CM Revanth: అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత అందరు సభ్యులను మేడిగడ్డ పర్యటనను తీసుకు వెళ్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి.. మండలిలో మాట్లాడారు. ఈ సందర్భంగా.. అసెంబ్లీ ముందు ఉన్న ముళ్ల కంచెలు తొలగించే విషయమై అన్ని పార్టీలతో సమావేశం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఆ అంశాలు.. అసెంబ్లీ, మండలి వ్యవహారాలు చైర్మన్, స్పీకర్ పరిధిలో ఉంటాయి.. మీరు ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. మరోవైపు.. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత అందరు సభ్యులను మేడిగడ్డ పర్యటనను తీసుకు వెళ్తానని రేవంత్ రెడ్డి అన్నారు. ఎందుకు కుంగి పోయింది.. ఎందుకు పనికి రాకుండా పోయింది.. తెలుసుకుంటామన్నారు.
Laxman: కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తోంది
Also Read
- Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్పై సస్పెన్స్..
- 185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
మేడిగడ్డ, అన్నారం విషయంలో సిట్టింగ్ జడ్జీతో విచారణకు ఆదేశిస్తామని.. అన్ని విషయాలు బయటకు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంట్రాక్టులు ఎవరు ఇచ్చారు? వారి వెనుక ఉన్న మంత్రులు ఎవరు? అధికారుల పాత్ర అన్ని విచారణలో బయటకు వస్తాయని.. నిష్పాక్షిక విచారణ చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. నిజాం చక్కర కర్మాగారం తిరిగి ప్రారంభానికి కట్టుబడి ఉన్నాం..
మంత్రులతో ఒక కమిటీ వేస్తాం.. తన పాదయాత్ర సందర్భంగా కూడా ఈ విషయం అక్కడి ప్రజలకు తెలిపానన్నారు. తమ మ్యానిఫెస్టోలో కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశామని సీఎం పేర్కొన్నారు. గత ప్రభుత్వం నకిలీ ప్రభుత్వం.. తమ ప్రభుత్వంలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.
Solar flare: సూర్యుడి నుంచి ఎగిసిపడిన అతిపెద్ద సౌరజ్వాల.. భూమి వైపు దూసుకొస్తోంది..
పబ్బులు, బార్ల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.. పబ్బులు, బార్ల పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్కూల్స్ లో ముఖ్యమంత్రి టిఫిన్ పథకాన్ని సమీక్ష చేస్తామని పేర్కొన్నారు. వారంలో మూడు రోజులు మంత్రులు సెక్రటేరియట్ లో అందుబాటులో ఉంటారని.. రోజు 3 నుంచి 6 గంటల పాటు ఆయా మంత్రులను కలిసి సమస్యలపై వినతిపత్రాలు ఇవ్వొచ్చన్నారు. అసెంబ్లీ ఆవరణలోని హాల్ లోకి వచ్చే బడ్జెట్ సమావేశాల్లోపు శాసన మండలిని అక్కడకు షిఫ్ట్ చేద్దామని తెలిపారు. మనం పాలకులం కాదు.. సేవకులం.. సమస్యలను ఎప్పుడైనా ప్రస్తావించవచ్చు.. తాము ఓపెన్ మైండ్ తో ఉన్నామని సీఎం తెలిపారు. ఒకరినొకరం సహకరించుకుందామని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Aditya Dhar: ‘ధురందర్’ తర్వాత ఆదిత్య ధర్కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?
-
Boss Scam: వాట్సాప్, ఏఐ వాయిస్తో మోసం.. ‘బాస్ స్కామ్’పై సెబీ హెచ్చరిక..
-
Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
-
Vikram-1: విక్రమ్-1 రాకెట్లో అంతరిక్షంలోకి ప్రధాని మోడీ చేతిరాత పోస్ట్కార్డ్.. చరిత్ర సృష్టించనున్న మిషన్ ఆగమన్
-
Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!