పోలింగ్ ముగిసిన అనంతరం.. గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ప్రభుత్వం మీద ఎంత ద్వేషం ఉందో గజ్వేల్ లో తిరిగితే అర్థం అవుతుందని ఆరోపించారు. కేసీఆర్ చెప్పేది వేరు చేసేది వేరు.. నియంత లాగా వ్యవహారం చేశారని తెలిపారు. కేసీఆర్ ని ఓడించడానికి బలమైన నాయకుడు ఎక్కడ ఉంటే అక్కడ జనం ఓటు వేశారని తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది.. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఎన్నికలకు జరగగా.. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో గంట ముందే అంటే సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది.
Congress vs BRS at Tandur: తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు సజావుగానే సాగుతున్నా కొన్నిచోట్ల మాత్రం చెదురుముదురు సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో సాయి పూర్ లోని పోలింగ్ కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ కేంద్రానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పైలెట్ రోహిత్ రెడ్డి వచ్చిన నేపథ్యంలో ఈ ఉద్రిక్తత చోటు చేసుకుంది. చాలా సేపు పోలింగ్ కేంద్రంలో రోహిత్ రెడ్డి ఉండడంతో కాంగ్రెస్ నాయకుల నినాదాలు మొదలు…
Telangana Elections 2023: గాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. మరోవైపు అభ్యర్థులు సైతం పోలింగ్ బూత్ పరిశీలనకు వెళుతున్నారు. అలా వెళ్లిన కొత్తగూడెం బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావుకు నిరసన సెగ తగిలింది. ఎన్నాళ్లు ఏం చేశావని వచ్చావంటూ లక్ష్మీదేవిపల్లి మండలంలోని రేగళ్ల గ్రామస్థులు వెంకటేశ్వరరావును అడ్డుకున్నారు. Also Read: Telangana Elections 2023: మధ్యాహ్నం 1 గంటకు…
Minister Harish Rao Cast His Vote: తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద జనం బారులు తీరారు. రాజకీయ, సినీ ప్రముఖులు కూడా సామాన్యులతో కలిసి క్యూలో నిలబడి ఓటేస్తున్నారు. మంత్రి హరీష్ రావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిద్దిపేట జిల్లా భరత్ నగర్లోని అంబిటస్ స్కూల్ 114 పోలింగ్ స్టేషన్లో కుటుంబ సమేతంగా వచ్చి ఓటేశారు. Also…
Telangana Elections 2023: ఎన్నికలలో ప్రజలను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు రకరకాల వాగ్దానాలు చేస్తుంటాయి. అనేక పార్టీలు డబ్బు, మద్యంతో ప్రజలను మభ్యపెడుతుంటాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల 245 పోలింగ్ బూత్ వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పోలింగ్ కేంద్రం వద్ద అధిక సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఉండడం, జనగామ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎక్కువ సేపు పోలింగ్ బూత్ దగ్గరే ఉంటూ ఓటర్లను కలుస్తున్నాడని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం ఒకరిపై ఒకరు…
Congress Filed Complaint on MLC Kavitha: ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై భారత ఎన్నికల సంఘం (ఈసీ)కు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. కవిత ఓటేసిన అనంతరం బీఆర్ఎస్కు ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారని, ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘించడమే అని పేర్కొంటూ ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఛైర్మన్ నిరంజన్ తెలిపారు. ‘ఎమ్మెల్సీ కవిత గారు.. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి…
దీక్ష దీవాస్ పేరుతో బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించి ఎన్నికల కోడ్ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేత సీఈఓకు ఫీర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిన్న కేటీఆర్ దీక్ష దివాస్ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునివ్వడం ఎన్నికల కోడ్ ఉల్లంఘించడమే.. అందుకే సీఈఓకి ఫిర్యాదు చేశామన్నారు. ‘రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఉందా? అనే అనుమానం కలుగుతోంది. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి సైలెన్స్ పిరియాడ్ కొనసాగుతోంది. ఎన్నికలకు సంబంధించి…