CM Revanth: అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత అందరు సభ్యులను మేడిగడ్డ పర్యటనను తీసుకు వెళ్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి.. మండలిలో మాట్లాడారు. ఈ సందర్భంగా.. అసెంబ్లీ ముందు ఉన్న ముళ్ల కంచెలు తొలగించే విషయమై అన్ని పార్టీలతో సమావేశం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఆ అంశాలు.. అసెంబ్లీ, మండలి వ్యవహారాలు చైర్మన్, స్పీకర్ పరిధిలో ఉంటాయి.. మీరు ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. మరోవైపు.. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత అందరు సభ్యులను మేడిగడ్డ పర్యటనను తీసుకు వెళ్తానని రేవంత్ రెడ్డి అన్నారు. ఎందుకు కుంగి పోయింది.. ఎందుకు పనికి రాకుండా పోయింది.. తెలుసుకుంటామన్నారు.
Laxman: కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తోంది
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
మేడిగడ్డ, అన్నారం విషయంలో సిట్టింగ్ జడ్జీతో విచారణకు ఆదేశిస్తామని.. అన్ని విషయాలు బయటకు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంట్రాక్టులు ఎవరు ఇచ్చారు? వారి వెనుక ఉన్న మంత్రులు ఎవరు? అధికారుల పాత్ర అన్ని విచారణలో బయటకు వస్తాయని.. నిష్పాక్షిక విచారణ చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. నిజాం చక్కర కర్మాగారం తిరిగి ప్రారంభానికి కట్టుబడి ఉన్నాం..
మంత్రులతో ఒక కమిటీ వేస్తాం.. తన పాదయాత్ర సందర్భంగా కూడా ఈ విషయం అక్కడి ప్రజలకు తెలిపానన్నారు. తమ మ్యానిఫెస్టోలో కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశామని సీఎం పేర్కొన్నారు. గత ప్రభుత్వం నకిలీ ప్రభుత్వం.. తమ ప్రభుత్వంలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.
Solar flare: సూర్యుడి నుంచి ఎగిసిపడిన అతిపెద్ద సౌరజ్వాల.. భూమి వైపు దూసుకొస్తోంది..
పబ్బులు, బార్ల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.. పబ్బులు, బార్ల పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్కూల్స్ లో ముఖ్యమంత్రి టిఫిన్ పథకాన్ని సమీక్ష చేస్తామని పేర్కొన్నారు. వారంలో మూడు రోజులు మంత్రులు సెక్రటేరియట్ లో అందుబాటులో ఉంటారని.. రోజు 3 నుంచి 6 గంటల పాటు ఆయా మంత్రులను కలిసి సమస్యలపై వినతిపత్రాలు ఇవ్వొచ్చన్నారు. అసెంబ్లీ ఆవరణలోని హాల్ లోకి వచ్చే బడ్జెట్ సమావేశాల్లోపు శాసన మండలిని అక్కడకు షిఫ్ట్ చేద్దామని తెలిపారు. మనం పాలకులం కాదు.. సేవకులం.. సమస్యలను ఎప్పుడైనా ప్రస్తావించవచ్చు.. తాము ఓపెన్ మైండ్ తో ఉన్నామని సీఎం తెలిపారు. ఒకరినొకరం సహకరించుకుందామని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!