Kavitha Kalvakuntla Tweet on BRS Defeat: అధికారం ఉన్నా లేకున్నా.. తాము తెలంగాణ ప్రజల సేవకులమే అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. గెలిచిన ఎమ్మెల్యేలకు మరియు కాంగ్రెస్ పార్టీకి ఆమె అభినందనలు తెలిపారు. దేవుడు తెలంగాణను ఆశీర్వదిస్తాడని కవిత పేర్కొన్నారు. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో.. కాంగ్రెస్ పార్టీ మేజిక్ ఫిగర్ను దాటేసింది. దాంతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఇప్పటికి 25 స్థానాలు మాత్రమే గెలిచిన బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టలేకపోయింది. కల్వకుంట్ల…
Kadiyam Srihari Says We will play the role of opposition: స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ప్రజలు తనను ఆదరించారని, నిండు మనసుతో ఆశీర్వదించిన అందరికీ ధన్యవాదాలు అని బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి చెప్పారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో కేసీఆర్ నిలబెట్టారు, అయితే ప్రజలు మార్పు కోరుకున్నారన్నారు. ఇక ప్రతిపక్ష పాత్ర పోషించనున్నా అని కడియం పేర్కొన్నారు. కడియం శ్రీహరి 7,819 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి సిగపురం ఇందిరాపై విజయం సాధించారు.…
Telangana Results: బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ మట్టికరిపించింది. తెలంగాణలో అధికారం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ 65 స్థానాలు గెలవబోతోంది. 40 స్థానాలకు మాత్రమే బీఆర్ఎస్ పరిమితమైంది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీలో పలువురు మంత్రులు కూడా ఘోరంగా ఓటమి చవిచూశారు.
బాన్సువాడ నియోజకవర్గం నుంచి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఘన విజయం సాధించారు. 23,582 ఓట్లతో గెలుపొందారు. అయితే స్పీకర్ గా ఉండి విజయం సాధించడం చాలా అరుదు.. కానీ పోచారం దాన్ని తిరగరాశాడు. ఈ క్రమంలో ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. ప్రజా తీర్పును గౌరవిస్తాం, గెలుపు ఓటములు సహజమన్నారు. ప్రజలు నాపై నమ్మకంతో మళ్ళీ గెలిపించారు.. నా విజయం కాదు ప్రజల విజయం, కార్యకర్తల విజయం అన్నారు.
KTR Tweet Goes Viral: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకెళుతోంది. ఇప్పటికే 42 స్థానాలు గెలిచిన కాంగ్రెస్.. మరో 22 చోట్ల ఆధిక్యంలో ఉంది. మ్యాజిక్ ఫిగర్ 60కి కాంగ్రెస్ దగ్గరలో ఉండగా.. అధికార బీఆర్ఎస్ కేవలం 13 స్థానాల్లో మాత్రమే గెలిచి ఓటమి దిశగా సాగుతోంది. ఈ నేపథ్యంలో సిరిసిల్ల బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కేటీఆర్ తమ ఓటమిని ఒప్పుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్…
Telangana Results: తెలంగాణలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా గుర్తింపు ఉన్న కాంగ్రెస్ గత రెండు పర్యాయాలుగా అధికారానికి దూరంగా ఉంది. అయితే తాజా ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీని మట్టికరిపించింది. 119 స్థానాలు ఉన్న తెలంగాణ అసెంబ్లీలో 65 స్థానాలను గెలుచుకోబోతోంది. 2018లో ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో ఎమ్మెల్యేలు, లీడర్లు, క్యాడర్ వెళ్లినా కూడా ఇప్పుడు కాంగ్రెస్ ఘన విజయం సాధించింది.
కామారెడ్డిలో హోరాహోరీ పోరు జరుగుతుంది. కామారెడ్డిలో 14వ రౌండ్ ముగిసేసరికి 2,100 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణా రెడ్డి ముందంజలోకి వచ్చారు.. రెండో స్థానంలో రేవంత్రెడ్డి, మూడోస్థానంలో కేసీఆర్ కొనసాగుతున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. ఇప్పటికే 20 స్థానాల్లో గెలువగా, 45 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నారు. ఈ క్రమంలో అధికార బీఆర్ఎస్ ఓటమి దిశగా పయనిస్తోంది. ఒకవైపు.. ఎర్రబెల్లి, నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, జగదీశ్వర్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి ఓటమి చెందారు.. కానీ, మంత్రి చామకూర మల్లారెడ్డి విజయం సాధించారు. మల్లారెడ్డి దాదాపు 9 వేల ఓట్ల ఆధిక్యంతో సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు.
పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి విజయం సాధించారు. వరుసగా ఏడుసార్లు విజయం సాధించిన ఎర్రబెల్లిని యశస్విని ఓడించడం సంచలనంగా మారింది. ఈ సందర్భంగా తన గెలుపుపై యశస్విని రెడ్డి మాట్లాడుతూ.. ఎంతటి బిగ్ షాట్ లు అయినా ప్రజలు తిరస్కరిస్తే ఇంటికి వెళ్లాల్సిందేనని తెలిపారు.