సీఎం జగన్ పై పరిపూర్ణానంద స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయని పరిపూర్ణానంద స్వామి అన్నారు. కడప జిల్లాలో టిప్పు సుల్తాన్ విగ్రహ ప్రతిష్ఠ చేయాలని ప్రయత్నించారని, కేరళ కూర్గ్ లో కొండ జాతి గిరిజనులను టిప్పు సుల్తాన్ ఉచకోత కోశారన్నారు. అలాంటి వ్యక్తి విగ్రహాన్ని పెట్టాలనుకున్న జగన్ ఆలోచన ఎలాంటిదో అర్థమవుతుందని ఆయన విమర్శించారు. పీఎఫ్ఐ ప్రోత్సహంతో హిందువులు 98 శాతం ఉన్న ప్రాంతంలో మసీదు…
గత రెండు సంవత్సరాలుగా యావత్తు ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి పట్టిపీడిస్తోంది. కరోనా వైరస్ కొత్తకొత్తగా రూపాంతరాలు చెందుతూ మానవ జాతిపై విరుచుకుపడుతోంది. కరోనా కట్టడికి శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు అధ్యయనాలు చేస్తూ కొత్త విషయాలను వెల్లడిస్తున్నారు. కరోనా డెల్టా వేరియంట్ తగ్గుముఖం పడుతున్న తరుణంలో సౌతాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగు చూసింది. అంతేకాకుండా సెకండ్ వేవ్ లో ప్రజలను భయాందోళనకు గురిచేసిన డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేరియంట్ 6 రెట్లు వేగంగా వ్యాప్తి…
టీఆర్ఎస్, బీజేపీ లపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినని వీరభద్రం తీవ్ర విమర్శలు చేశారు. ఒకప్పుడు సేవ.. పనులు చేస్తే ఓట్లు.. సీట్లు వచ్చేవని, ఓట్లు సీట్లు తెచ్చుకున్న టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కరోనా టైం లో ఒక్క ఐసోలేషన్ కేంద్రం అయినా పెట్టరా..? అని ప్రశ్నించారు. మేము పేదల కోసం ఐశోలేషన్ కేంద్రాన్ని పెట్టాం..గర్వంగా చెప్తాం అని ఆయన అన్నారు. మేము ఓట్లు.. సీట్లు గెలుచుకోవడంలో వెనక పడ్డాం నిజమే.. ఓట్లు వచ్చినా.. సీట్లు రాకపోయినా…
గుడివాడ క్యాసినో అంశం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. నిన్న టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ గుడివాడలోని మంత్రి కొడాలి నానికి చెందిన కె కన్వెన్షన్ లో తనిఖీలు చేసేందుకు వెళ్లారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి పరిస్థితుల దృష్ట్యా టీడీపీ నిజ నిర్ధారణకమిటీ సభ్యులు వెనుదిరిగి వెళ్లిపోయారు. అయితే తాజాగా టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు బోండా ఉమా మాట్లాడుతూ.. విజయవాడ కలెక్టర్ కు గుడివాడ క్యాసినో, తనిఖీ వెళ్లిన…
దేశంలో అంతా మోడీ మహల్ సేల్ నడుస్తుందని.. అన్నిటినీ అందులో అమ్మకానికి పెట్టారంటూ సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ విమర్శలు గుప్పించారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. ఇదంతా ప్రజల సంపద.. మోడీ అయ్య జాగీరు కాదు అమ్మడానికి అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. మోడీ హవా నడుస్తుంది మనం ఏం చేయగలం అనుకోకండి.. రైతులు ఢిల్లీ నీ ముట్టడించి.. చట్టాలు వెనక్కి తెచ్చేలా చేయలేదా..? మనం చూడలేదా ..? అని ఆమె మాట్లాడారు. తెలంగాణలో పొడు…
కరోనా పట్ల తన నియోజకవర్గ ప్రజల్లో చైతన్యం నింపేందుకు పంచాయత్ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం టెలికాన్ఫరెన్స్ ద్వారా కోవిడ్ -19 బారిన పడిన పలువురితో మాట్లాడి, ధైర్యంగా ఉండాలని కోరారు. కోవిడ్-19 రోగులకు మెరుగైన చికిత్స అందించడానికి ప్రభుత్వం మరియు ఆయన స్వయంగా సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో ఫీవర్ సర్వే సందర్భంగా అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. “మీరు తప్పనిసరిగా మెడికల్ కిట్ తీసుకోవాలి…
గాజులరామారంలో స్పోర్ట్స్ పార్కుతో పాటు ప్రాణవాయు అర్బన్ ఫారెస్ట్ పార్కు, చింతల్ భగత్సింగ్ నగర్లో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ను వచ్చే వారంలో ప్రారంభించనున్నారు. ఈ సౌకర్యాలన్నీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూకట్పల్లి జోన్లో ఉన్నాయి. ప్రాణవాయు అర్బన్ ఫారెస్ట్ పార్క్ అన్ని వయసుల వారికి వినోద సౌకర్యాలను అందిస్తుంది అని జీహెచ్ఎంసీ అధికారులు వెల్లండించారు. టీఎస్ఐఐసీ ఏరియా, గాజులరామారం వార్డులోని స్పోర్ట్స్ పార్కును కూడా జీహెచ్ఎంసీ రూ.198.50 లక్షలతో నిర్మించింది. భగత్ సింగ్ నగర్ లో…
హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి రూ.1.36 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు శనివారం తెలిపారు. ప్రయాణికుడు శుక్రవారం దుబాయ్ నుండి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నాడు. అతని వద్ద నుంచి రూ.1.36 కోట్ల విలువైన 2,715.800 గ్రాముల బంగారు వస్తువులను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారాలను ఏమార్చడానికి కేటుగాడు తన వెంట తెచ్చుకున్న వస్తువుల లోపల బంగారు గొలుసులు మరియు పేస్ట్ రూపంలో…
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. సోము వీర్రాజును ఇప్పుడు అందరూ సారా వీర్రాజు అనే పిలుస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం పై మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలను సారా వీర్రాజు చేస్తున్నాడని, జగన్ చిటికెన వేలు కూడా తాకే స్థాయి లేని వ్యక్తి అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. కార్పొరేటర్గా కూడా గెలవలేని వ్యక్తి సారా వీర్రాజు.. సీఎంను దేశ ద్రోహి అని వ్యాఖ్యలు చేస్తున్నాడని, ఒళ్లు దగ్గర…
ఎన్ని చట్టాలు చేసినా.. ఎంత కఠిన శిక్షలు వేసిన కామాంధులు మాత్రం మారడం లేదు. అన్యం పుణ్యం తెలియని చిన్నారులపై మృగాళ్ల పడి తమ కామవాంఛ తీర్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. గణపురం మండలం అప్పయ్యపల్లి గ్రామంలో నిన్న 6 ఏళ్ల చిన్నారిపై గుర్రం కిషోర్ (28) అనే వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. అయితే సదరు అమ్మాయి తమ్ముడు అరవడంతో నిందితుడు గుర్రం కిషోర్ పారిపోయాడు. ఈ నేపథ్యంలో నేడు పెద్దమనుషుల…