IKEA India New Idea: మా ఇంటికి వచ్చి వెళ్లండి అంటూ సాదరంగా ఆహ్వానిస్తున్న ఐకియా ఇండియా. ఇదో కొత్త ఐడియా
IKEA India New Idea: ఐకియా ఇండియా సరికొత్త ఐడియాను అమలుచేస్తోంది. ‘‘ఒకసారి మా ఇంటికి వచ్చి వెళ్లండి’’ అంటూ వినూత్న ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తద్వారా మా స్టోర్కి రండి అని సాదరంగా ఆహ్వానిస్తోంది. రెడీమేడ్ ఫర్నీచర్ను విక్రయించే ఈ సంస్థ ‘ఘర్ ఆ జావో’ పేరుతో కొత్త బ్రాండ్ పొజిషనింగ్ని ప్రారంభించినట్లు వెల్లడించింది. వినియోగదారులతో భావోద్వేగపూరితమైన మరియు హేతుబద్ధమైన అనుబంధాన్ని ఏర్పరచుకునేందుకు ఈ క్యాంపెయిన్ని వివిధ ప్రచార మాధ్యమాల్లో చేపడతామని తెలిపింది. బంధుమిత్రులను భోజనానికి పిలవటానికి సహజంగా అందరూ ‘వీలైతే మీరు ఒకసారి మా ఇంటికి వచ్చి వెళ్లండి’ అని అంటుంటారు. భారతీయ సంప్రదాయాల్లో ఇదొక అలవాటు. దీనికి అనుగుణంగా ఈ బ్రాండ్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు ఐకియా ఇండియా పేర్కొంది.
బియ్యం ఎగుమతులపై ఆంక్షలు
Also Read
- Jio Rs 209 Plan: జియో యూజర్స్కు షాక్.. ఆ పాపులర్ రీఛార్జ్ ప్లాన్ ఇక బంద్! కారణం ఇదేనా?
- Central Govt: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. బీమా రంగంలోనే సంచలనం..
- Cooking Oil Price: సామాన్యుడికి మరో బిగ్ షాక్.. భారీగా పెరిగిన వంట నూనె ధరలు..
- Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’
దేశీయంగా బియ్యం సరఫరాను పెంచేందుకు, తద్వారా ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. విదేశాలకు చేస్తున్న బియ్యం ఎగుమతులపై పరిమితులు పెట్టింది. కొన్ని రకాల బియ్యంపై నిషేధం, మరికొన్ని గ్రేడ్లపై 20 శాతం పన్ను విధించింది. దీంతో సామాన్యులకు ఊరట లభించనుంది. ఇండియా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా దేశాలకు బియ్యం ఎగుమతులు చేస్తోంది. ఇప్పుడు ఈ షిప్మెంట్ల సంఖ్యను కుదిస్తే ఆయా దేశాలకు రైస్ సప్లై తగ్గి రేట్లు పెరిగే అవకాశం ఉంది.
Special Story on Vinayaka Nimajjanam: వినాయక విగ్రహాలకే కాదు.. వివిధ వివక్షలకూ నిమజ్జనం..
రైల్వేలకు రూ.30 వేల కోట్లు!
రైల్వే మంత్రిత్వ శాఖ నూతన ఆదాయ వనరును గుర్తించింది. కొత్త ల్యాండ్ లైసెన్సింగ్ రుసుముల విధానం ద్వారా రానున్న ఐదేళ్లలో 30 వేల కోట్ల రూపాయల రెవెన్యూని ఆర్జించాలని ఆశిస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న పాలసీ ప్రకారం లీజుకు తీసుకున్న భూముల్లో చాలా వరకు టెర్మినల్ కార్యకలాపాలకు అవకాశం ఉన్నప్పటికీ పనికిరాకుండా పోతున్నాయని అభిప్రాయపడుతోంది. అయితే ఈ సవరించిన విధానం వల్ల కంటైనర్ కార్పొరేషన్పై ప్రతికూల ప్రభావం పడుతుందని అనలిస్టులు అంటున్నారు. జూన్ క్వార్టర్ రన్ రేట్ ప్రకారం కంటైనర్ కార్పొరేషన్ ఆదాయం 910 కోట్లు కాగా ల్యాండ్ లైనెన్స్ ఫీజు అందులో 40 శాతమేనని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
-
Ragi Teepi Kudumulu: అమ్మమ్మల కాలం నాటి టేస్టీ రెసిపీ.. హెల్తీ ‘రాగి తీపి కుడుములు’ ఇలా ట్రై చేయండి!
-
GT VS PBKS: గుజరాత్ బౌలర్ల ధాటికి పంజాబ్ విలవిల.. తక్కువ స్కోర్కే పరిమితమైన PBKS..
-
Karimnagar PMJ Jewellery : పీఎంజే జ్యువెల్లరీ దొంగల ఫోటోలు విడుదల.. ఆచూకీ చెబితే లక్ష నజరానా.!
-
Rishab Pant: రిషబ్ పంత్ ఆట ముగిసిందా..? లక్నో కెప్టెన్ ఫామ్పై బౌలింగ్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!