ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇంటి ముందు ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ ఆధ్వర్యంలో మహిళలు ఆందోళనకు దిగారు. కోడిగుడ్లతో దాడి చేసేందుకు యత్నించారు. ఆందోలనకు దిగిన మహిళలను ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకున్నారు. మహిళలను అరెస్ట్ చేసి…పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. మరో వైపు అదుపులోకి తీసుకున్న మహిళలను విడిచిపెట్టాలని బీజేపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఇక అటు కార్పొరేటర్ పై దాడికి నిరసనగా మల్కాజ్ గిరి బంద్ కు పిలుపునిచ్చింది బిజెపి పార్టీ.…
స్వాతంత్ర్య దినోత్సవ రోజున ప్రజల చేత ఎన్నుకోబడ్డ కార్పొరేటర్ శ్రవణ్ పై స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన అనుచరులు బీర్ బాటిల్ తో, రాడ్లతో దాడి చేశారని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. లోకల్ ఎమ్మెల్యే మైనంపల్లి గుండాయిజం చేస్తున్నాడని… రేపటి నుండి ఆయన కబ్జాలు అన్ని బయటకు తీస్తామని హెచ్చరించారు. మర్డర్ లు చేయగానే పోటుగాడు అవుతాడా..? బీజేపీలో చేరతా అని వచ్చాడు ఇలాంటి వాడే అని మేము దగ్గరికి తీయలేదన్నారు..పేదోళ్లను ఇబ్బంది పెడుతున్నాడు…
కమలాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ… దేశ చరిత్రలు ముఖ్యమంత్రి ఆలోచించని గొప్ప పథకం దళిత బంధు పథకం అని దళిత జాతి ఉన్నతంగా అభివృద్ధి చెందడానికి విద్యారంగంలో గొప్పగా ఎదగాలని ఆకాంక్షించి… ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఈ పథకం హుజూరాబాద్ నియోజకవర్గం లో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టారు. ఇక్కడ అమలు జరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన దళిత కుటుంబాలకు ఈ పథకం వర్తింపజేస్తారు. కావాలని బీజేపీ…
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈనెల 24 నుంచి తెలంగాణలో పాదయాత్ర చేయబోతున్నారు. ఈ పాదయాత్ర పేరును ఈరోజు ఖరారు చేశారు. చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత పేరును ప్రకటించారు ఎమ్మెల్యే రాజాసింగ్. ప్రాజా సంగ్రామ యాత్ర పేరుతో ఈనెల 24 నుంచి బండి సంజయ్ పాదయాత్రను చేపట్టబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే పాదయాత్రకు సంబందించిన రూట్మ్యాప్ను ఖరారు చేసిన బీజేపీ, యాత్ర పేరు కూడా ప్రకటించడంతో…
హుజురాబాద్ ఉపఎన్నిక మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెలలోనే ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడుతుందని రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఇప్పటి వరకు భావించాయి. అయితే కరోనా పరిస్థితుల్లో ఎన్నికను నిర్వహించడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయా? నిర్వహిస్తే ఎలాంటి నిబంధనలను అమలు చేయాల్సి ఉంటుందో చెప్పాలంటా రాజకీయ పార్టీలను సూచనలు, సలహాలు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. ఇందుకు ఈ నెల 30వ వరకు గడవు విధించింది. దీంతో ఎన్నికల షెడ్యూల్ ఇప్పట్లో వెలువడే…
దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం కాబోతున్నాయా అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిణామాలు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ కేంద్రం నుంచి గద్దె దించాలనే లక్ష్యంతో కలిసి పనిచేయడానికి సిద్ధం అవుతున్నాయి. ఈనెల 20 వ తేదీన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నేతృత్వంలో ప్రతిపక్షాలు సమావేశం కాబోతున్నాయి. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై దృష్టిసారించనున్నాయి. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించే అవకాశం ఉంది. ధరల పెరుగుదల,…
తెలుగు రాష్ట్రాల్లో గెలుపు గుర్రాల కోసం బీజేపీ ఢిల్లీ నాయకత్వం ఇప్పటి నుంచే వేట మొదలుపెట్టిందా? ప్రధాని మోడీ నేరుగా రంగంలోకి దిగారా? క్షేత్రస్థాయిలో సర్వే చేపడుతున్నారా? బీజేపీవర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? నేతల ఆలోచనలు ఎలా ఉన్నాయి? సర్వే పేరుతో నేరుగా రంగంలోకి మోడీ! ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల గురించి చివరిక్షణాల్లో పార్టీల వడపోతలు కామన్. మొన్నటి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఏపీ, తెలంగాణాల్లో బీజేపీ చేసింది కూడా ఇదే. ఇప్పుడు మాత్రం బీజేపీ…
ప్రజలను ఆకట్టుకోవడానికి రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు రకరకాల విన్యాసాలు చేస్తుంటారు.. కొన్ని సార్లు గొంతు సవరించాల్సి వస్తే.. మరికొన్ని సార్లు కాలు కదిపి స్టెప్పులు కూడా వేయాల్సి వస్తుంది… తాజాగా.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారిపోయింది… సింగర్గా మారిపోయిన సీఎం శివరాజ్సింగ్ చౌహాన్… బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలేష్ విజయ్వర్గీయతో కలిసి పాటందుకున్నారు.. భోపాల్లోని అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఇద్దరు దిగ్గజ నేతలు.. ప్రముఖ…
హుజురాబాద్ ఉప ఎన్నికల కోసం అందికంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించింది అధికార టీఆర్ఎస్ పార్టీ… విద్యార్థి ఉద్యమ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ను బరిలోకి దింపింది.. మరోవైపు.. తన నియోజకవర్గమైన హుజురాబాద్లో ఈటల రాజేందర్ పాదయాత్రలు, సభలు, సమావేశాలు జరుగుతున్నా.. ఆయనే అభ్యర్థి అని ఇప్పటి వరకు అధిష్టానం తేల్చింది లేదు.. ఇక, కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థి వేటలో ఉంది.. అయితే, గెల్లు శ్రీనివాస్ యాదవ్.. కేసీఆర్ బానిస అంటూ ఈటల రాజేందర్ కామెంట్ చేయడంపై…
కేసీఆర్ రా.. దమ్ముంటే నాపై పోటీ చేయి.. హరీష్రావు రా.. ధైర్యం ఉంటే నాపై పోటీ చేయాలి అంటూ మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ విసిరిన సవాల్కు కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్రావు.. తాజాగా హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ను ప్రకటించిన సంగతి తెలిసిందే కాగా.. హుజూరాబాద్ లో స్వాగతం చూస్తే గెల్లు శ్రీనివాస్ భారీ మెజార్టీతో గెలువబోతున్నాడని అర్థమవుతోందన్నారు.. ఎన్నికలు వచ్చినప్పుడు గెలిస్తే ఏం చేయాలో చెప్పాలి.. కానీ, బీజేపీ…