UPI Lite: పిన్, మొబైల్ డేటా లేకున్నా ‘లైట్’ తీసుకోండి. యూపీఐ పేమెంట్ చేసేయండి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UPI Lite: యూపీఐ పేమెంట్లు చెయ్యాలంటే మొబైల్లో డేటా ఉండాలి. దీంతోపాటు పిన్ కూడా తెలిసుండాలి. కానీ.. ఈ రెండూ లేకపోయినా పేమెంట్ చేసేందుకు లేటెస్ట్గా ‘యూపీఐ లైట్’ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. దీన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ రీసెంట్గా ప్రారంభించారు. యూపీఐ లైట్ ద్వారా గరిష్టంగా 200 రూపాయలు చెల్లించొచ్చు. ముందుగా బ్యాంక్ అకౌంట్ నుంచి యూపీఐ లైట్ వ్యాలెట్లోకి అమౌంట్ను డిపాజిట్ చేసుకోవాలి. ఈ బ్యాలెన్స్ 2 వేల రూపాయలకు మించకూడదు. ఇదొక ఆన్డివైజ్ వ్యాలెట్ కాబట్టి దీని నుంచి పేమెంట్ చేసేటప్పుడు ఇంటర్నెట్ ఉండాల్సిన పనిలేదు. ఇప్పటికే యూపీఐ పేమెంట్ ట్రాన్సాక్షన్ల సంఖ్య రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. ఇప్పుడు యూపీఐ లైట్ కూడా అందుబాటులోకి రావటంతో ఈ లావాదేవీలు సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టనున్నాయి.
తెలంగాణకు రూ.9494 కోట్లు: కిషన్రెడ్డి
Also Read
- Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
- Adani Group: అదానీ వేల కోట్ల సామ్రాజ్యంలోకి మరొక కంపెనీ.. ఇకపై జీవీకే ఎనర్జీ అదానీ సొంతం!
- Akash Ambani: జియో సామ్రాజ్యానికి కొత్త బాస్.. అంబానీ వారసుడి చేతికి జియో ప్లాట్ఫామ్స్ పగ్గాలు!
- Womens: మహిళలకు శుభవార్త.. మే నెలలోనే అకౌంట్లోకి రూ.1000..
తెలంగాణలో గత ఎనిమిదేళ్లలో 12 కొత్త మేజర్ రైల్వే ప్రాజెక్టుల కోసం దాదాపు 9494 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు. వరంగల్లో 400 కోట్ల రూపాయలతో రైల్వే కోచ్ యూనిట్ని ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోందని చెప్పారు. ఈ ఫెసిలిటీ వల్ల 3 వేల మందికి ఉపాధి దొరుకుతుందని తెలిపారు. రైల్వేలు చేపడుతున్న భద్రతా చర్యలతో ఏటా ప్రమాదాల సంఖ్య తగ్గుతోందని పేర్కొన్నారు.
read also: Behind Story of Big Bazaar’s Downfall: బిగ్ బజార్ తెర(మరుగు) వెనక ఏం జరిగింది?
బ్లాక్స్టోన్కి బైజూస్ పేమెంట్
ఆకాష్ ఎడ్యుకేషనల్ కొనుగోలుకి సంబంధించి బ్లాక్స్టోన్కి బకాయిపడ్డ 234 మిలియన్ డాలర్లను బైజూస్ తాజాగా చెల్లించింది. ఆకాష్లో బ్లాక్స్టోన్కి చెందిన 38 శాతం వాటాను బైజూస్ గతేడాది ఏప్రిల్లో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ డీల్ని క్లోజ్ చేసే సమయంలో బైజూస్ ఆకాష్ షేర్ హోల్డర్లందరికీ పేమెంట్లు చేసింది. కానీ.. కొన్ని కారణాల వల్ల బ్లాక్స్టోన్కి నిలిచిపోయిన చెల్లింపులను మొన్న గురువారం చేసింది. ఇండియాలోనే పాపులర్ ఎడ్యు-టెక్ స్టార్టప్ అయిన బైజూస్కి నష్టాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ పేమెంట్ జరగటం గమనించాల్సిన విషయం.
తాజావార్తలు
-
West Bengal: కలకత్తా హైకోర్టులో మమతా బెనర్జీకి ఘోర అవమానం..
-
RCB: పాయింట్ల పట్టికలో టాప్లో ఉన్నా.. ఆర్సీబీ కంటే ఆ జట్టుకే ప్లే ఆఫ్ అవకాశాలు..
-
White House: చైనాలో ట్రంప్ టూర్.. హార్ముజ్ జలసంధిపై వైట్హౌస్ కీలక ప్రకటన
-
Health Tips : పార్టీ చేసుకున్న మరుసటి రోజే జిమ్కు వెళ్తున్నారా..? అయితే జాగ్రత్త..!
-
Haji Ali Ship: హోర్ముజ్ జలసంధిలో ఘోరం.. భారత నౌకను ముంచేసిన డ్రోన్ దాడి!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?