UPI Lite: పిన్, మొబైల్ డేటా లేకున్నా ‘లైట్’ తీసుకోండి. యూపీఐ పేమెంట్ చేసేయండి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UPI Lite: యూపీఐ పేమెంట్లు చెయ్యాలంటే మొబైల్లో డేటా ఉండాలి. దీంతోపాటు పిన్ కూడా తెలిసుండాలి. కానీ.. ఈ రెండూ లేకపోయినా పేమెంట్ చేసేందుకు లేటెస్ట్గా ‘యూపీఐ లైట్’ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. దీన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ రీసెంట్గా ప్రారంభించారు. యూపీఐ లైట్ ద్వారా గరిష్టంగా 200 రూపాయలు చెల్లించొచ్చు. ముందుగా బ్యాంక్ అకౌంట్ నుంచి యూపీఐ లైట్ వ్యాలెట్లోకి అమౌంట్ను డిపాజిట్ చేసుకోవాలి. ఈ బ్యాలెన్స్ 2 వేల రూపాయలకు మించకూడదు. ఇదొక ఆన్డివైజ్ వ్యాలెట్ కాబట్టి దీని నుంచి పేమెంట్ చేసేటప్పుడు ఇంటర్నెట్ ఉండాల్సిన పనిలేదు. ఇప్పటికే యూపీఐ పేమెంట్ ట్రాన్సాక్షన్ల సంఖ్య రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. ఇప్పుడు యూపీఐ లైట్ కూడా అందుబాటులోకి రావటంతో ఈ లావాదేవీలు సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టనున్నాయి.
తెలంగాణకు రూ.9494 కోట్లు: కిషన్రెడ్డి
Also Read
- Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
- LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్లో 3 రోజులు సేవలకు అంతరాయం
తెలంగాణలో గత ఎనిమిదేళ్లలో 12 కొత్త మేజర్ రైల్వే ప్రాజెక్టుల కోసం దాదాపు 9494 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు. వరంగల్లో 400 కోట్ల రూపాయలతో రైల్వే కోచ్ యూనిట్ని ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోందని చెప్పారు. ఈ ఫెసిలిటీ వల్ల 3 వేల మందికి ఉపాధి దొరుకుతుందని తెలిపారు. రైల్వేలు చేపడుతున్న భద్రతా చర్యలతో ఏటా ప్రమాదాల సంఖ్య తగ్గుతోందని పేర్కొన్నారు.
read also: Behind Story of Big Bazaar’s Downfall: బిగ్ బజార్ తెర(మరుగు) వెనక ఏం జరిగింది?
బ్లాక్స్టోన్కి బైజూస్ పేమెంట్
ఆకాష్ ఎడ్యుకేషనల్ కొనుగోలుకి సంబంధించి బ్లాక్స్టోన్కి బకాయిపడ్డ 234 మిలియన్ డాలర్లను బైజూస్ తాజాగా చెల్లించింది. ఆకాష్లో బ్లాక్స్టోన్కి చెందిన 38 శాతం వాటాను బైజూస్ గతేడాది ఏప్రిల్లో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ డీల్ని క్లోజ్ చేసే సమయంలో బైజూస్ ఆకాష్ షేర్ హోల్డర్లందరికీ పేమెంట్లు చేసింది. కానీ.. కొన్ని కారణాల వల్ల బ్లాక్స్టోన్కి నిలిచిపోయిన చెల్లింపులను మొన్న గురువారం చేసింది. ఇండియాలోనే పాపులర్ ఎడ్యు-టెక్ స్టార్టప్ అయిన బైజూస్కి నష్టాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ పేమెంట్ జరగటం గమనించాల్సిన విషయం.
తాజావార్తలు
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
-
Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?