Funds for Bhanzu: ‘ప్రపంచంలోనే ఫాస్ట్ హ్యూమన్ క్యాలికులేటర్’ భాను సంస్థకి రూ.115 కోట్ల ఫండ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Funds for Bhanzu: హైదరాబాద్కి చెందిన ఇంటర్నేషనల్ మ్యాథ్స్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ భాన్జుకి 115 కోట్ల రూపాయల నిధులు సమకూరాయి. ప్రపంచంలోనే ఫాస్ట్గా లెక్కలు చేసే హ్యూమన్ క్యాలిక్యులేటర్ నీలకంఠ భాను ఈ సంస్థను తన పేరిటే భాన్జుగా ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. టెక్నాలజీకి సంబంధించిన మౌలిక సదుపాయాలను మరియు మ్యాథ్స్ కరికులమ్లను ఇంకా డెవలప్ చేసేందుకు ఈ ఫండ్స్ను వినియోగిస్తామని సంస్థ సీఈఓగా కూడా వ్యవహరిస్తున్న నీలకంఠ భాను తెలిపారు. తాజా నిధులతో భాన్జు సేవలు మరింత విస్తరించనున్నాయని నిపుణులు భావిస్తున్నారు.
‘వాట్సాప్’కి గుడ్బై
Also Read
- WhatsApp Username Feature: వాట్సాప్ కొత్త ఫీచర్పై సందేహాలన్నింటికీ చెక్.. మెటా కీలక ప్రకటన
- Microsoft Layoffs: ఐటీ ఉద్యోగులకు మళ్లీ బ్యాడ్ న్యూస్.. మైక్రోసాఫ్ట్లో 5,000 మంది అవుట్! ఎవరెవరి ఉద్యోగాలు ఊడనున్నాయంటే?
- GST Collection June 2026: జూన్లో జీఎస్టీ వసూళ్ల జోరు.. రూ.1.95 లక్షల కోట్లకు చేరిన ఆదాయం
- Small Savings Schemes: స్మాల్ సేవింగ్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసేవారికి గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లను ప్రకటించిన కేంద్రం
వాట్సాప్ పేమెంట్ ఇండియా హెడ్ పదవి నుంచి మనేష్ మహాత్మే తప్పుకున్నారు. ఆయన మళ్లీ అమేజాన్ పే ఇండియాకే వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మనేష్ మహాత్మే వాట్సాప్ పేమెంట్ ఇండియాలో 18 నెలల పాటు ఉన్నారు. అంతకుముందు అమేజాన్ పే ఇండియాలో డైరెక్టర్గా మరియు బోర్డ్ మెంబర్గా దాదాపు ఏడేళ్లు వ్యవహరించారు. మనేష్ మహాత్మే వైదొలిగిన విషయాన్ని వాట్సాప్ పేమెంట్ ఇండియా ధ్రువీకరించింది. ఇండియాలో వాట్సాప్ పేమెంట్లు పెరగటంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారని పేర్కొంది.
చైనా కన్నా ఇండియా బెటర్
విస్తరణ నిమిత్తం సిటీ గ్రూపు ఇండియాని హైప్రయారిటీ మార్కెట్గా భావిస్తోంది. చైనాతోపాటు ఇతర ప్రాంతాల్లో రిస్క్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయానికొచ్చింది. ఇండియాలో వచ్చే ఏడాది ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ పెరుగుతాయని అంచనా వేస్తోంది. దీంతోపాటు రెనివబుల్ ఎనర్జీ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో ఇన్బౌండ్ డీల్స్ కూడా అధికంగా నమోదవుతాయని ఆశిస్తోంది. మేజర్ గ్లోబల్ మార్కెట్లతో పోల్చితే మన దేశంలో ఈ ఏడాది స్టాక్ మార్కెట్ మంచి పనితీరు కనబరిచిందని సిటీ గ్రూప్ పేర్కొంది.
స్టాక్ మార్కెట్ అప్డేట్
ఇండియన్ స్టాక్ మార్కెట్లు ఇవాళ వరుసగా 3వ రోజూ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 566 పాయింట్లు కోల్పోయి 58552 వద్ద ట్రేడింగ్ అవుతోంది. నిఫ్టీ 169 పాయింట్లు నష్టపోయి 17460 పైన కొనసాగుతోంది. ఫోర్టిస్, మెక్లియోడ్, హీరో, బాంబే డయింగ్ స్టాక్స్ ఆశాజనకంగా ఉన్నాయి. టాటా స్టీల్ 4 శాతం ర్యాలీ చేస్తోంది. టాటా స్టీల్ అనుబంధ సంస్థల షేర్లు 9 శాతం పడిపోయాయి. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ 79.62 వద్ద కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Hardik Pandya-CSK: సీఎస్కేలోకి హార్దిక్ పాండ్యా.. క్లారిటీ ఇచ్చిన చెన్నై సీఈఓ!
-
Best Crime Thriller Movies: కేతన్ అగర్వాల్ కేసును గుర్తు చేసే థ్రిల్లర్లు.. ఈ సినిమాల ట్విస్టులు చూస్తే షాక్ అవుతారు!
-
Jananayagan Censor : జననాయగన్ కు సెన్సార్ షాక్
-
WhatsApp Username Feature: వాట్సాప్ కొత్త ఫీచర్పై సందేహాలన్నింటికీ చెక్.. మెటా కీలక ప్రకటన
-
Daycare Abuse: మీకు మనసెలా వచ్చిందమ్మా.. టాయిలెట్ జెట్తో నీళ్లు చల్లి, వాషింగ్ మెషీన్లో బంధించి చిన్నారిపై చిత్రహింసలు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?