Samsung SmartPhones Sales: సీజన్ మొదటి రోజే ‘పండగ’ చేసుకున్న శామ్సంగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samsung SmartPhones Sales: ఆన్లైన్ ఫెస్టివ్ సేల్స్లో మొదటి రోజే శామ్సంగ్కి సంబంధించి కోటి రూపాయలకు పైగా విలువైన స్మార్ట్ఫోన్ల సేల్స్ జరిగాయి. అమేజాన్ మరియు ఫ్లిప్కార్ట్ల ద్వారా ఈ అమ్మకాలు జరిగినట్లు శామ్సంగ్ ఇండియా వెల్లడించింది. 12 లక్షలకు పైగా గెలాక్సీ స్మార్ట్ఫోన్లను విక్రయించామని తెలిపింది. పండుగ సీజన్ నేపథ్యంలో శామ్సంగ్ గెలాక్సీ సిరీస్ స్మార్ట్ఫోన్ల రేట్లను 17 శాతం నుంచి 60 శాతం వరకు తగ్గించింది. ఫెస్టివ్ సీజన్ మొదటి రోజే ఈ రేంజ్లో బిజినెస్ జరిగిందంటే ఇక ముందు ముందు ఎన్ని రికార్డులు నమోదవుతాయోనని మార్కెట్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.
ఆర్&డీపై ఫోకస్ పెట్టాలి
Also Read
- Investment Tips: హోమ్ లోన్ తీర్చాలా? ఇన్వెస్ట్ చేయాలా? చేతికి బోనస్ వస్తే ఏది బెస్ట్ ఆప్షన్! నిపుణులు చెబుతున్నది ఇదే..
- Gautam Adani: అమెరికాలో అదానీ గెలిచాడు.. ఒక్క దెబ్బతో లీగల్ కేసులన్నీ క్లోజ్.. రూ.84 వేల కోట్ల ప్లాన్తో సరికొత్త చరిత్ర!
- Cost Cutting: బ్యాంకులకు మోడీ సర్కార్ బిగ్ షాక్.. దేశంలో మళ్లీ 'లాక్డౌన్' లాంటి కఠిన రూల్స్! అసలేం జరిగిందంటే..
- Petrol and Diesel Prices Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
వ్యాక్సిన్ల తయారీ సంస్థలు పరిశోధన మరియు అభివృద్ధి విభాగంపై మరింత ఫోకస్ పెట్టాలని భారత్ బయోటెక్ ఈడీ అన్నారు. తయారీ రంగంలో మన కంపెనీలు ఈ విషయంలో వెనకబడ్డాయని చెప్పారు. కొన్ని సంస్థలు ఆర్ అండ్ డీ పైన, నూతన ఔషధాల తయారీ పైన పట్టు సాధించాయని, మిగతా కంపెనీలు కూడా ఈ మేరకు ఇన్వెస్ట్మెంట్లు పెంచాలని సూచించారు. ఫార్మా సంస్థలకు కావాల్సిన కొన్ని ముఖ్యమైన ముడి పదార్థాల దిగుమతికి పర్మిషన్ ఇచ్చే విషయంలో నెలల పాటు ఆలస్యం జరుగుతోందని, దీనివల్ల ఔట్పుట్ తగ్గిపోతోందని చెప్పారు.
6 నెలల్లో రూ.630 కోట్లు
టాటా గ్రూప్కి చెందిన ఎయిర్ఏసియా ఇండియా గడచిన ఆరు నెలల్లో 630 కోట్ల రూపాయల షార్ట్ టర్మ్ లోన్లు తీసుకుంది. ఈ సంస్థ ప్రస్తుతం ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్తో విలీన ప్రక్రియలో ఉన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఒక నిర్ణయానికి రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఏసియా నగదు కొరత తలెత్తటంతో రుణాల బాట పట్టింది. విస్తారా మరియు ఎయిర్ ఇండియా ఫుల్ సర్వీస్ క్యారియర్లుగా కొనసాగుతుండటం గమనించాల్సిన విషయం.
స్టాక్ మార్కెట్ అప్డేట్
ఇండియన్ స్టాక్ మార్కెట్లను నష్టాలు వీట్లేదు. ఈ వారంలో తొలి రోజైన ఇవాళ కూడా లాస్తోనే ప్రారంభమయ్యాయి. 738 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ ప్రస్తుతం 57360 వద్ద ట్రేడింగ్ అవుతోంది. 226 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 17082 పాయింట్ల పైన కొనసాగుతోంది. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ 79.62 వద్ద స్థిరంగా ఉంది. ట్రేడింగ్ ప్రారంభ సమయంలో హర్షా ఇంజనీర్స్, బ్రిటానియా, కోల్ ఇండియా, అనుపమ్ రసాయన్ స్టాక్స్ ఆశాజనకంగా కనిపించాయి.
తాజావార్తలు
-
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
-
Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
-
Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ ‘మాస్’ స్టేట్మెంట్!
-
Karuppu Controversy:ఇళయరాజాకు ‘కరుప్పు’ టీమ్ క్షమాపణ.. వైరల్ అవుతున్న ప్రెస్ నోట్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!