిపెట్టినవారి లిస్టులో టాప్లో నిలిచారు. ఏడాది కాలంలో ఏకంగా రూ.1,161 కోట్లు డొనేట్ చేశారు. తద్వారా తాజాగా విడుదలైన ‘‘ఎడెల్గివ్ హురున్ ఇండియా ఫిలాంథ్రపీ లిస్ట్-2022’’లో అగ్రస్థానాన్ని ఆక్రమించారు. -
Indian Market: ఇండియన్ మార్కెట్.. ఇంపార్టెంట్. ఈ మాటన్నది ఏ దేశం?
Indian Market: ఇండియన్ మార్కెట్ తమకెంతో ముఖ్యమని టర్కిష్ ఎయిర్లైన్స్ సీఈఓ బిలాల్ ఎక్సి అన్నారు. టర్కిష్ ఎయిర్లైన్స్ ప్రపంచంలోనే లార్జెస్ట్ నెట్వర్క్ క్యారియర్ అయినప్పటికీ మన దేశంలో ఆ సంస్థ అభివృద్ధికి ప్రతిబంధకాలు ఉన్నాయి. టర్కిష్ ఎయిర్లైన్స్కి ఇండియాలో ట్రాఫిక్ రైట్స్ని పరిమితంగా ఇవ్వటమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో నంబర్ వన్ ఎయిర్లైన్స్ ఇండిగోతో భాగస్వామ్యాన్ని బలపరచుకోవటం ద్వారా ఇండియన్ మార్కెట్లో షేర్ (బిజినెస్) పెంచుకోవాలని టర్కిష్ ఎయిర్లైన్స్ ఆశిస్తోంది. -
Business Today: Today Business Headlines 20-10-22
Business Today: సాగర్ సిమెంట్స్ ఆదాయం పెరిగింది. కానీ..: సాగర్ సిమెంట్స్ ఆదాయం గతేడాది 2వ త్రైమాసికంతో పోల్చితే ఈసారి 32 శాతం పెరిగింది. పోయినేడాది 371 కోట్ల రూపాయలు మాత్రమే రెవెన్యూ రాగా ఇప్పుడది 489 కోట్ల రూపాయలకు పెరిగింది. నిరుడు 20 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించిన సాగర్ సిమెంట్స్ ప్రస్తుతం అంతకు రెట్టింపు కన్నా ఎక్కువ.. అంటే 49 కోట్ల రూపాయల నికర నష్టాన్ని నమోదుచేసింది.
తాజావార్తలు
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
-
OTR: ప్రతిపక్షం ట్రాప్లో పడుతున్నామని కాంగ్రెస్ పార్టీలో చర్చ
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
-
OTR : అనంతపురం జిల్లా వైసీపీలో తోపుదుర్తి ఒంటరి అయ్యారా?
-
Mamata Banerjee: ‘‘నన్ను ఆపాలంటే చంపాలి’’.. మమతా దీదీ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!