టాలెంటెడ్ నటి ఆయేషా ఖాన్ తాజాగా ఒక సైబర్ నేరగాడి ఉచ్చులో పడ్డారు. తన పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక ఫేక్ ప్రచారాన్ని ఆమె సాక్ష్యాలతో సహా బయటపెట్టారు. ప్రస్తుతం ఈ వార్త సినీ వర్గాల్లో మరియు ఆమె అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. తన పేరుతో జరుగుతున్న ఈ మోసాన్ని అడ్డుకోవాలని ఆమె తన ఫాలోవర్లను కోరారు.
Also Read : Taapsee Pannu: అలియా భట్ విషయంలో అది నెపోటిజం కాదు..
అసలేం జరిగింది.. అంటే నటి ఆయేషా ఖాన్ పేరు.. ఆమె ఫోటోను వాడుకుంటూ ఒక వ్యక్తి వాట్సాప్లో ‘బిజినెస్ అకౌంట్’ క్రియేట్ చేశాడు. ఆ అకౌంట్ ద్వారా ఆయేషా ఖాన్ లాగా నటిస్తూ ఇతరులకు మెసేజ్లు పంపుతున్నట్లు ఆమె గుర్తించారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ఆయేషా, సదరు వాట్సాప్ చాట్కు సంబంధించిన స్క్రీన్షాట్ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ఇది నేను కాదు! దయచేసి ఇలాంటి మెసేజ్లను ఎంటర్టైన్ చేయకండి’ అంటూ ఆమె తన ఇన్స్టాగ్రామ్ వేదికగా హెచ్చరిక జారీ చేశారు. ఆ ఫేక్ అకౌంట్ వాడుతున్న ఫోన్ నంబర్ను కూడా ఆమె బహిర్గతం చేశారు. సెలబ్రిటీల పేర్లను వాడుకుని సామాన్యులను బురిడీ కొట్టించే ఇలాంటి గ్యాంగ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు.
ఆయేషా ఖాన్ ఇటీవల విడుదలైన ‘ధురంధర్’ చిత్రంలోని ‘షరారత్’ అనే పాటలో క్రిస్టల్ డిసౌజాతో కలిసి స్టెప్పులేసి అందరినీ ఆకట్టుకున్నారు. తన డాన్స్ గ్లామర్తో యూత్ ఆడియన్స్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న తరుణంలో ఇలాంటి చేదు అనుభవం ఎదురవ్వడం బాధాకరం.