ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన 11వ పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తితో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు ఏకమై పీఆర్సీ సాధన సమితి పేరిట ఉద్యమాన్ని ప్రారంభిచనున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. ఈ క్రమంలో పీఆర్సీ సాధన సమితి నేతలు సీఎస్ సమీర్ శర్మతో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం సీఎస్ కు విజ్ఞాపన పత్రాన్ని పీఆర్సీ సాధన సమితి నేతలు అందజేశారు. కొత్త పీఆర్సీ అమలు అంశాన్ని అబయెన్సులో పెట్టాల్సిందిగా సీఎస్ కు ఇచ్చిన విజ్ఞాపన పత్రంలో పేర్కొన్నారు. జనవరి నెలకు సంబంధించి డిసెంబర్ వేతనం అమలు చేయాలని నేతలు కోరారు.
సమ్మె నోటీసు ఇచ్చేందుకు సాంకేతిక ఇబ్బందులు ఉండటంతో సోమవారం ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇవ్వనున్న పీఆర్సీ సాధన సమితి నేతలు తెలిపారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం నిర్ణయాన్ని ఉద్యోగులు, టీచర్లంతా వ్యతిరేకిస్తున్నారని పీఆర్సీ సాధన సమితి స్పష్టం చేసింది. అయితే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని అర్ధం చేసుకోవాలని సీఎస్ సమీర్ శర్మ కోరారు. ఉద్యోగులకు భారీ ఎత్తున నష్టం జరుగుతోందని నేతలు వెల్లడించారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా సమ్మె చేయడానికి వెనుకాడడం లేదని ఉద్యోగ సంఘాల నేతల స్పష్టం చేశారు.