UPI Lite: పిన్, మొబైల్ డేటా లేకున్నా ‘లైట్’ తీసుకోండి. యూపీఐ పేమెంట్ చేసేయండి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UPI Lite: యూపీఐ పేమెంట్లు చెయ్యాలంటే మొబైల్లో డేటా ఉండాలి. దీంతోపాటు పిన్ కూడా తెలిసుండాలి. కానీ.. ఈ రెండూ లేకపోయినా పేమెంట్ చేసేందుకు లేటెస్ట్గా ‘యూపీఐ లైట్’ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. దీన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ రీసెంట్గా ప్రారంభించారు. యూపీఐ లైట్ ద్వారా గరిష్టంగా 200 రూపాయలు చెల్లించొచ్చు. ముందుగా బ్యాంక్ అకౌంట్ నుంచి యూపీఐ లైట్ వ్యాలెట్లోకి అమౌంట్ను డిపాజిట్ చేసుకోవాలి. ఈ బ్యాలెన్స్ 2 వేల రూపాయలకు మించకూడదు. ఇదొక ఆన్డివైజ్ వ్యాలెట్ కాబట్టి దీని నుంచి పేమెంట్ చేసేటప్పుడు ఇంటర్నెట్ ఉండాల్సిన పనిలేదు. ఇప్పటికే యూపీఐ పేమెంట్ ట్రాన్సాక్షన్ల సంఖ్య రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. ఇప్పుడు యూపీఐ లైట్ కూడా అందుబాటులోకి రావటంతో ఈ లావాదేవీలు సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టనున్నాయి.
తెలంగాణకు రూ.9494 కోట్లు: కిషన్రెడ్డి
Also Read
- Gold and Silver Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. భారీగా దిగివచ్చిన వెండి.. నేటి రేట్లు ఇవే
- Sugar Price Hike: కొండెక్కుతున్న చక్కెర ధరలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- LPG e-KYC చివరి తేదీ దాటింది.. ఇక సిలిండర్ రాదా? అసలు నిజం ఇదే!
- Bank Strike Alert: బ్యాంక్ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. ఆరోజున దేశవ్యాప్త సమ్మె.. కీలక వివరాలు ఇవే
తెలంగాణలో గత ఎనిమిదేళ్లలో 12 కొత్త మేజర్ రైల్వే ప్రాజెక్టుల కోసం దాదాపు 9494 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు. వరంగల్లో 400 కోట్ల రూపాయలతో రైల్వే కోచ్ యూనిట్ని ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోందని చెప్పారు. ఈ ఫెసిలిటీ వల్ల 3 వేల మందికి ఉపాధి దొరుకుతుందని తెలిపారు. రైల్వేలు చేపడుతున్న భద్రతా చర్యలతో ఏటా ప్రమాదాల సంఖ్య తగ్గుతోందని పేర్కొన్నారు.
read also: Behind Story of Big Bazaar’s Downfall: బిగ్ బజార్ తెర(మరుగు) వెనక ఏం జరిగింది?
బ్లాక్స్టోన్కి బైజూస్ పేమెంట్
ఆకాష్ ఎడ్యుకేషనల్ కొనుగోలుకి సంబంధించి బ్లాక్స్టోన్కి బకాయిపడ్డ 234 మిలియన్ డాలర్లను బైజూస్ తాజాగా చెల్లించింది. ఆకాష్లో బ్లాక్స్టోన్కి చెందిన 38 శాతం వాటాను బైజూస్ గతేడాది ఏప్రిల్లో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ డీల్ని క్లోజ్ చేసే సమయంలో బైజూస్ ఆకాష్ షేర్ హోల్డర్లందరికీ పేమెంట్లు చేసింది. కానీ.. కొన్ని కారణాల వల్ల బ్లాక్స్టోన్కి నిలిచిపోయిన చెల్లింపులను మొన్న గురువారం చేసింది. ఇండియాలోనే పాపులర్ ఎడ్యు-టెక్ స్టార్టప్ అయిన బైజూస్కి నష్టాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ పేమెంట్ జరగటం గమనించాల్సిన విషయం.
తాజావార్తలు
-
US-Russia: రష్యాలో ల్యాండ్ అయిన అమెరికా మిలిటరీ విమానం.. ఏం జరుగుతోంది.?
-
Asim Munir: ఇరాన్ ముందు కీలక ప్రతిపాదనలు.. హార్ముజ్పై అమెరికా ఆఫర్ ఇదేనా?
-
Dr Priyanka హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసులను కలిసిన కుటుంబ సభ్యులు!
-
Kiss Car: బాయ్ ఫ్రెండ్ కారుకు 3,400 ముద్దులు.. షాకిచ్చిన పోలీసులు
-
CM Revanth Reddy : మూసీ ప్రాజెక్ట్పై రేవంత్ స్పీడ్.. అధికారులకు కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!