Home
Breaking News
Breaking News News
-
టెన్త్, ఇంటర్ అడ్మిషన్ల తేదీని పొడిగించిన TOSS
ఓపెన్ స్కూల్ సొసైటీ తెలంగాణలోని విద్యార్థులకు శుభవార్త చెప్పింది. అయితే ప్రవేశాల కోసం దరఖాస్తు గడువు రేపు ముగియనున్న నేపథ్యంలో గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో, వివిధ కారణాలతో దరఖాస్తు చేసుకోలేక పోయిన విద్యార్థులు పొడగించిన గడువు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) టెన్త్ మరియు ఇంటర్మీడియట్ కోర్సుల్లోకి ప్రత్యేక ప్రవేశాల కోసం చివరి తేదీని జనవరి 24 నుండి 31 వరకు పొడిగించింది. ప్రజా ప్రతినిధులు,… -
పైశాచికత్వం.. ఆస్తులకోసం వివస్త్రను చేసి నిర్బంధం..
ప్రభుత్వ ఉన్నతాధికారి అయిన తన భర్త నుండి తనకు ప్రాణహాని ఉందని, తనను రక్షించాలని ఒక మహిళ వేడుకొంటుంది. ఏసీబీ స్వాధీనం చేసుకున్న ఆస్తులను అతని పేరుపై బదలాయించాలని వేధింపులకు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే ఒకసారి తనపై హత్యాయత్నం చేశారని… డాక్టర్లు సకాలంలో నాలుగు సర్జరీలు చేయడంతో ప్రాణాపాయం తప్పిందని ఆరోపిస్తోంది. నగర పోలీసు ఉన్నతాధికారులు తనకు న్యాయం చేయాలని కోరుతుంది. సైదాబాద్ లో మీడియా తో బాధితురాలు బోడ పద్మ వివరాలు వెల్లడించారు.… -
సమావేశమైన ఉద్యోగ సంఘాల స్టీరింగ్ కమిటీ
ఏపీలో పీఆర్సీ పై ఉద్యోగ సంఘాలు తగ్గేదేలే అంటున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని ఉద్యోగ సంఘాలు ఏక తాటిపైకి వచ్చి పీఆర్సీ సాధన కమిటీగా ఏర్పడింది. అంతేకాకుండా సమ్మెకు పిలునివ్వనున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాల స్టీరింగ్ కమిటీ సమావేశమైంది. పీఆర్సీ సాధన సమితి ముఖ్య నేతలు బొప్పరాజు, బండి శ్రీనివాస రావు, వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణ లు విజయవాడ రెవెన్యూ భవన్ కు చేరుకున్నారు. రేపు సమ్మె నోటీసు ఇవ్వాలని పీఆర్సీ సాధన సమితి నిర్ణయించింది. పీఆర్సీ… -
ఏపీలో వీకెండ్ లాక్ డౌన్..?
కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా రక్కసి ఇప్పుడు మరోసారి రెక్కలు చాస్తోంది. కరోనా వైరస్ కొత్త కొత్తగా రూపాంతరాలు చెంది ప్రజలపై విరుచుకుపడుతోంది. ఫస్ట్ వేవ్ తరువాత డెల్టా వేరియంట్ తో కరోనా ప్రజలను సెకండ్ వేవ్ రూపంలో భయభ్రాంతులకు గురిచేసింది. అంతేకాకుండా డెల్టా వేరియంట్ ఫస్ట్ వేవ్ కంటే 3 రెట్లు వేగంగా వ్యాప్తి చెంది ప్రపంచ దేశాలను సైతం తాన్ ముందు మోకరిల్లేలా చేసింది. అయితే ఇటీవల… -
మే నాటికి సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలి : రజత్ కుమార్
సీతమ్మ సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్టు నిర్మాణ పనులను మే నెలాఖరులోగా పూర్తి చేయాలని నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి (ఇరిగేషన్) రజత్కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లాలోని అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి గ్రామంలో నిర్మిస్తున్న ప్రాజెక్టు పనులను సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రెడ్డి, ఎల్ అండ్ టీ సీఈవో సుబ్రహ్మణ్యంతో కలిసి ఆయన పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతిని సమీక్షించేందుకు సమావేశం నిర్వహించారు. రూ.3,480 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు నిర్మాణానికి భూసేకరణ ఈ… -
స్పోర్ట్స్ హబ్ కోసం గజ్వేల్లో 20 ఎకరాలు
