CM Revanth: అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత అందరు సభ్యులను మేడిగడ్డ పర్యటనను తీసుకు వెళ్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి.. మండలిలో మాట్లాడారు. ఈ సందర్భంగా.. అసెంబ్లీ ముందు ఉన్న ముళ్ల కంచెలు తొలగించే విషయమై అన్ని పార్టీలతో సమావేశం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఆ అంశాలు.. అసెంబ్లీ, మండలి వ్యవహారాలు చైర్మన్, స్పీకర్ పరిధిలో ఉంటాయి.. మీరు ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. మరోవైపు.. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత అందరు సభ్యులను మేడిగడ్డ పర్యటనను తీసుకు వెళ్తానని రేవంత్ రెడ్డి అన్నారు. ఎందుకు కుంగి పోయింది.. ఎందుకు పనికి రాకుండా పోయింది.. తెలుసుకుంటామన్నారు.
Laxman: కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తోంది
Also Read
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్..
- Naturally Lizard Removal Tips: వేసవిలో ఇంట్లో బల్లుల బెడద ఎక్కువైందా..? ఈ సింపుల్ స్ప్రే చాలు.. వెంటనే పారిపోతాయి..!
- Sorakaya Uttappam Recipe: సొరకాయతో సూపర్ టేస్ట్.. మెత్తటి ‘సొరకాయ ఉత్తప్పం’ రెసిపీ..
- Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
మేడిగడ్డ, అన్నారం విషయంలో సిట్టింగ్ జడ్జీతో విచారణకు ఆదేశిస్తామని.. అన్ని విషయాలు బయటకు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంట్రాక్టులు ఎవరు ఇచ్చారు? వారి వెనుక ఉన్న మంత్రులు ఎవరు? అధికారుల పాత్ర అన్ని విచారణలో బయటకు వస్తాయని.. నిష్పాక్షిక విచారణ చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. నిజాం చక్కర కర్మాగారం తిరిగి ప్రారంభానికి కట్టుబడి ఉన్నాం..
మంత్రులతో ఒక కమిటీ వేస్తాం.. తన పాదయాత్ర సందర్భంగా కూడా ఈ విషయం అక్కడి ప్రజలకు తెలిపానన్నారు. తమ మ్యానిఫెస్టోలో కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశామని సీఎం పేర్కొన్నారు. గత ప్రభుత్వం నకిలీ ప్రభుత్వం.. తమ ప్రభుత్వంలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.
Solar flare: సూర్యుడి నుంచి ఎగిసిపడిన అతిపెద్ద సౌరజ్వాల.. భూమి వైపు దూసుకొస్తోంది..
పబ్బులు, బార్ల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.. పబ్బులు, బార్ల పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్కూల్స్ లో ముఖ్యమంత్రి టిఫిన్ పథకాన్ని సమీక్ష చేస్తామని పేర్కొన్నారు. వారంలో మూడు రోజులు మంత్రులు సెక్రటేరియట్ లో అందుబాటులో ఉంటారని.. రోజు 3 నుంచి 6 గంటల పాటు ఆయా మంత్రులను కలిసి సమస్యలపై వినతిపత్రాలు ఇవ్వొచ్చన్నారు. అసెంబ్లీ ఆవరణలోని హాల్ లోకి వచ్చే బడ్జెట్ సమావేశాల్లోపు శాసన మండలిని అక్కడకు షిఫ్ట్ చేద్దామని తెలిపారు. మనం పాలకులం కాదు.. సేవకులం.. సమస్యలను ఎప్పుడైనా ప్రస్తావించవచ్చు.. తాము ఓపెన్ మైండ్ తో ఉన్నామని సీఎం తెలిపారు. ఒకరినొకరం సహకరించుకుందామని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Preity Zinta-Shreyas Iyer: ఇది ఆటేనా అసలు.. శ్రేయస్ అయ్యర్పై ప్రీతి జింటా ఫైర్!
-
Stock Market Crash: స్టాక్ మార్కెట్ కొంప ముంచిన ట్రంప్ ప్రకటన.. ప్రారంభంలోనే సెన్సెక్స్ 800, నిఫ్టీ 250 పాయింట్లు డౌన్!
-
Tollywood : చదువుకోవడం కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన టాలీవుడ్ హీరోయిన్
-
Donald Trump: త్వరగా నిర్ణయం తీసుకోండి, లేకపోతే మీకు ఏమీ మిగలదు.. ఇరాన్ను మళ్లీ హెచ్చరించిన ట్రంప్
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..