CM Revanth: కేసీఆర్.. అమరుల కుటుంబాలకు బుక్కెడు బువ్వ పెట్టారా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉద్యమాల నుండి వచ్చిన పార్టీ అని చెప్పుకుంటారు.. ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు తొమ్మిదిన్నర ఏండ్లలో ప్రగతి భవన్ పిలిచారా అని ప్రశ్నించారు. వాళ్ళ త్యాగం గుర్తించారా అని అన్నారు. కేసీఆర్.. అమరుల కుటుంబంకి బుక్కెడు బువ్వ పెట్టారా అని సీఎం పేర్కొన్నారు. ఆయన కుటుంబంలో అందరికి మంత్రి పదవులు ఇచ్చారు.. పేగు బంధం ఉన్నవాళ్లకు పదవులు ఇచ్చారు.. కానీ ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ఏం చేశారని ప్రశ్నించారు. కరోనా మందు బ్లాక్ మార్కెట్ లో అమ్ముకున్న వాళ్లను రాజ్యసభ పంపిన చరిత్ర మీది అని దుయ్యబట్టారు.
Bhogapuram Green Field Airport: 2025లో అందుబాటులోకి భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్!
Also Read
నళిని డీఎస్పీగా ఉండి.. తెలంగాణ కోసం తన ఉద్యోగంకి రాజీనామా చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పిలిచి ఉద్యోగం ఇస్తా రండి అని చెప్పిందా.. నళినికి న్యాయం జరగలేదు కానీ.. కూతురు నిజామాబాద్లో ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చిన పార్టీ వాళ్ళదని అన్నారు. తెలంగాణా ఉద్యమకారులపై కేసులు ఎత్తివేశారా అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల పై ఉన్న కేసులు ఎన్ని.. ఉద్యమ కారులపై ఉన్న కేసులు ఎన్ని అని కేసీఆర్ ఎప్పుడైనా సమీక్ష చేశారా అని ప్రశ్నించారు. ఉద్యమాల పార్టీ ధర్నా చౌక్ ఎత్తేశారని విమర్శించారు. ధర్నా చౌక్ ఎత్తేసిన దుర్నీతి మీది అని దుయ్యబట్టారు. ధర్నా చౌక్ ని పునరుద్దరిస్తే.. అభినందించాల్సినది పోయి అడ్డుపడుతున్నారని తెలిపారు.
రైతు భీమా లెక్కల ప్రకారం లక్షల మంది చనిపోయారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రైతుని ఆదుకోవడానికి పథకాలు ఉండాలి.. చనిపోయిన తర్వాత డబ్బులు ఇచ్చుడు కాదు.. రైతు చావుకు ఐదు లక్షలు వెల కట్టిందని దుయ్యబట్టారు. కేసీఆర్ వరి పంట అద్భుతం అన్నాడు.. రైతులను ఆదుకోండి అని ఒత్తిడి చేస్తే.. వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్టే అన్నాడు కేసీఆర్ అని దుయ్యబట్టారు. తన ఫార్మ్ హౌస్ లోని 150 ఎకరాల్లో కేసీఆర్ మాత్రం వరి పండించాడు.. పేద రైతులకు క్వింటాలుకు1960 రూపాయలు ఇవ్వలేదు కానీ కేసీఆర్ ఫార్మ్ హౌస్ లో పండించిన పంటకు 4250 ఇచ్చారు.. ఎవరు ఇచ్చారు.. ఎందుకు ఆ ధర ఇచ్చారో విచారణ చేయమని అంటారా అని రేవంత్ రెడ్డి అన్నారు. నేను రెడీ విచారణ చేయడానికి.. విద్యుత్ తలసరి వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో లేదు.. అబద్ధాల పునాదుల మీద ఎదిగిన పార్టీ వాళ్ళదని సీఎం విమర్శించారు. తలసరి వినియోగంలో 10వ స్థానంలో తెలంగాణ ఉందన్నారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!