Ponguleti: ఖజానాను ఖాళీ చేసి ఇచ్చారు.. అయినా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponguleti: ఖజానాను ఖాళీ చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు ఇచ్చింది.. అయినా ఆరు గారింటీలను ఇస్తామని రెవెన్యూ, ఐ అండ్ పీఆర్, గృహ నిర్మాణశాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు ఏమిటి అనే దానిపై సమీక్ష జరుపలేదన్నారు. ఆనాడు తప్పులు చేసిన అధికారుల ను వేదింపులకు పాల్పడం ప్రజలను ఆనాటి ప్రభుత్వం విస్మరించిందన్నారు. తప్పులు చేసిన వారిని శిక్షించాలని అజెండా మాకు లేదన్నారు. ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం అన్నారు. మంచి అధికారులకు కీ పొజిషన్ వుంటుందన్నారు. గత ప్రభుత్వం వత్తిడి వల్ల అధికారులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. కానీ పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. సిఎం రేవంత్ రెడ్డికి.. అధికారుల మీద రాజకీయ పార్టీల మీద ఏనాడూకక్ష్య సాధింపు లేదన్నారు. ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఆక్రమించిన వాటిని బయటకు తీస్తామన్నారు.
Also Read
బినామీ కాంట్రాక్ట్ లని వచ్చిన వాటిపై సమీక్ష జరపాలి.. జరుపుతామన్నారు. ఇంకా అధికారం మత్తులో వున్నట్లుగా అహంకారంగా కొంతమంది వున్నారని తెలిపారు. వారిని ప్రజలు గమనిస్తున్నారని.. గత ప్రభుత్వం ఆర్థికంగా రాష్ట్రాన్ని కొల్లగొట్టిందని తెలిపారు. బీఆర్ఎస్ మాదిరిగా మాయమాటలు చెప్పడం మాకు సాధ్యం కాదన్నారు. మేము అలా చేయమని, ఆరు గ్యారెంటీలను సామాన్య ప్రజలకు అందిస్తామన్నారు. ఆర్థిక ఇబ్బందులు రాష్ట్రంలో వున్న మాట వాస్తవమన్నారు. కానీ గారెంటీలను అమలు చేస్తామన్నారు. ఖజానాను ఖాళీ చేసి మాకు ఇచ్చింది.. అయిన ఆరు గారింటీ లను ఇస్తామన్నారు. ఈ ప్రభుత్వం ఊరించదు.. జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను సామాన్యులకు ఇచ్చే ఇళ్లను విడతల వారీగా ఇస్తామన్నారు. తెలంగాణలో ఇల్లు లేదు అనే మాట రాకుండా చూస్తామన్నారు.
Read also: CPI Narayana: సీపీఐ వల్లే కాంగ్రెస్ విజయం.. లోక్ సభకు పోటీచేస్తాం
ప్రతిపక్షాలు సహకరించక పోయిన పర్వాలేదన్నారు. కారు కూతలు కూయకండి.. కొద్ది నెలల ఓపిక పట్టండని తెలిపారు. ఏ వ్యక్తి, మాజీ మంత్రిని టార్గెట్ చేసుకోవడం కాదు వ్యవస్థ ను, ప్రభుత్వం సొమ్మును దోచుకున్న వారిని ఎవ్వరినీ క్షమించం అంటూ క్లారిటీ ఇచ్చారు. ఎంత పెద్ద నాయకుడు అయిన వదిలిపెట్టం అని స్పష్టత ఇచ్చారు. గ్రామ పంచాయతీలో కట్టుకున్న వాటిని రెగ్యులరైజేషన్ కోసం కమిటీ వేస్తామన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలపై ఇంకా డిసిషన్ తీసుకోలేదని అన్నారు. అయిదు గ్రామ పంచాయతీలపై ఆలోచిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి వుందన్నారు. రైతుబంధుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!