ఉద్యమంలోకి ఏ రాజకీయ పార్టీనీ అనుమతించమని పీఆర్సీ సాధన సమితి ప్రతినిధులు బండి శ్రీనివాస్, బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీలను.. ట్రేడ్ యూనియన్ నేతలను మాత్రం ఉద్యమంలోకి అనుమతిస్తామని, సీపీఎస్ రద్దు అంశంపై గట్టిగా ఉద్యమిస్తామన్నారు. ఫిబ్రవరి 7 నుంచి నిరవధి సమ్మె నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 24న నోటీసు ఇస్తామని, 23వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. 25న అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు చేపడుతామన్నారు. 26న అన్ని తాలూకా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహానికి మెమొరాండాల సమర్పిస్తామన్నారు.
ఈ నెల 27 నుంచి 30 వరకు నాలుగు రోజుల పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు వారు వెల్లడించారు. ఫిబ్రవరి 3వ తేదీన ఛలో విజయవాడ కార్యక్రమం, ఫిబ్రవరి 5 నుంచి సహాయ నిరాకరణ, ఫిబ్రవరి 7 నుంచి నిరవధిక సమ్మె చేస్తామన్నారు. సంఘాలుగా మా మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలున్నా.. సాధారణ ఉద్యోగుల కోసం మేమంతా కలిశామని తెలిపారు. మంత్రుల కమిటీ ఏదో వేశామని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వం మొండిగా ఉంది. ఆర్టీసీ కార్మికులు కూడా ఉద్యమించేలా పాల్గొనాలి. జీవోలను రద్దు చేయాలి.. లేదా అబెయన్సులో పెట్టాలి.. ఆ తర్వాతే చర్చలకు వెళ్తామని వారు వ్యాఖ్యానించారు.