Pamidi: అనంతపురం జిల్లా పామిడి పట్టణ కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రవి అనే యువకుడు మతిస్థిమితం సరిగా లేకపోవడంతో కత్తితో వీరంగం సృష్టించి స్థానికులను భయభ్రాంతులకు గురి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకోగా.. వారిపైనా దాడికి పాల్పడ్డాడు. ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన సమయంలో రవి కత్తితో దాడి చేయడమే కాకుండా, పోలీసు జీప్పై కర్రలతో దాడి చేశాడు. దీంతో కొంతసేపు పామిడి పట్టణంలో గందరగోళ వాతావరణం నెలకొంది.…
PM speaks to Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భారత ప్రధాని నరేంద్రమోడీ ఫోన్ చేశారు. యూఎస్ సుంకాల నేపథ్యంలో ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఇద్దరు నేతల మధ్య సంభాషణ ఆసక్తికరంగా మారింది. మోడీ, ట్రంప్లు రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంపొందించడం, ఎనర్జీ, డిఫెన్స్ రంగాలపై మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.
CM Revanth: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది. సమ్మిట్ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. తెలంగాణ 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం దోహదపడుతోందని గవర్నర్ పేర్కొన్నారు. సమ్మిట్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రముఖ…
IndiGo Crisis: పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో రాజ్యసభలో కేంద్ర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. FDTL ( Flight Duty Times Limitations) నిబంధనలను రూపొందించే ముందు అందరితో చర్చించామని తెలిపారు.
Gun Violence: దక్షిణాఫ్రికాలోని రాజధాని ప్రిటోరియా సమీపంలోని సాల్స్విల్లే ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున జరిగిన భయంకర కాల్పులు స్థానిక ప్రజలను భయబ్రాంతులకు గురి చేశాయి. ఈ దారుణ ఘటనలో 11 మంది మృతి చెందగా, మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. దక్షిణాఫ్రికన్ పోలీస్ సర్వీస్ (SAPS) తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం సుమారు 4:15 గంటల తర్వాత ఈ హత్యాకాండ చోటుచేసుకుంది. అయితే పోలీసులకు సమాచారం ఉదయం 6…
IndiGo CEO Apology: ఇండిగో విమానయాన సంస్థ గత మూడు రోజులుగా ఆపరేషనల్ సమస్యలను ఎదుర్కొంటోంది. భారీ సంఖ్యలో విమానాలు రద్దు కావడంతో పాటు అనేక ఫ్లైట్లు ఆలస్యమవుతుండటంతో దేశవ్యాప్తంగా ఎయిర్ పోర్టుల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులపై ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ ఈరోజు (డిసెంబర్ 4న) అధికారికంగా క్షమాపణలు చెప్పారు.
Shocking : చాంద్రాయణగుట్ట ప్రాంతంలో చోటుచేసుకున్న అనుమానాస్పద మరణాలు స్థానికంగా తీవ్ర భయాందోళనలకు దారితీశాయి. ఓ ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యం కావడంతో, ఇది హత్య, ఆత్మహత్యనా లేక డ్రగ్స్ ఓవర్డోసా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన యువకులను పోలీసులు జహంగీర్, ఇర్ఫాన్లుగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మరణాలు సహజంగా సంభవించి ఉండకపోవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. పోలీసుల విచారణలో ఆటో లోపల కీలక ఆధారాలు…
Bomb In Flight: అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపులు రావడం ఇటీవల సర్వసాధారణం అవుతున్న నేపథ్యంలో.. తాజాగా కువైట్ నుంచి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం (Shamshabad International Airport)కు వస్తున్న ఇండిగో విమానానికి (ఫ్లైట్ నెంబర్: 6E 1234) బాంబు బెదిరింపు మేయిల్ రావడం తీవ్ర కలకలం రేపింది. కువైట్ నుండి అర్ధరాత్రి 1:30 గంటలకు బయలుదేరిన ఈ విమానం ఉదయం 8:10 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకోవాల్సి ఉంది. అయితే, విమానం సిబ్బందికి బాంబు బెదిరింపు…
Robbery Gang Arrest : గత నెల 7వ తేదీన మేడ్చల్ జిల్లాలోని బౌరంపేట్ లో ఓ జ్యువెలర్ షాప్ లో జరిగిన దొంగతనాన్ని ఛేదించి రాజస్థాన్ కు చెందిన ముఠాను అరెస్టు చేసి వారి దగ్గర నుండి సుమారు 15 కిలోల వెండి ఆభరణాలను దుండిగల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. బౌరంపేటలోని సోమేశ్వర్ జ్యువెలరీ షాపు పక్కన ఖాళీగా ఉన్న ఒక షట్టర్ను గమనించిన దుండగులు పథకం ప్రకారం షట్టర్ ను అద్దెకు తీసుకొని రాత్రి…