KTR: ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి.. కేటీఆర్ రియాక్షన్ ఏమిటంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు స్పందిస్తూ.. తమ ఓటమికి గల కారణాలను తెలుసుకుంటామన్నారు. ఈ ఎన్నికల ఫలితాలను ఒక పాఠంగా తీసుకుంటామని, తిరిగి మళ్లీ పుంజుకుంటాం బీఆర్ఎస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీమంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ఆయన.. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.
Read Also: Pushpa Jagadeesh: బ్రేకింగ్.. యువతి ఆత్మహత్య.. అల్లు అర్జున్ ఫ్రెండ్ అరెస్ట్
Also Read
- Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే "పనీర్ భుర్జీ"తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
- Kia Carens: మారుతికి కియా భారీ షాక్.. 7-సీటర్ కేరెన్స్లో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ
- PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. 'ఖేలో ఇండియా' విజన్ను స్పష్టం చేసిన మోడీ
- India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తాత్కాలిక స్పీడ్ బ్రేకర్ మాత్రమే, ఇది స్వల్ప కాలం మాత్రమే అని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ఎవరెన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టినా, కుట్రలు చేసినా ప్రజలు మాత్రం అభివృద్ధికి సంక్షేమానికే పట్టం కట్టారని తెలిపారు. ఎన్నికలలో అనుకోని ఫలితాలు రావడం సహజం, నిరాశ పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. పోరాటాల నుంచి వచ్చిన పార్టీ.. పోరాటాలు మాకేం కొత్తకాదని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజల పక్షాన ప్రజలు గొంతుకై మాట్లాడుతామని అన్నారు.
Read Also: Floods: ఒక్క చెన్నై మాత్రమే కాదు.. శతాబ్దం చివరి నాటికి వరద ప్రమాదంలో 12 నగరాలు..
అయ్యో కేసీఆర్ ప్రభుత్వం పోయిందా? అంటూ కాంగ్రెస్ కు ఓటువేసిన వారు కూడా మెసేజ్ లు పెడుతున్నారని కేటీఆర్ చెప్పారు. పవర్ పాలిటిక్స్ లో అధికారం రావడం పోవడం సహజం, నిరాశ పడాల్సిన అవసరంలేదని తెలిపారు. ప్రజలు మనకు కూడా రెండు సార్లు అవకాశం ఇచ్చారు, దానికి భయపడాల్సిన అవసరంలేదని అన్నారు. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష పాత్రలో కూడా రానిస్తాం, ప్రజల గొంతుకై మాట్లాడుతామని పేర్కొన్నారు. తెలంగాణకు ఉన్న ఏకైక గొంతు కేసీఆర్, బీఆర్ఎస్.. ప్రజలు వదులుకోరని కేటీఆర్ చెప్పారు. కాగా.. సిరిసిల్లలో ఓటుకు డబ్బులు, మందు పంచనని మాట ఇచ్చాను.. ఆ మాటను నిలబెట్టుకున్నాను.. ప్రజలు కూడా నా విశ్వాసాన్ని నిలబెట్టారని కేటీఆర్ తెలిపారు.
తాజావార్తలు
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Kia Carens: మారుతికి కియా భారీ షాక్.. 7-సీటర్ కేరెన్స్లో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ
-
Forbes India: అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. ఫోర్బ్స్ కవర్పై ఐకాన్ స్టార్!
-
PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. ‘ఖేలో ఇండియా’ విజన్ను స్పష్టం చేసిన మోడీ
-
India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
ట్రెండింగ్
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!