B.Vinod Kumar: తెలంగాణ ప్రజలు రానున్న పార్లమెంట్ ఎన్నికలలో బ్రహ్మాండంగా విజయాన్ని అందిస్తారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్ లో మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ఎన్నికలలో ప్రజలు మమ్ములను ప్రశ్నలు అడిగారు.. ప్రత్యర్థులు పదే పదే అబద్ధాలు చెప్పడం వల్ల సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించాయని తెలిపారు. వారి విమర్శలను తిప్పికొట్టడంలో నిర్లిప్తత చేయడంతో నష్టం చేకూరిందని అన్నారు. తెలంగాణా రాష్ట్రాన్ని బంగారు పల్లెంలో అప్పజెప్పాం అనే దానిపై బండి సంజయ్ విమర్శించారని పేర్కొన్నారు.
Operation Valentine : ‘ఆపరేషన్ వాలెంటైన్’ ఫస్ట్ స్ట్రైక్ రిలీజ్ టైం ఫిక్స్..
Also Read
ఆర్బీఐ లెక్కల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఎస్ఓటిఆర్ ద్వారా తెలంగాణా ప్రభుత్వం పన్నులలో 82.4 శాతం ఇస్తే.. బీజేపీ పాలిత రాష్ట్రాలు దరి దాపులలో లేవని వినోద్ కుమార్ అన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ పార్టీ అధికారంలో ఉన్న బీజేపీ పార్టీల పరిస్థితి అని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల గురించి చెబుతున్నారు కానీ.. స్థిరాస్థుల గురించి ఎందుకు మాట్లాడడం లేదు? అని ప్రశ్నించారు.
లక్షల ఎకరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం భూ సేకరణ చేసి రాష్ట్రాభివృధ్ధికి తోడ్పడిందని తెలిపారు. ఋణాలు తీసుకొని అభివృద్ధి చేయడం అప్పు కింద రాదని పేర్కొన్నారు.
Minister Seethakka: గతంలో కంటే నాపై బాధ్యతలు ఎక్కువగా పెరిగాయి.. ములుగులో సీతక్క
తెలంగాణలో బలమైన ప్రతిపక్షం కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ ప్రజలు రానున్న పార్లమెంట్ ఎన్నికలలో బ్రహ్మాండంగా విజయాన్ని అందిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కొన్ని ప్రాంతాలలో బీజేపీకి డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఉండబోతోందని ఆరోపించారు. మొదటి తేది జీతాలు ఇవ్వలేదన్న బండి సంజయ్, బీజేపీ పాలిత కొన్ని రాష్ట్రాలలో రెండు మూడు నెలలకొకసారి ఇవ్వడం జరుగుతుందని విమర్శించారు. తెలంగాణ అప్పుల రాష్ట్రమని ప్రజలను భయపెట్టడం మానుకోండని హితవు పలికారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!