Samsung SmartPhones Sales: సీజన్ మొదటి రోజే ‘పండగ’ చేసుకున్న శామ్సంగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samsung SmartPhones Sales: ఆన్లైన్ ఫెస్టివ్ సేల్స్లో మొదటి రోజే శామ్సంగ్కి సంబంధించి కోటి రూపాయలకు పైగా విలువైన స్మార్ట్ఫోన్ల సేల్స్ జరిగాయి. అమేజాన్ మరియు ఫ్లిప్కార్ట్ల ద్వారా ఈ అమ్మకాలు జరిగినట్లు శామ్సంగ్ ఇండియా వెల్లడించింది. 12 లక్షలకు పైగా గెలాక్సీ స్మార్ట్ఫోన్లను విక్రయించామని తెలిపింది. పండుగ సీజన్ నేపథ్యంలో శామ్సంగ్ గెలాక్సీ సిరీస్ స్మార్ట్ఫోన్ల రేట్లను 17 శాతం నుంచి 60 శాతం వరకు తగ్గించింది. ఫెస్టివ్ సీజన్ మొదటి రోజే ఈ రేంజ్లో బిజినెస్ జరిగిందంటే ఇక ముందు ముందు ఎన్ని రికార్డులు నమోదవుతాయోనని మార్కెట్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.
ఆర్&డీపై ఫోకస్ పెట్టాలి
Also Read
- మీకు PM Kisan డబ్బులు రావట్లేదా? ఈ కారణాలే వాటిని ఆపేస్తున్నాయట!
- Bank Holidays September 2026: సెప్టెంబర్ 2026 బ్యాంక్ సెలవులు ఇవే.. బ్యాంకుకు వెళ్లే ముందు లిస్ట్ చెక్ చేయండి
- September 1, 2026 New Rules: సెప్టెంబర్ 2026 నుంచి కీలక మార్పులు.. ITR, LPG e-KYC, FD రూల్స్ వరకు పూర్తి లిస్ట్ ఇదే
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
వ్యాక్సిన్ల తయారీ సంస్థలు పరిశోధన మరియు అభివృద్ధి విభాగంపై మరింత ఫోకస్ పెట్టాలని భారత్ బయోటెక్ ఈడీ అన్నారు. తయారీ రంగంలో మన కంపెనీలు ఈ విషయంలో వెనకబడ్డాయని చెప్పారు. కొన్ని సంస్థలు ఆర్ అండ్ డీ పైన, నూతన ఔషధాల తయారీ పైన పట్టు సాధించాయని, మిగతా కంపెనీలు కూడా ఈ మేరకు ఇన్వెస్ట్మెంట్లు పెంచాలని సూచించారు. ఫార్మా సంస్థలకు కావాల్సిన కొన్ని ముఖ్యమైన ముడి పదార్థాల దిగుమతికి పర్మిషన్ ఇచ్చే విషయంలో నెలల పాటు ఆలస్యం జరుగుతోందని, దీనివల్ల ఔట్పుట్ తగ్గిపోతోందని చెప్పారు.
6 నెలల్లో రూ.630 కోట్లు
టాటా గ్రూప్కి చెందిన ఎయిర్ఏసియా ఇండియా గడచిన ఆరు నెలల్లో 630 కోట్ల రూపాయల షార్ట్ టర్మ్ లోన్లు తీసుకుంది. ఈ సంస్థ ప్రస్తుతం ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్తో విలీన ప్రక్రియలో ఉన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఒక నిర్ణయానికి రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఏసియా నగదు కొరత తలెత్తటంతో రుణాల బాట పట్టింది. విస్తారా మరియు ఎయిర్ ఇండియా ఫుల్ సర్వీస్ క్యారియర్లుగా కొనసాగుతుండటం గమనించాల్సిన విషయం.
స్టాక్ మార్కెట్ అప్డేట్
ఇండియన్ స్టాక్ మార్కెట్లను నష్టాలు వీట్లేదు. ఈ వారంలో తొలి రోజైన ఇవాళ కూడా లాస్తోనే ప్రారంభమయ్యాయి. 738 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ ప్రస్తుతం 57360 వద్ద ట్రేడింగ్ అవుతోంది. 226 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 17082 పాయింట్ల పైన కొనసాగుతోంది. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ 79.62 వద్ద స్థిరంగా ఉంది. ట్రేడింగ్ ప్రారంభ సమయంలో హర్షా ఇంజనీర్స్, బ్రిటానియా, కోల్ ఇండియా, అనుపమ్ రసాయన్ స్టాక్స్ ఆశాజనకంగా కనిపించాయి.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!