IKEA India New Idea: మా ఇంటికి వచ్చి వెళ్లండి అంటూ సాదరంగా ఆహ్వానిస్తున్న ఐకియా ఇండియా. ఇదో కొత్త ఐడియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IKEA India New Idea: ఐకియా ఇండియా సరికొత్త ఐడియాను అమలుచేస్తోంది. ‘‘ఒకసారి మా ఇంటికి వచ్చి వెళ్లండి’’ అంటూ వినూత్న ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తద్వారా మా స్టోర్కి రండి అని సాదరంగా ఆహ్వానిస్తోంది. రెడీమేడ్ ఫర్నీచర్ను విక్రయించే ఈ సంస్థ ‘ఘర్ ఆ జావో’ పేరుతో కొత్త బ్రాండ్ పొజిషనింగ్ని ప్రారంభించినట్లు వెల్లడించింది. వినియోగదారులతో భావోద్వేగపూరితమైన మరియు హేతుబద్ధమైన అనుబంధాన్ని ఏర్పరచుకునేందుకు ఈ క్యాంపెయిన్ని వివిధ ప్రచార మాధ్యమాల్లో చేపడతామని తెలిపింది. బంధుమిత్రులను భోజనానికి పిలవటానికి సహజంగా అందరూ ‘వీలైతే మీరు ఒకసారి మా ఇంటికి వచ్చి వెళ్లండి’ అని అంటుంటారు. భారతీయ సంప్రదాయాల్లో ఇదొక అలవాటు. దీనికి అనుగుణంగా ఈ బ్రాండ్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు ఐకియా ఇండియా పేర్కొంది.
బియ్యం ఎగుమతులపై ఆంక్షలు
Also Read
- Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
- Crude Oil Price Today: బ్యారెల్కు 100 డాలర్లకు చేరువలో ముడి చమురు.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం ఎంత?
- MS Dhoni: ఎంఎస్ ధోనీ కొత్త బిజినెస్కు బంపర్ బూస్ట్.. కోట్లలో నిధులు సమీకరణ!
- Gold and Silver Price: ఆషాడంలో కూడా తగ్గట్లేవుగా బంగారం.. భారీగా పెరిగిన ధరలు
దేశీయంగా బియ్యం సరఫరాను పెంచేందుకు, తద్వారా ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. విదేశాలకు చేస్తున్న బియ్యం ఎగుమతులపై పరిమితులు పెట్టింది. కొన్ని రకాల బియ్యంపై నిషేధం, మరికొన్ని గ్రేడ్లపై 20 శాతం పన్ను విధించింది. దీంతో సామాన్యులకు ఊరట లభించనుంది. ఇండియా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా దేశాలకు బియ్యం ఎగుమతులు చేస్తోంది. ఇప్పుడు ఈ షిప్మెంట్ల సంఖ్యను కుదిస్తే ఆయా దేశాలకు రైస్ సప్లై తగ్గి రేట్లు పెరిగే అవకాశం ఉంది.
Special Story on Vinayaka Nimajjanam: వినాయక విగ్రహాలకే కాదు.. వివిధ వివక్షలకూ నిమజ్జనం..
రైల్వేలకు రూ.30 వేల కోట్లు!
రైల్వే మంత్రిత్వ శాఖ నూతన ఆదాయ వనరును గుర్తించింది. కొత్త ల్యాండ్ లైసెన్సింగ్ రుసుముల విధానం ద్వారా రానున్న ఐదేళ్లలో 30 వేల కోట్ల రూపాయల రెవెన్యూని ఆర్జించాలని ఆశిస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న పాలసీ ప్రకారం లీజుకు తీసుకున్న భూముల్లో చాలా వరకు టెర్మినల్ కార్యకలాపాలకు అవకాశం ఉన్నప్పటికీ పనికిరాకుండా పోతున్నాయని అభిప్రాయపడుతోంది. అయితే ఈ సవరించిన విధానం వల్ల కంటైనర్ కార్పొరేషన్పై ప్రతికూల ప్రభావం పడుతుందని అనలిస్టులు అంటున్నారు. జూన్ క్వార్టర్ రన్ రేట్ ప్రకారం కంటైనర్ కార్పొరేషన్ ఆదాయం 910 కోట్లు కాగా ల్యాండ్ లైనెన్స్ ఫీజు అందులో 40 శాతమేనని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Paper Leaks: పంజాబ్లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
-
CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
-
CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
-
Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
-
Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?