గజ్వేల్ పట్టణానికి సమీపంలో స్పోర్ట్స్ హబ్ను ఏర్పాటు చేసే దిశగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. స్పోర్ట్స్ హబ్ కోసం సిద్దిపేట సర్వే నంబర్ 560/1లో గజ్వేల్ పట్టణానికి కిలోమీటరు దూరంలో 20 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు 20 ఎకరాల భూమిని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ (సాట్స్)కు బదిలీ చేశారు. జిల్లా పాలనాధికారి నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. గజ్వేల్ స్పోర్ట్స్ హబ్లో ఫుట్బాల్ క్లబ్తోపాటు ఇతర క్రీడా శిక్షణా కేంద్రాలను… -
జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పరిపూర్ణానంద స్వామి
సీఎం జగన్ పై పరిపూర్ణానంద స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయని పరిపూర్ణానంద స్వామి అన్నారు. కడప జిల్లాలో టిప్పు సుల్తాన్ విగ్రహ ప్రతిష్ఠ చేయాలని ప్రయత్నించారని, కేరళ కూర్గ్ లో కొండ జాతి గిరిజనులను టిప్పు సుల్తాన్ ఉచకోత కోశారన్నారు. అలాంటి వ్యక్తి విగ్రహాన్ని పెట్టాలనుకున్న జగన్ ఆలోచన ఎలాంటిదో అర్థమవుతుందని ఆయన విమర్శించారు. పీఎఫ్ఐ ప్రోత్సహంతో హిందువులు 98 శాతం ఉన్న ప్రాంతంలో మసీదు… -
ఒమిక్రాన్ వేగానికి సర్జికల్, క్లాత్ మాస్కులు పనిచేయవంట
గత రెండు సంవత్సరాలుగా యావత్తు ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి పట్టిపీడిస్తోంది. కరోనా వైరస్ కొత్తకొత్తగా రూపాంతరాలు చెందుతూ మానవ జాతిపై విరుచుకుపడుతోంది. కరోనా కట్టడికి శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు అధ్యయనాలు చేస్తూ కొత్త విషయాలను వెల్లడిస్తున్నారు. కరోనా డెల్టా వేరియంట్ తగ్గుముఖం పడుతున్న తరుణంలో సౌతాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగు చూసింది. అంతేకాకుండా సెకండ్ వేవ్ లో ప్రజలను భయాందోళనకు గురిచేసిన డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేరియంట్ 6 రెట్లు వేగంగా వ్యాప్తి… -
తెలంగాణలో బీజేపీ విష సర్పం లెక్క పెరుగుతుంది : తమ్మినేని వీరభద్రం
టీఆర్ఎస్, బీజేపీ లపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినని వీరభద్రం తీవ్ర విమర్శలు చేశారు. ఒకప్పుడు సేవ.. పనులు చేస్తే ఓట్లు.. సీట్లు వచ్చేవని, ఓట్లు సీట్లు తెచ్చుకున్న టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కరోనా టైం లో ఒక్క ఐసోలేషన్ కేంద్రం అయినా పెట్టరా..? అని ప్రశ్నించారు. మేము పేదల కోసం ఐశోలేషన్ కేంద్రాన్ని పెట్టాం..గర్వంగా చెప్తాం అని ఆయన అన్నారు. మేము ఓట్లు.. సీట్లు గెలుచుకోవడంలో వెనక పడ్డాం నిజమే.. ఓట్లు వచ్చినా.. సీట్లు రాకపోయినా… -
కొడాలి నాని ఓ గ్రామసింహం : బోండా ఉమా
గుడివాడ క్యాసినో అంశం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. నిన్న టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ గుడివాడలోని మంత్రి కొడాలి నానికి చెందిన కె కన్వెన్షన్ లో తనిఖీలు చేసేందుకు వెళ్లారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి పరిస్థితుల దృష్ట్యా టీడీపీ నిజ నిర్ధారణకమిటీ సభ్యులు వెనుదిరిగి వెళ్లిపోయారు. అయితే తాజాగా టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు బోండా ఉమా మాట్లాడుతూ.. విజయవాడ కలెక్టర్ కు గుడివాడ క్యాసినో, తనిఖీ వెళ్లిన…
తాజావార్తలు
-
Amit Shah: గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు బీజేపీ..
-
Pakistan: ‘‘భారత సైన్యం ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడుతుంది.?’’.. పాక్ ఆర్మీ ప్రశ్నపై ట్రోల్స్..
-
Arshdeep Singh: అర్ష్దీప్ సింగ్కు షాకిచ్చిన బీసీసీఐ..! ఇక, కుదరదు..
-
China: జిన్పింగ్ పీఠానికే ఎసరు? చైనా మాజీ రక్షణ మంత్రుల మరణశిక్ష వెనుక ‘అసలు’ మిస్టరీ ఇదేనా!
-
Kerala Chief Minister: కేరళ సీఎం ఈయనేనా.?